Skip to main content

24గంటల వ్యవధిలో మూడు చోట్ల విమాన ప్రమాదాలు...89మంది మృతి

నిన్న ఉదయంనుంచి ఇవాళ ఉదయం వరకూ ప్రపంచవ్యాప్తంగా మూడు వేర్వేరుచోట్ల విమానప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మూడింటిలోనూ పెద్దదైన క్యూబా ప్రమాదంలో 68మంది చనిపోయారు. ఈ ఉదయం క్యూబా ఉత్తర ప్రాంతంలోని శాంటియాగో డి క్యూబా రాష్ట్రంనుంచి దేశరాజధాని హవానాకు వెళుతున్న ఏరోకరిబియన్ విమానయాన సంస్థ విమానం మార్గమధ్యంలో కూలిపోయింది. దీనిలో 40మంది క్యూబన్లు ఉండగా 28మంది విదేశీయులు ఉన్నారు. ప్రమాద కారణం ఇంకా తెలియలేదు.

ఇక పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలో జరిగిన రెండో ప్రమాదంలో 21మంది చనిపోయారు. ఒక ఆయిల్ కంపెనీ అద్దెకు తీసుకున్న విమానంలో తమ ఉద్యోగులను కొందరిని సింధ్ రాష్ట్రంలోని చమురు క్షేత్రాలకు తీసుకెళ్ళడానికి కరాచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అవగానే విమానంలోని ఒక ఇంజన్ లో మంటలు రేగాయని పైలట్ కంట్రోల్ టవర్ కు తెలిపాడని, వెంటనే గ్రౌండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగానే పేలిపోయిందని అధికారులు తెలిపారు. లోపలి మనుషుల దేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ప్రమాద కారణం తెలియలేదు. పాకిస్తాన్ లో గత 4నెలల్లో ఇది రెండో విమాన ప్రమాదం. జులై 28న ఇస్లామాబాద్ శివార్లలో జరిగిన ప్రమాదంలో 152మంది చనిపోయారు.

ఇక ప్రస్తుత ప్రమాదాల్లోని మూడవది నిన్న ఉదయం సింగపూర్ లో జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు...గాయపడలేదు. విమానసిబ్బందిసహా మొత్తం 459మందితో సింగపూర్ నుంచి సిడ్నీ బయలుదేరిన క్వాంటాస్ ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ అయిన కొద్దినిమిషాలకే...దానికున్న నాలుగు రోల్స్ రాయిస్ ఇంజన్లలోని ఒకదానిలో పొగలు రావడాన్ని పైలట్లు వెంటనే గమనించారు. ముందు పైలట్లు విమానంలోని ఇంధనాన్ని బయటకు వంపేసి...సింగపూర్ విమానాశ్రయానికి తిరిగొచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్ లైన్స్ కు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఎయిర్ లైన్స్ గా పేరుంది. ఆ సంస్థ 90ఏళ్ళ చరిత్రలో ఒక్క విమానప్రమాదం కూడా చోటుచేసుకోలేదు. ప్రమాదానికి గురైన విమానం ఎయిర్ బస్ కంపెనీకి చెందిన 380 మోడల్ కావడంతో క్వాంటాస్ సంస్థ తమవద్ద ఉన్న ఆ మోడల్ విమానాలు ఆరింటిని వెంటనే నిలిపివేసింది.

Comments

  1. ఇదంతా ఒంగోలు శీను, శర్మ గారిని తిట్టిన పర్యవసానం. ఆగ్రహించిన సారమ గారు విమానాలపై ఉచ్చాటన క్రియ ప్రయోగించారు

    ReplyDelete
  2. ప్రజ్ఞ

    @అనానిమస్:నా బ్లాగ్ సందర్శించినందుకు థన్యావాదాలు. శర్మగారికీ, ఈ బ్లాగుకు ఏ విధమైన సంబంధం లేదండోయ్. నేను ఈ పోస్టును కేవలం ఒక వార్తలాగా రాశానంతే.

    ReplyDelete
  3. >>శర్మగారికీ, ఈ బ్లాగుకు ఏ విధమైన సంబంధం లేదండోయ్>>

    అంటే ఒంగోల్ శీను కి సంబంధం ఉందా?

    ReplyDelete
  4. యుగాంతం మొదలయిందేమో. కొందరు నరకాసురుడికి పూజలు మొదలెట్టారు. కలికాలం అనుకుని ఊర్కుంటున్నాం.

    ReplyDelete
  5. యుగాంతం మొదలయిందేమో. కొందరు నరకాసురుడికి పూజలు మొదలెట్టారు. కలికాలం అనుకుని ఊర్కుంటున్నాం.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.