Skip to main content

Posts

Showing posts from 2021

ఈ 'బుల్లెట్టు బండి...' పాట ఎందుకింత సంచలనం అయింది?

'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా...' పాట సోషల్ మీడియాలో సృష్టిస్తున్న సంచలనం వెనక ఒక ప్రత్యేకత ఉంది. ఆ కొత్త పెళ్ళికూతురు ఏ పాటకయితే డాన్స్ చేసిందో ఆ పాటలోని వాక్యాలు ఆమె పాలిట నిజమై కూర్చున్నాయి. ఆ పాటలోని వాక్యాలలో అక్షరాలలో యథాతధంగా రాసి ఉన్నట్లే తన భర్తకు, మెట్టినింటివారికి ఆ అమ్మాయి ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ తీసుకొచ్చింది. ఆ నవవధువు సాయిశ్రియకు పెళ్ళిపట్ల, తన కాబోయే భర్తపట్ల ఆపేక్ష, ఆశలు, నమ్మకం ఎంత బలంగా ఉన్నాయోగానీ, ఆ ప్రకృతి(లా ఆఫ్ ఎట్రాక్షన్‌లో చెప్పే యూనివర్స్) విని తథాస్తు అనినట్లుంది. రాత్రికి రాత్రి ఇన్‌స్టంట్‌గా తాను సెలబ్రిటీ అవ్వటమే కాదు తన భర్తకు, మెట్టినింటివారికి, పుట్టింటివారికి కూడా కనీవినీ ఎరగని గుర్తింపు తీసుకొచ్చింది... పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.

ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కొనాలనుకునేవారికి పండగే: అటు 'ఓలా', ఇటు 'ఒన్'!

  ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కొనాలనుకునేవారికి ఇది శుభవార్తే! నిన్న జెండా పండగనాడు ఒకేరోజు రెండు వేర్వేరు కంపెనీలు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను లాంచ్ చేశాయి. ప్రముఖ క్యాబ్ యాగ్రిగేటర్ కంపెనీ 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్‌ల రంగంలో ప్రవేశించి తయారుచేసిన స్కూటర్‌ను ఆ సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ నిన్న మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేయగా, బెంగళూరుకు చెందిన 'సింపుల్ ఎనర్జీ' అనే స్టార్ట్ అప్ సంస్థ ప్రపంచంలోనే మరెక్కడా లేనటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌తో 'ఒన్' అనే స్కూటర్‌ను నిన్న సాయంత్రం 5 గంటలకు విడుదల చేసింది. ఈ రెండు స్కూటర్‌లు రెండూకూడా ధరలోనూ, టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోనూ పోటీపడుతుండటం విశేషం. వీళ్ళ పోటీ పుణ్యమా అని ఎలక్ట్రిక్ స్కూటర్‌ల విషయంలో మార్కెట్ బయ్యర్స్‌కు అనుకూలంగా మారటంతో అంతిమంగా వినియోగదారులు/కొనుగోలుదారులు లాభపడనున్నారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.

మంచు ఫ్యామిలీ సినిమాల ప్రమోషన్‌లకు పెద్దదిక్కు చిరంజీవే! ఇండస్ట్రీకి మాత్రం కాదా?

తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయిందంటూ మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు నర్మగర్భంగా ఉన్నాయని పలు చోట్ల రాస్తున్నారు. కానీ, అతను సూటిగానే ఒక విషయాన్ని ఢంకా బజాయించి చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు ఉన్నంతలో చిరంజీవే పెద్ద దిక్కు అని తమ్మారెడ్డి భరద్వాజ, మురళీ మోహన్ వంటి కొందరు ప్రముఖులు అక్కడక్కడా వినిపిస్తున్న వాదనను తాము(మంచు ఫ్యామిలీ) అంగీకరించబోమన్నది అతని వ్యాఖ్యల అంతరార్థం.  వివాదాలకు మారుపేరు, చిరంజీవి ఆధిపత్యాన్ని అడుగడుగునా సవాల్ చేసే మోహన్ బాబు ఇలా తన కుమారుడితో వ్యాఖ్యలు చేయించటం సహజ పరిణామమే కాబట్టి అంతవరకు బాగానే ఉంది. కానీ, ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. ఇటీవలికాలంలో మంచు వారు తమ సినిమాలు అన్నింటికీ చిరంజీవితోనే ప్రమోషన్ చేయిస్తున్నారు, మరోవైపు పెద్దదిక్కుమాత్రం అతనుకాదు అంటున్నారు, ఈ మతలబు ఏమిటీ అని అటు ఇండస్ట్రీలోనివారు, ఇటు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనిలో నిజంలేకపోలేదు. పూర్తి వ్యాసం చదవటానికి ఈ లింక్ లోకి వెళ్ళండి . 

పోలీసుల అదుపులో మల్లిక్ పరుచూరి: గూగుల్ సైంటిస్ట్ చేసిన తప్పులు ఇవే!

  గూగుల్ సైంటిస్ట్ మల్లిక్ పరుచూరిని హైదరాబాద్ పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు .  థర్డ్ వేవ్ లో ఇంటికో శవం లేస్తుందనే వ్యాఖ్యలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారనే అభియోగంపై ఆయనను సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు .  ఆయనకు మద్దతుగా వీరమాచనేని రామకృష్ణ ,  మరికొందరు మద్దతుదారులు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంఘీభావం ప్రకటించారు .  ఇప్పుడంటే సెకండ్ వేవ్ ఉపశమించటంతో కాస్త తగ్గిందిగానీ ,  ఆమధ్య ,  ఒక నెలరోజుల క్రితం ఈ మల్లిక్ పరుచూరి గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చ జరిగింది .  ఇతనికి మద్దతుగా ,  వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ,  బయట తెలుగు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా వాదోపవాదాలు చేసుకున్నారు . మల్లిక్ పరుచూరి తనను తాను ఒక లూయీస్ పాశ్చర్‌ ( వైద్యరంగంలో అపూర్వమైన ఆవిష్కరణలు చేసి మానవాళికి మహోపకారం చేసిన ఒక జీనియస్ సైంటిస్ట్ )   లాగా ఊహించేసుకుని కోవిడ్ వ్యాధికి  తనదైన శైలిలో  మందులు  ప్రిస్క్రైబ్ చేసి వార్తలలోకెక్కిన సంగతి తెలిసిందే . అలా మందులు సూచించటమేకాకుండా ,  సాంప్రదాయక (conventional)  వైద్య విధానంలో కోవిడ్‌ చికిత్సకు అనుసరిస్తున్న ప్రతి పద్ధతిన

బెంగాల్‌లో దుబ్బాక తరహా ప్రయోగం చేస్తున్న బీజేపీ!

దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ సాధించిన ఘనవిజయం వెనక పైకి కనిపించని అంశం ఒకటి ఉంది. బీజేపీకి చెందిన కొందరు కరుడుగట్టిన కార్యకర్తలు, మంచి మంచి ఉద్యోగాలలో ఉన్న మోదీ వీరాభిమానులు ఎక్కడెక్కడినుంచో వచ్చి రఘునందన్ రావు విజయంకోసం విపరీతంగా కష్టపడ్డారు. పోలింగ్‌కు వారం-పది రోజులముందునుంచి దుబ్బాకలోనే ఫంక్షన్ హాల్స్‌లో మకాం వేసి నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటించి ఇంటింటికీ వెళ్ళి రాత్రింబవళ్ళూ కష్టపడి ప్రచారం చేశారు. స్థానికంగా, బీజేపీ నేత జితేందర్ రెడ్డి వారిని సమన్వయం చేసుకుంటూ వారికి కావలసిన వసతి సౌకర్యాలను సమకూర్చారు. అలా రఘునందన్ రావు విజయం - వెనక వివిధ ప్రాంతాలనుంచి వచ్చి సైలెంట్‌గా పనిచేసుకెళ్ళిన ఈ కరుడుగట్టిన కార్యకర్తల పాత్రకూడా ఉంది. వీళ్ళను పోల్ మేనేజిమెంట్ పరిభాషలో చెప్పాలంటే ఫుట్ సోల్జర్స్ అంటారు... పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.