Skip to main content

చంద్రబాబుకు ఒకకంట పన్నీరు, ఒకకంట కన్నీరు



రెండుకళ్ళ సిద్ధాంతకర్త, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పరిస్థితి ఒక కంట పన్నీరు, ఒక కంట కన్నీరు అన్నట్లుంది. సీమాంధ్రలోనేమో కాంగ్రెస్‌నుంచి వస్తున్ననేతలతో పార్టీ కార్యాలయానికి హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండగా, అటు తెలంగాణలో పార్టీ దాదాపుగా ఖాళీ అయిన పరిస్థితి.

సీమాంధ్రలో తెలుగుదేశం కార్యాలయాలు కిటకిటలాడిపోతున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ఎన్నో పదవులు నిర్వహించిన జేసీ దివాకరరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, రాయపాటి సాంబశివరావు, మండలి బుద్ధప్రసాద్‌వంటి సీనియర్ నాయకుల దగ్గరనుంచి నిన్నటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్, గల్లా అరుణ, పితాని సత్యనారాయణ ప్రభృతులవరకు పలువురు కాంగ్రెస్ అగ్రనాయకులు పసుపు తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛోటా, మోటా నాయకులకైతే కొదవేలేదు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ను ఖాళీచేయించి చావుదెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ఆ పార్టీనుంచి వస్తున్నవాళ్ళను  వస్తున్నట్లు అక్కున చేర్చుకుని పార్టీ కండువా కప్పుతున్నారు చంద్రబాబు.

ఇక తెలంగాణలో పార్టీ పరిస్థితి చూస్తే సీమాంధ్రకు పూర్తిగా రివర్స్. చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతానికి విసిగి కొందరు, తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ చేపట్టిన ఆకర్ష్ ఆపరేషన్‌కు ఆకర్షించబడి మరికొందరు...పదులసంఖ్యలో నాయకులు తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పారు. తెలంగాణలో టీడీపీ కార్యాలయాలకు టులెట్‌ బోర్డులు పెట్టుకోవాల్సిందేనంటూ హరీష్‌వంటి కొందరు టీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారుకూడా.  2009 ఎన్నికలదగ్గరనుంచి తీసుకుంటే చెన్నమనేని రమేష్ నుంచి మొదలుపెట్టి గంగుల కమలాకర్, నాగం జనార్దనరెడ్డి, కడియం శ్రీహరి, హరీశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, వేణుగోపాలాచారి, జోగు రామన్న, సత్యవతి రాథోడ్, కేఎస్ రత్నం, మహేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, నగేష్, బోడ జనార్దన్, హనుమంతు షిండే, మర్రి జనార్దన్ రెడ్డినుంచి నిన్నటి బాబూ మోహన్ వరకు సీనియర్ నాయకుల రాజీనామాల పరంపర కొనసాగుతూ ఉందిఎర్రబెల్లి దయాకరరావు, ఎల్.రమణ, మోత్కుపల్లి నరసింహులు, దేవేందర్‌గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవంత్ రెడ్డి మాత్రమే ఇప్పుడు అక్కడ మిగిలిఉన్న అగ్రనాయకులు. వీరిలోకూడా ఎర్రబెల్లి ఈ మధ్య జానారెడ్డిద్వారా కాంగ్రెస్‌లోకి దూకేందుకు బేరాసారాలాడారుగానీ, ఎందుకో మళ్ళీ టీడీపీలోనే కొనసాగుతున్నారు.

ఆ విధంగా ఒక ప్రాంతంలో మోదం, మరో ప్రాంతంలో ఖేదం చవిచూస్తున్న చంద్రబాబునాయుడికి ఇది విచిత్ర అనుభవమేనని చెప్పుకోవాలి


image courtesy: wikipedia

Comments

  1. ఈ ఫిరాయింపుల వల్ల వచ్చే లాభనష్టాలు పెద్దగా లేవు. పార్టీల బలాబలాల బట్టి వచ్చీపోయే వారు ఉంటారు. "Jumping" is a symptom, not the problem.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.