Skip to main content

పవన్‌కై చంద్రబాబు వెంపర్లాటను ఆ రెండు వర్గాలూ జీర్ణించుకోగలవా!



మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మోడి సభలో తనతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబునాయుడు నిన్న స్వయంగా అతని కార్యాలయానికి వెళ్ళి మరీ కలుసుకోవటం తెలుగుదేశంపార్టీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. తెలుగుదేశం శ్రేణులలోని ఒక వర్గానికి, నందమూరి కుటుంబంలోని హరికృష్ణ వర్గానికి ఇది జీర్ణించుకోలేని పరిణామమని చెప్పొచ్చు.

మొదటివర్గం కోణంచూస్తే, తెలుగుదేశంలో కోస్తాలోని శ్రేణులలో ఒక సామాజిక వర్గం చంద్రబాబు-పవన్ భేటీ వ్యవహారంపై లోలోపల రగిలిపోతోంది. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలోని టీడీపీ శ్రేణులు తల కొట్టేసినట్లయిందని భావిస్తున్నారు. దీనికి మూలాలు ఈనాటివికావు. తెలుగుదేశాన్ని తమ సొంతసంస్థగా పరిగణించే కమ్మ సామాజికవర్గానికీ, పవన్ కళ్యాణ్ సామాజికవర్గమైన కాపులకు కోస్తాలో చిరకాలంగా బద్ధవైరమున్న సంగతి తెలిసిందే. ఊళ్ళలో ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన సినీ అభిమానులుకూడా తమ తమ వర్గాలకు చెందిన నందమూరి, మెగా హీరోలకు 'బై డిఫాల్ట్' అభిమానులుగా మారిపోతుంటారు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్‌వద్దకే స్వయంగా వెళ్ళటమేకాక, ఒక పెద్దనేతను కలుసుకున్నపుడు చెప్పినట్లుగా 'మర్యాదపూర్వకంగా కలుసుకున్నాను' అనిచెప్పటం,  కోస్తాలోని ఆయన వర్గంవారు భరించలేకపోతున్నారు. మరోవైపు తనవద్దకు వచ్చిన చంద్రబాబువద్ద పవన్ కళ్యాణ్ హావభావాలు, బాడీ లాంగ్వేజ్ లెక్కలేనట్లుగా ఉండటం వారికి పుండుమీద కారం రాసినట్లుంది.

ఇక రెండోవర్గం కోణంచూస్తే, హరికృష్ణ, ఆయన కుమారుడు మినీ ఎన్‌టీఆర్‌కుకూడా ఇది జీర్ణించుకోలేని పరిణామమేనని చెప్పొచ్చు. హిందూపూర్ టికెట్ నిరాకరించబడటంతో హరికృష్ణ, ఆయన కుమారుడు లోలోపల రగిలిపోతున్న విషయం తెలిసిందే. మరోవైపు జూనియర్ ఎన్‌టీఆర్‌ను ప్రచారానికి బొట్టుపెట్టి పిలవాల్సిన అవసరంలేదంటూ బాలయ్య, లోకేష్ ప్రకటనలు ఇచ్చిన సంగతికూడా విదితమే(పైపెచ్చు, జూనియర్ ఎన్‌టీఆర్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ లేరని, ఉన్నదంతా నందమూరి ఫ్యాన్సేననికూడా బాలయ్య కుండబద్దలు కొట్టారు). కాగా, ఇంట్లోనే ఉన్న స్టార్ - ఎన్టీఆర్‌ను పట్టించుకోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌వద్దకు వెళ్ళి బ్రతిమలాడటం హరికృష్ణ అండ్ సన్స్‌ అవమానాలను రెట్టింపు చేసినట్లయిందని చెప్పొచ్చు.

ఏది ఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుగానీ, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణగానీ తమ మాటల్లో పదే పదే పవన్ కళ్యాణ్‌ను ప్రస్తావించటానికి, అతని మద్దతుకోసం ప్రయత్నించటానికి కారణం అతనిమీద ప్రేమకాదని, యూత్‌లోనూ, అతని సామాజికవర్గంలోనూ ఉన్న ఫాలోయింగేనన్నది తెలిసిన విషయమే. దానికితోడు జూనియర్ ఎన్‌టీఆర్ లేని లోటును పవన్‌ద్వారా అధిగమించాలని చంద్రబాబు ప్రయాస పడుతున్నారు. తన మిత్రుడు పొట్లూరి వరప్రసాద్‌కు విజయవాడ టికెట్ ఇవ్వలేదని చంద్రబాబుపై గుర్రుగా ఉన్న పవన్, మొత్తానికి నిన్నటిభేటీ తర్వాత మెత్తబడ్డట్టే ఉన్నారు. రేపటినుంచి టీడీపీ, బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఇవాళ ప్రకటన విడుదలచేశారు. పవన్ మద్దతువలన ఫలితాలు గణనీయంగా మారతాయని చెప్పలేముగానీ, తెలుగుదేశానికి ఎంతోకొంత లబ్దికలుగుతుందనిమాత్రం చెప్పొచ్చు.

Comments

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర