Skip to main content

చిరంజీవి, మోహన్‌బాబులపై బాలయ్య సెటైర్లు


హైదరాబాద్‌లో గురువారంరాత్రి జరిగిన లెజెండ్ విజయోత్సవ సభలో హీరో బాలయ్య చిరంజీవి, మోహన్‌బాబులపై చెణుకులు విసిరారు. లెజెండ్ టైటిల్‌గురించి వివరించే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ టైటిల్ మాస్‌కు అర్థమవుతుందో, లేదోనని మొదట సందేహించామని తెలిపారు. అయితే ఆమధ్య కొందరు లెజెండ్ ఎవరంటూ కొట్టుకుని ఆ పదాన్ని పాపులర్ చేశారంటూ లెజెండ్ పురస్కారంపై గతంలో మోహన్‌బాబు, చిరంజీవి మధ్య జరిగిన గొడవను పరోక్షంగా ప్రస్తావించారు. తాము ఈ టైటిల్ పెట్టటంద్వారా అసలు లెజెండ్ ఎవరో, ఏమిటో ప్రేక్షకులకు చూపించామన్నారు.

సినీపరిశ్రమలోగానీ, రాజకీయాలలోగానీ తన తండ్రి ఎన్‌టీరామారావు ఒక్కరే లెజెండ్ అని బాలయ్య చెప్పారు. ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని, అందరిదీనన్నారు. ఎన్‌టీఆర్‌ను మరిచిపోయి లెజెండ్ ఎవరు...ఎవరు అని వెతికేవారు పిచ్చివాళ్ళని, అలా వెతికేవారికి పిచ్చెక్కిందేమోనని ప్రజలు అనుకుంటారని(#*@!?*#!) చెప్పారు.

తెలుగు సినీపరిశ్రమ వజ్రోత్సవాలలో లెజెండ్ అంటూ కొందరికి పురస్కారాలు ఇస్తూ తనను పట్టించుకోకపోవటంపై తాను లెజెండ్ కాదా అంటూ మోహన్‌బాబు గొడవకు దిగటం, చిరంజీవి దానికి ఆవేశపూరితంగా సమాధానం ఇవ్వటం తెలిసిందే.   

బాలయ్య చెప్పిన మాటలను యధాతధంగా చూడాలనుకుంటే ఈ లింక్‌లోని వీడియోను చూడండి - https://www.youtube.com/watch?v=-KCRJIuj0vc#t=77 

Comments

  1. మరే! మా నాన్న, మా బాబయి, నెను, మా పిల్లలు మాత్రమే లెజెండ్స్ అంటే

    ReplyDelete
  2. Asahyangaa...siggulekundaa aa viggemitraabaaboo nija jeevitamlo koodaa .
    Nija jeevitamlo kooDaa mosamenaa

    ReplyDelete
  3. Useless people...put this guy in a zoo..behind a enclosure...hate to see his action...dialogues..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

కమ్మవారిని దెబ్బతీయటానికే రాజధానిని జగన్ మార్చారా?

కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే  అంశంపై   మంత్రి   కొడాలినాని నిన్న అసెంబ్లీలో   ఒక   అనూహ్యమైన  కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా   మంత్రి   కొడాలినాని  అసెంబ్లీలో  చేసిన   ప్రసంగం   ఆద్యంతం   ఆసక్తికరంగా   సాగింది .  మాజీముఖ్యమంత్రి   చంద్రబాబు   నాయుడు ,  టీడీపీలోని   తమ   సామాజికవర్గం   నాయకులు ,  ఆ  పార్టీకి   సంపూర్ణ   సహకారాలు   అందిస్తున్న   పత్రికాధిపతులు   రామోజీరావు ,  రాధాకృష్ణ , టీవీ5  నాయుడులపై తనదైనశైలిలో   నాని   చెణుకులు  విసిరారు.    పంచారామాలలో  ఒకటైన పుణ్యక్షేత్రం,  అంతర్జాతీయంగా  ఖ్యాతిగాంచిన  బౌధ్ధ   స్థూపం  ఉ న్న   పవిత్రస్థలం ,  శాతవాహనులకు ...

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .