Skip to main content

ఒబామా నెత్తిన బోండాం పడింది


ఈవారం చివరలో భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా...తన పర్యటనలో భాగంగా ముంబాయి సందర్శించనున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన పర్యటించబోయే కొన్ని స్థలాలలో కొబ్బరిచెట్లు ఉండటంతో వాటి బోండాలు అధ్యక్షుని నెత్తిమీద పడతాయేమోనని భద్రతాసిబ్బంది ఆ చెట్లకున్న బోండాలను, కొబ్బరిమట్టలను కొట్టించేశారని ఇవాళ న్యూస్ పేపర్‌లలో వచ్చింది. అయితే అక్కడ అమెరికాలో ఇవాళ నిజంగానే ఒబామా నెత్తిమీద కొబ్బరి బొండాం పడినంత పనయింది.

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఒబామాకు, ఆయన పార్టీ 'డెమోక్రాట్'కు, అక్కడి ప్రజలు మాడు పగిలిపోయేలా టెంకజెల్ల ఇచ్చారు. దిగువ సభ - హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ లో 'డెమోక్రాట్'పై ప్రత్యర్ధి పార్టీ 'రిపబ్లికన్' గణనీయమైన ఆధిపత్యం సాధించింది. ఎగువ సభ - సెనేట్ లో కూడా రిపబ్లికన్స్ మునపటికంటే లాభపడ్డప్పటికీ, అక్కడ డెమోక్రాట్స్ మెజారిటీ కొనసాగడంతో ఒబామాకు చావుతప్పి కన్ను లొట్టపోయినట్లయింది. అటు వివిధ రాష్టాల గవర్నర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో కూడా రిపబ్లికన్స్ ఆధిపత్యం సాధించారు. డెమోక్రాట్లకు గత 70ఏళ్ళలో ఎన్నడూ లేనివిధంగా ఓటమి ఎదురయింది. రెండేళ్ళక్రితం అనూహ్యరీతిలో ఘనవిజయాన్ని చేజిక్కించుకున్న ఒబామాకు ఇవి చెంపపెట్టులాంటి ఫలితాలు. తాము చేయవలసినంత అభివృద్ధి చేయలేకపోవడం వలనే ఇలా జరిగిందని, ప్రజలు నిరాశ చెందారంటూ ఒబామా ఈ ఫలితాలపై వ్యాఖ్యానించారు.

Comments

  1. ’ఒబామా నెత్తిన బొండాం పడింది’ very funny. మీరు బ్లాగ్ వ్రాస్తున్న విధానం బాగుంది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.