నిన్న ఉదయంనుంచి ఇవాళ ఉదయం వరకూ ప్రపంచవ్యాప్తంగా మూడు వేర్వేరుచోట్ల విమానప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మూడింటిలోనూ పెద్దదైన క్యూబా ప్రమాదంలో 68మంది చనిపోయారు. ఈ ఉదయం క్యూబా ఉత్తర ప్రాంతంలోని శాంటియాగో డి క్యూబా రాష్ట్రంనుంచి దేశరాజధాని హవానాకు వెళుతున్న ఏరోకరిబియన్ విమానయాన సంస్థ విమానం మార్గమధ్యంలో కూలిపోయింది. దీనిలో 40మంది క్యూబన్లు ఉండగా 28మంది విదేశీయులు ఉన్నారు. ప్రమాద కారణం ఇంకా తెలియలేదు.
ఇక పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలో జరిగిన రెండో ప్రమాదంలో 21మంది చనిపోయారు. ఒక ఆయిల్ కంపెనీ అద్దెకు తీసుకున్న విమానంలో తమ ఉద్యోగులను కొందరిని సింధ్ రాష్ట్రంలోని చమురు క్షేత్రాలకు తీసుకెళ్ళడానికి కరాచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అవగానే విమానంలోని ఒక ఇంజన్ లో మంటలు రేగాయని పైలట్ కంట్రోల్ టవర్ కు తెలిపాడని, వెంటనే గ్రౌండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగానే పేలిపోయిందని అధికారులు తెలిపారు. లోపలి మనుషుల దేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ప్రమాద కారణం తెలియలేదు. పాకిస్తాన్ లో గత 4నెలల్లో ఇది రెండో విమాన ప్రమాదం. జులై 28న ఇస్లామాబాద్ శివార్లలో జరిగిన ప్రమాదంలో 152మంది చనిపోయారు.
ఇక ప్రస్తుత ప్రమాదాల్లోని మూడవది నిన్న ఉదయం సింగపూర్ లో జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు...గాయపడలేదు. విమానసిబ్బందిసహా మొత్తం 459మందితో సింగపూర్ నుంచి సిడ్నీ బయలుదేరిన క్వాంటాస్ ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ అయిన కొద్దినిమిషాలకే...దానికున్న నాలుగు రోల్స్ రాయిస్ ఇంజన్లలోని ఒకదానిలో పొగలు రావడాన్ని పైలట్లు వెంటనే గమనించారు. ముందు పైలట్లు విమానంలోని ఇంధనాన్ని బయటకు వంపేసి...సింగపూర్ విమానాశ్రయానికి తిరిగొచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్ లైన్స్ కు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఎయిర్ లైన్స్ గా పేరుంది. ఆ సంస్థ 90ఏళ్ళ చరిత్రలో ఒక్క విమానప్రమాదం కూడా చోటుచేసుకోలేదు. ప్రమాదానికి గురైన విమానం ఎయిర్ బస్ కంపెనీకి చెందిన 380 మోడల్ కావడంతో క్వాంటాస్ సంస్థ తమవద్ద ఉన్న ఆ మోడల్ విమానాలు ఆరింటిని వెంటనే నిలిపివేసింది.
ఇక పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలో జరిగిన రెండో ప్రమాదంలో 21మంది చనిపోయారు. ఒక ఆయిల్ కంపెనీ అద్దెకు తీసుకున్న విమానంలో తమ ఉద్యోగులను కొందరిని సింధ్ రాష్ట్రంలోని చమురు క్షేత్రాలకు తీసుకెళ్ళడానికి కరాచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అవగానే విమానంలోని ఒక ఇంజన్ లో మంటలు రేగాయని పైలట్ కంట్రోల్ టవర్ కు తెలిపాడని, వెంటనే గ్రౌండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగానే పేలిపోయిందని అధికారులు తెలిపారు. లోపలి మనుషుల దేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ప్రమాద కారణం తెలియలేదు. పాకిస్తాన్ లో గత 4నెలల్లో ఇది రెండో విమాన ప్రమాదం. జులై 28న ఇస్లామాబాద్ శివార్లలో జరిగిన ప్రమాదంలో 152మంది చనిపోయారు.
ఇక ప్రస్తుత ప్రమాదాల్లోని మూడవది నిన్న ఉదయం సింగపూర్ లో జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు...గాయపడలేదు. విమానసిబ్బందిసహా మొత్తం 459మందితో సింగపూర్ నుంచి సిడ్నీ బయలుదేరిన క్వాంటాస్ ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ అయిన కొద్దినిమిషాలకే...దానికున్న నాలుగు రోల్స్ రాయిస్ ఇంజన్లలోని ఒకదానిలో పొగలు రావడాన్ని పైలట్లు వెంటనే గమనించారు. ముందు పైలట్లు విమానంలోని ఇంధనాన్ని బయటకు వంపేసి...సింగపూర్ విమానాశ్రయానికి తిరిగొచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్ లైన్స్ కు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఎయిర్ లైన్స్ గా పేరుంది. ఆ సంస్థ 90ఏళ్ళ చరిత్రలో ఒక్క విమానప్రమాదం కూడా చోటుచేసుకోలేదు. ప్రమాదానికి గురైన విమానం ఎయిర్ బస్ కంపెనీకి చెందిన 380 మోడల్ కావడంతో క్వాంటాస్ సంస్థ తమవద్ద ఉన్న ఆ మోడల్ విమానాలు ఆరింటిని వెంటనే నిలిపివేసింది.
ఇదంతా ఒంగోలు శీను, శర్మ గారిని తిట్టిన పర్యవసానం. ఆగ్రహించిన సారమ గారు విమానాలపై ఉచ్చాటన క్రియ ప్రయోగించారు
ReplyDeleteప్రజ్ఞ
ReplyDelete@అనానిమస్:నా బ్లాగ్ సందర్శించినందుకు థన్యావాదాలు. శర్మగారికీ, ఈ బ్లాగుకు ఏ విధమైన సంబంధం లేదండోయ్. నేను ఈ పోస్టును కేవలం ఒక వార్తలాగా రాశానంతే.
>>శర్మగారికీ, ఈ బ్లాగుకు ఏ విధమైన సంబంధం లేదండోయ్>>
ReplyDeleteఅంటే ఒంగోల్ శీను కి సంబంధం ఉందా?
యుగాంతం మొదలయిందేమో. కొందరు నరకాసురుడికి పూజలు మొదలెట్టారు. కలికాలం అనుకుని ఊర్కుంటున్నాం.
ReplyDeleteయుగాంతం మొదలయిందేమో. కొందరు నరకాసురుడికి పూజలు మొదలెట్టారు. కలికాలం అనుకుని ఊర్కుంటున్నాం.
ReplyDelete