Skip to main content

చరణ్‌కంటే పెద్దదైన జెనీలియాను కాకుండా ఆరెంజ్‌లో ఎవరైనా ఫ్రెష్‌ఫేస్‌ను తీసుకోవాల్సింది

ఆరెంజ్ ప్రోమోలు చూస్తుంటే జెనీలియాలో ఫ్రెష్ లుక్ కనిపించడంలేదు. ముఖం బాగా డ్రెయిన్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అఫ్ కోర్స్ సినిమా మొత్తంలో అలా ఉండకపోవచ్చు. కానీ ఫ్రెష్ ఫేస్ ఎవరినయినా తీసుకోవాల్సింది(like Samantha). దానికి తోడు వయసురీత్యా కూడా చరణ్ కంటే జెనీలియా రెండేళ్ళు పెద్దది కావడంతో అది కూడా స్పష్టంగా తెలిసిపోతోంది(చరణ్ కు 25ఏళ్ళయితే, జెనీలియాకు 27 ఏళ్ళు). చరణ్ కు ఇది మూడో సినిమా అయితే జెనీలియాకు ఇది ముప్పై ఒకటో ముప్పై రెండో సినిమానో. ఫారెన్ బ్యాక్ గ్రౌండ్ లో ఇలా కావాలి అని చరణ్ చెప్పిన ఔట్ లైన్ మేరకు కథను తయారుచేసుకున్నానని, హీరోయిన్ పాత్రకు జెనీలియాయే సరైన ఛాయిస్ అని ఆమెను తీసుకున్నామని దర్శకుడు భాస్కర్ చెబుతున్నాడు.

ఆరెంజ్ పాటలు మొదటిసారి పెద్దగా అనిపించకపోయినా వింటున్న కొద్దీ బాగుంటున్నాయి. అయితే వీటిలో ఒక్క డ్యూయెట్ కూడా లేకపోవడం విశేషం. డ్యూయెట్ లేకుండా రొమాంటిక్ సినిమా ఏమిటో...కొత్తగా ఉంది. ఇక భాస్కర్ ఈ సినిమాకు చాలా ఎక్కువ ఖర్చు పెట్టించాడని, మెగా బ్రదర్స్ దీనిపై అసంతృప్తిగా ఉన్నారని వెబ్ సైట్లలో పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిజల్ట్ బట్టి చరణ్ ఛాయిస్ కరెక్టా కాదా అనేది తెలుస్తుంది.

Comments

  1. "ఆరెంజ్ ప్రోమోలు చూస్తుంటే జెనీలియాలో ఫ్రెష్ లుక్ కనిపించడంలేదు".

    27 years వయసున్న పెళ్ళి కాని అమ్మాయి జెనీలియాలో నీకు ఫ్రెష్ లుక్ కనిపించడంలేదు అంటే, నీ expectations చాలా ఎక్కువ అని తెలుస్తంది. మరి నీకు కాబొయే బార్య/బర్త ఎలా survive అవుతారొ?

    Have fun!.

    ReplyDelete
  2. జెనిలియా wrong choice. she look like elder sister. ram charan తప్పు చేశాడు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

గ్రేటర్‌లో జనం గుణపాఠం చెప్పవలసింది కేసీఆర్‌కా, బీజేపీకా?

  రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్‌ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.