Skip to main content

టీఆర్ఎస్ గొంతుకలై గర్జించే శ్రవణ్, కర్నె ప్రభాకర్‌లకు కేసీఆర్ మొండిచెయ్యి



తెలంగాణ రాష్ట్రసమితి వాదాన్ని వివిధ వేదికలపై, టీవీ చర్చా కార్యక్రమాలలో బలంగా వినిపించే వారిలో డాక్టర్ దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్ ముందుంటారు(ఇంతకుముందు రఘునందన్‌రావుకూడా ఈ జాబితాలో ఉండేవారు. అయితే ఆయన గత ఏడాది మే నెలలో పార్టీనుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు). పార్టీ అధికార ప్రతినిధులు మరెందరో ఉన్నా, ప్రత్యర్ధి పార్టీల నాయకుల విమర్శలను, వాదనలను తిప్పికొట్టడంలో వీరిద్దరిదే పైచేయిగా ఉంటుంది. అయితే పార్టీకోసం ఇంత గొంతుచించుకుని అరిచిన వీరిద్దరికీ పార్టీ అధినేత మొండిచెయ్యే చూపారు.

శ్రవణ్ గతంలో ప్రజారాజ్యంలో చురుకైన పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా మెలుగుతూ ఆయన సిఫార్సుద్వారా సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ సాధించి ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీనుంచి డాక్టరేట్ పొందిన శ్రవణ్, మంచి ఆలోచనాపరుడు, వక్త కావటంతో తక్కువ సమయంలోనే టీఆర్ఎస్‌లో పొలిట్‌బ్యూరోలో స్థానం సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో భువనగిరి, ముషీరాబాద్‌లలో ఏదో ఒకస్థానంలో పోటీచేయాలని ప్రయత్నించారుగానీ  టికెట్‌ దక్కలేదు.

ఇక పార్టీ కార్యక్రమాల అమలుకమిటీ ఛైర్మన్ కర్నె ప్రభాకర్ మొదటినుంచీ కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఉన్నారు. నల్గొండజిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి టికెట్‌కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఆయనకు నిరాశే మిగిలింది. కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి ఆ టికెట్‌ను కేటాయించారు.

పొద్దున లేచినదగ్గరనుంచీ పార్టీకి మద్దతుగా వాదిస్తూ, పార్టీని, నాయకులను భుజానకెత్తుకుని ప్రత్యర్ధులపై ఒంటిమీద దూసుకెళ్ళే వీరు, టికెట్‌లు దక్కకపోవటంవలన ఎంత నిరాశకు గురై ఉంటారో తేలిగ్గా ఊహించుకోవచ్చు. మరోవైపు, పార్టీ టికెట్‌లు ఆశించి భంగపడ్డవారిని విడివిడిగా పక్కకు పిలిచి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదట ఎమ్మెల్సీ ఇచ్చేది నీకేనంటూ ఆశలు కల్పించి మైమరిపిస్తున్నారట మాటల మరాఠీ.

                                                                -------


Looking for Content Writers for Telugu web audience?

కంటెంట్ రైటింగ్ సేవలు కావలసినవారు సంప్రదించగలరు 

tejasswi11@gmail.com


image courtesy: tv9

Comments

  1. వీరిద్దరికే కాదు నాయని నరసింహారెడ్డి లాంటి సీనియర్ నాయకుడికి కూడా మొండిచేయే మిగిలింది.

    ReplyDelete
    Replies
    1. పార్టీ వాయిస్‌గా ఉండీ టికెట్ దక్కించుకోలేకపోయినవాళ్ళగురించి నేను లైన్ తీసుకున్నాను.

      Delete
    2. కరేక్తేనండీ. అందుకే రఘునందన్ & చెరుకు సుధాకర్ పార్టీ వదిలేశారేమో?

      Delete
    3. గర్జన లిక అవసరం లేదు కదా. గర్జించే వాళ్లతో యెప్పటికయినా ప్రమాదమే, యేక చత్ర అధికారానికి కావలసింది విధేయులే!

      Delete
    4. గురూ తెలబానిస్తాన్లో ఎవరు ఎలా సంక నాకిపోతే నీకెందుకు?

      Delete
    5. యేదో ఒక చిన్న మాట మాట్లాడ్డం కూడా తప్పేనా? ఆంధ్రాలో ఉన్న ఒక కమ్యునిష్టు మేధావి అంతర్జాతీయ విషయాల గురించి కూడా తన అభిప్రాయాల్ని వెల్లడించుతున్నప్పుడు మీరు నన్నెందుకు వ్యతిరేకిస్తున్నారు?విడిపోయి కలిసుందాం అంటున్నవాళ్ళు ఈ చిన్న మాటకే ఇంతగా నీ ప్రాంతం నా ప్రాంతం అంటున్నారేమిటో? నేనెప్పుడూ మిమ్మ్మల్ని అలా(తెలబానిస్థాన్ అని) అనుకోలేదు.

      Delete
  2. FYI శ్రవణ్ కాంగ్రెసులో చేరారు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

గ్రేటర్‌లో జనం గుణపాఠం చెప్పవలసింది కేసీఆర్‌కా, బీజేపీకా?

  రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్‌ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.