Skip to main content

చెవుల్లో అమృతం పోస్తున్నట్లనిపించే లక్కీ అలీ పాట




అద్భుతమైన మెలోడీతో సాగిపోయే ఈపాట, లక్కీ అలీ రూపొందించిన 'గోరీ తేరీ ఆంఖే...' అనే ప్రైవేట్ ఆల్బమ్‌లోనిది.  2001లో ఈ ఆల్బమ్‌ విడుదలయింది. దీనిలో ఎనిమిది పాటలున్నప్పటికీ పై పాటే హైలైట్. వియోగంమీద ఉన్న పాటలలో దీనికి మొదటి వరుసలో స్థానం కల్పించొచ్చు. లక్కీ అలీ గాత్రం చెవులలో అమృతం పోస్తున్నట్లుంటుంది. మంచి సంగీతంతోబాటు దృశ్యపరంగా కూడా బాగానే విజువలైజ్ చేశారని చెప్పొచ్చు. 

అలనాటి బాలీవుడ్ హాస్యనటుడు మహమూద్ కుమారుడైన లక్కీ అలీ ఆ వారసత్వంతో సంబంధం లేకుండా స్వతహాగా మంచి ప్రతిభ ఉన్న కళాకారుడు. అయినా ఎందుకో రావల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తుంది. నటనలోకూడా ప్రవేశముంది. త్రికాల్, కాంటే, సుర్, కసక్‌వంటి కొన్ని బాలీవుడ్ చిత్రాలలో నటించారు. మూడు వేర్వేరు దేశాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలను పెళ్ళి చేసుకున్న లక్కీకి ఐదుగురు పిల్లలు. మరో విశేషమేమిటంటే అలనాటి ప్రసిద్ధ కథానాయిక మీనాకుమారి, లక్కీ అలీ తల్లి మహేలక సొంత అక్కా చెల్లెళ్ళు.

ఈ పాట సాహిత్యం కావాలంటే ఈ లింక్‌కు వెళ్ళండి - http://lucky-ali-songs.blogspot.in/

Comments

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.