Skip to main content

చరణ్‌కంటే పెద్దదైన జెనీలియాను కాకుండా ఆరెంజ్‌లో ఎవరైనా ఫ్రెష్‌ఫేస్‌ను తీసుకోవాల్సింది

ఆరెంజ్ ప్రోమోలు చూస్తుంటే జెనీలియాలో ఫ్రెష్ లుక్ కనిపించడంలేదు. ముఖం బాగా డ్రెయిన్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అఫ్ కోర్స్ సినిమా మొత్తంలో అలా ఉండకపోవచ్చు. కానీ ఫ్రెష్ ఫేస్ ఎవరినయినా తీసుకోవాల్సింది(like Samantha). దానికి తోడు వయసురీత్యా కూడా చరణ్ కంటే జెనీలియా రెండేళ్ళు పెద్దది కావడంతో అది కూడా స్పష్టంగా తెలిసిపోతోంది(చరణ్ కు 25ఏళ్ళయితే, జెనీలియాకు 27 ఏళ్ళు). చరణ్ కు ఇది మూడో సినిమా అయితే జెనీలియాకు ఇది ముప్పై ఒకటో ముప్పై రెండో సినిమానో. ఫారెన్ బ్యాక్ గ్రౌండ్ లో ఇలా కావాలి అని చరణ్ చెప్పిన ఔట్ లైన్ మేరకు కథను తయారుచేసుకున్నానని, హీరోయిన్ పాత్రకు జెనీలియాయే సరైన ఛాయిస్ అని ఆమెను తీసుకున్నామని దర్శకుడు భాస్కర్ చెబుతున్నాడు.

ఆరెంజ్ పాటలు మొదటిసారి పెద్దగా అనిపించకపోయినా వింటున్న కొద్దీ బాగుంటున్నాయి. అయితే వీటిలో ఒక్క డ్యూయెట్ కూడా లేకపోవడం విశేషం. డ్యూయెట్ లేకుండా రొమాంటిక్ సినిమా ఏమిటో...కొత్తగా ఉంది. ఇక భాస్కర్ ఈ సినిమాకు చాలా ఎక్కువ ఖర్చు పెట్టించాడని, మెగా బ్రదర్స్ దీనిపై అసంతృప్తిగా ఉన్నారని వెబ్ సైట్లలో పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిజల్ట్ బట్టి చరణ్ ఛాయిస్ కరెక్టా కాదా అనేది తెలుస్తుంది.

Comments

  1. "ఆరెంజ్ ప్రోమోలు చూస్తుంటే జెనీలియాలో ఫ్రెష్ లుక్ కనిపించడంలేదు".

    27 years వయసున్న పెళ్ళి కాని అమ్మాయి జెనీలియాలో నీకు ఫ్రెష్ లుక్ కనిపించడంలేదు అంటే, నీ expectations చాలా ఎక్కువ అని తెలుస్తంది. మరి నీకు కాబొయే బార్య/బర్త ఎలా survive అవుతారొ?

    Have fun!.

    ReplyDelete
  2. జెనిలియా wrong choice. she look like elder sister. ram charan తప్పు చేశాడు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.