Skip to main content

అమెరికా ఆధిపత్యం తగ్గిందని అంగీకరించిన ఒబామా...భారత్ వరల్డ్ పవర్ గా ఎదిగిందని ప్రశంశలు


ఒకనాడు ద్విథృవంగా(అమెరికా, రష్యా)ఉన్న ప్రపంచం, సోవియట్ రష్యా(యూఎస్ఎస్ఆర్) పతనం పుణ్యమా అని ఏకధృవప్రపంచమైపోవడంతో పెద్దన్నపాత్ర తీసుకున్న అమెరికా...గత 30ఏళ్ళుగా చేస్తూవస్తున్న కర్రపెత్తనానికి కాలం చెల్లే పరిస్థితి దగ్గరకు వచ్చినట్లేఉంది. అమెరికా ఆధిపత్యం సడలిందని ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా అంగీకరించారు. అఫ్ కోర్స్...ఆయన చెప్పింది ఆర్ధికపరంగా అనుకోండి.(డబ్బు లేకపోతే ఎవరు లెక్క చేస్తారు?) భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు అనూహ్యరీతిలో ఎదుగుతుండటం తమ ఆర్ధికవ్యవస్థకు సవాలుగా మారిందని ఒబామా నిన్న ముంబాయిలో చెప్పారు. అయితే ఆ దేశాలకు గట్టిపోటీనిస్తామని గాంభీర్యం ప్రదర్శించారు. భారత్ కు హైటెక్ ఎగుమతులపై ఆంక్షలు తొలగించడంపై తనకు, తన ప్రజలకు సర్ది చెప్పుకున్నారు. వాణిజ్యమంటే ఒక్కవైపునుంచే జరగదని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని అన్నారు. మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అమెరికా ప్రజలకు ఆయన ఈ వివరణ ఇచ్చుకున్నట్లు కనబడుతోంది.

భారత్ ఎదుగుతున్న శక్తి కాదని, ఇప్పుడది అంతర్జాతీయశక్తి అని ఒబామా అన్నారు. ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ను సందర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ తో స్నేహసంబంధాలను మరింత పటిష్ఠం చేసుకోవడంకోసమే తానీ యాత్రను చేపట్టినట్లు చెప్పారు. పాకిస్తాన్ గురించి మాత్రం ఒబామా ఆచితూచి మాట్లాడారు. మొన్న ముంబాయిదాడుల మృతులకు నివాళులర్పించే సమయంలో కూడా ఆ దాడుల్లో పాకిస్తాన్ తీవ్రవాదుల పాత్రను ఒబామా ప్రస్తావించలేదు. నిన్న కూడా సెయింట్ జేవియర్స్ కళాశాలలో ఓ విద్యార్ధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... పాకిస్తాన్ ఆసియాలో ఓ కీలక దేశమని, దాని ప్రాధాన్యతను ఎవరూ విస్మరించలేరని అన్నారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదశక్తులు ఉన్నమాట నిజమేనని, అలాంటివి అన్ని దేశాల్లో ఉన్నాయని చెప్పారు. అయితే తీవ్రవాదంపై పాకిస్తాన్ ప్రభుత్వం పోరు ఆశించిన స్థాయిలో లేనిమాట నిజమేనని అన్నారు. పాకిస్తాన్ బాగుంటేనే భారత్ కు మంచిదని, ఇరుదేశాలూ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

ఏది ఏమైనా ట్విన్ టవర్స్ పై అల్ ఖైదా దాడులు, కుంభకోణాలు, ఆర్ధికవ్యవస్థ పతనం, నిరుద్యోగం వంటి వరుసదెబ్బలతో కుదేలైపోతున్న అమెరికా పరిస్థితి క్రమక్రమేణా దిగజారి, ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఉన్న బ్రిటన్...ఎలాగైతే మామూలు దేశంగా మారిపోయిందో అమెరికా కూడా అలాగే మారే పరిస్థితి దగ్గర్లేనో ఉందని అనిపిస్తోంది.

Comments

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...