Skip to main content

చరణ్‌కంటే పెద్దదైన జెనీలియాను కాకుండా ఆరెంజ్‌లో ఎవరైనా ఫ్రెష్‌ఫేస్‌ను తీసుకోవాల్సింది

ఆరెంజ్ ప్రోమోలు చూస్తుంటే జెనీలియాలో ఫ్రెష్ లుక్ కనిపించడంలేదు. ముఖం బాగా డ్రెయిన్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అఫ్ కోర్స్ సినిమా మొత్తంలో అలా ఉండకపోవచ్చు. కానీ ఫ్రెష్ ఫేస్ ఎవరినయినా తీసుకోవాల్సింది(like Samantha). దానికి తోడు వయసురీత్యా కూడా చరణ్ కంటే జెనీలియా రెండేళ్ళు పెద్దది కావడంతో అది కూడా స్పష్టంగా తెలిసిపోతోంది(చరణ్ కు 25ఏళ్ళయితే, జెనీలియాకు 27 ఏళ్ళు). చరణ్ కు ఇది మూడో సినిమా అయితే జెనీలియాకు ఇది ముప్పై ఒకటో ముప్పై రెండో సినిమానో. ఫారెన్ బ్యాక్ గ్రౌండ్ లో ఇలా కావాలి అని చరణ్ చెప్పిన ఔట్ లైన్ మేరకు కథను తయారుచేసుకున్నానని, హీరోయిన్ పాత్రకు జెనీలియాయే సరైన ఛాయిస్ అని ఆమెను తీసుకున్నామని దర్శకుడు భాస్కర్ చెబుతున్నాడు.

ఆరెంజ్ పాటలు మొదటిసారి పెద్దగా అనిపించకపోయినా వింటున్న కొద్దీ బాగుంటున్నాయి. అయితే వీటిలో ఒక్క డ్యూయెట్ కూడా లేకపోవడం విశేషం. డ్యూయెట్ లేకుండా రొమాంటిక్ సినిమా ఏమిటో...కొత్తగా ఉంది. ఇక భాస్కర్ ఈ సినిమాకు చాలా ఎక్కువ ఖర్చు పెట్టించాడని, మెగా బ్రదర్స్ దీనిపై అసంతృప్తిగా ఉన్నారని వెబ్ సైట్లలో పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిజల్ట్ బట్టి చరణ్ ఛాయిస్ కరెక్టా కాదా అనేది తెలుస్తుంది.

Comments

  1. "ఆరెంజ్ ప్రోమోలు చూస్తుంటే జెనీలియాలో ఫ్రెష్ లుక్ కనిపించడంలేదు".

    27 years వయసున్న పెళ్ళి కాని అమ్మాయి జెనీలియాలో నీకు ఫ్రెష్ లుక్ కనిపించడంలేదు అంటే, నీ expectations చాలా ఎక్కువ అని తెలుస్తంది. మరి నీకు కాబొయే బార్య/బర్త ఎలా survive అవుతారొ?

    Have fun!.

    ReplyDelete
  2. జెనిలియా wrong choice. she look like elder sister. ram charan తప్పు చేశాడు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

కమ్మవారిని దెబ్బతీయటానికే రాజధానిని జగన్ మార్చారా?

కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే  అంశంపై   మంత్రి   కొడాలినాని నిన్న అసెంబ్లీలో   ఒక   అనూహ్యమైన  కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా   మంత్రి   కొడాలినాని  అసెంబ్లీలో  చేసిన   ప్రసంగం   ఆద్యంతం   ఆసక్తికరంగా   సాగింది .  మాజీముఖ్యమంత్రి   చంద్రబాబు   నాయుడు ,  టీడీపీలోని   తమ   సామాజికవర్గం   నాయకులు ,  ఆ  పార్టీకి   సంపూర్ణ   సహకారాలు   అందిస్తున్న   పత్రికాధిపతులు   రామోజీరావు ,  రాధాకృష్ణ , టీవీ5  నాయుడులపై తనదైనశైలిలో   నాని   చెణుకులు  విసిరారు.    పంచారామాలలో  ఒకటైన పుణ్యక్షేత్రం,  అంతర్జాతీయంగా  ఖ్యాతిగాంచిన  బౌధ్ధ   స్థూపం  ఉ న్న   పవిత్రస్థలం ,  శాతవాహనులకు ...

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .