Skip to main content

ఒబామా నెత్తిన బోండాం పడింది


ఈవారం చివరలో భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా...తన పర్యటనలో భాగంగా ముంబాయి సందర్శించనున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన పర్యటించబోయే కొన్ని స్థలాలలో కొబ్బరిచెట్లు ఉండటంతో వాటి బోండాలు అధ్యక్షుని నెత్తిమీద పడతాయేమోనని భద్రతాసిబ్బంది ఆ చెట్లకున్న బోండాలను, కొబ్బరిమట్టలను కొట్టించేశారని ఇవాళ న్యూస్ పేపర్‌లలో వచ్చింది. అయితే అక్కడ అమెరికాలో ఇవాళ నిజంగానే ఒబామా నెత్తిమీద కొబ్బరి బొండాం పడినంత పనయింది.

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఒబామాకు, ఆయన పార్టీ 'డెమోక్రాట్'కు, అక్కడి ప్రజలు మాడు పగిలిపోయేలా టెంకజెల్ల ఇచ్చారు. దిగువ సభ - హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ లో 'డెమోక్రాట్'పై ప్రత్యర్ధి పార్టీ 'రిపబ్లికన్' గణనీయమైన ఆధిపత్యం సాధించింది. ఎగువ సభ - సెనేట్ లో కూడా రిపబ్లికన్స్ మునపటికంటే లాభపడ్డప్పటికీ, అక్కడ డెమోక్రాట్స్ మెజారిటీ కొనసాగడంతో ఒబామాకు చావుతప్పి కన్ను లొట్టపోయినట్లయింది. అటు వివిధ రాష్టాల గవర్నర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో కూడా రిపబ్లికన్స్ ఆధిపత్యం సాధించారు. డెమోక్రాట్లకు గత 70ఏళ్ళలో ఎన్నడూ లేనివిధంగా ఓటమి ఎదురయింది. రెండేళ్ళక్రితం అనూహ్యరీతిలో ఘనవిజయాన్ని చేజిక్కించుకున్న ఒబామాకు ఇవి చెంపపెట్టులాంటి ఫలితాలు. తాము చేయవలసినంత అభివృద్ధి చేయలేకపోవడం వలనే ఇలా జరిగిందని, ప్రజలు నిరాశ చెందారంటూ ఒబామా ఈ ఫలితాలపై వ్యాఖ్యానించారు.

Comments

  1. ’ఒబామా నెత్తిన బొండాం పడింది’ very funny. మీరు బ్లాగ్ వ్రాస్తున్న విధానం బాగుంది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

కమ్మవారిని దెబ్బతీయటానికే రాజధానిని జగన్ మార్చారా?

కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే  అంశంపై   మంత్రి   కొడాలినాని నిన్న అసెంబ్లీలో   ఒక   అనూహ్యమైన  కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా   మంత్రి   కొడాలినాని  అసెంబ్లీలో  చేసిన   ప్రసంగం   ఆద్యంతం   ఆసక్తికరంగా   సాగింది .  మాజీముఖ్యమంత్రి   చంద్రబాబు   నాయుడు ,  టీడీపీలోని   తమ   సామాజికవర్గం   నాయకులు ,  ఆ  పార్టీకి   సంపూర్ణ   సహకారాలు   అందిస్తున్న   పత్రికాధిపతులు   రామోజీరావు ,  రాధాకృష్ణ , టీవీ5  నాయుడులపై తనదైనశైలిలో   నాని   చెణుకులు  విసిరారు.    పంచారామాలలో  ఒకటైన పుణ్యక్షేత్రం,  అంతర్జాతీయంగా  ఖ్యాతిగాంచిన  బౌధ్ధ   స్థూపం  ఉ న్న   పవిత్రస్థలం ,  శాతవాహనులకు ...

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .