Skip to main content

చరణ్‌కంటే పెద్దదైన జెనీలియాను కాకుండా ఆరెంజ్‌లో ఎవరైనా ఫ్రెష్‌ఫేస్‌ను తీసుకోవాల్సింది

ఆరెంజ్ ప్రోమోలు చూస్తుంటే జెనీలియాలో ఫ్రెష్ లుక్ కనిపించడంలేదు. ముఖం బాగా డ్రెయిన్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అఫ్ కోర్స్ సినిమా మొత్తంలో అలా ఉండకపోవచ్చు. కానీ ఫ్రెష్ ఫేస్ ఎవరినయినా తీసుకోవాల్సింది(like Samantha). దానికి తోడు వయసురీత్యా కూడా చరణ్ కంటే జెనీలియా రెండేళ్ళు పెద్దది కావడంతో అది కూడా స్పష్టంగా తెలిసిపోతోంది(చరణ్ కు 25ఏళ్ళయితే, జెనీలియాకు 27 ఏళ్ళు). చరణ్ కు ఇది మూడో సినిమా అయితే జెనీలియాకు ఇది ముప్పై ఒకటో ముప్పై రెండో సినిమానో. ఫారెన్ బ్యాక్ గ్రౌండ్ లో ఇలా కావాలి అని చరణ్ చెప్పిన ఔట్ లైన్ మేరకు కథను తయారుచేసుకున్నానని, హీరోయిన్ పాత్రకు జెనీలియాయే సరైన ఛాయిస్ అని ఆమెను తీసుకున్నామని దర్శకుడు భాస్కర్ చెబుతున్నాడు.

ఆరెంజ్ పాటలు మొదటిసారి పెద్దగా అనిపించకపోయినా వింటున్న కొద్దీ బాగుంటున్నాయి. అయితే వీటిలో ఒక్క డ్యూయెట్ కూడా లేకపోవడం విశేషం. డ్యూయెట్ లేకుండా రొమాంటిక్ సినిమా ఏమిటో...కొత్తగా ఉంది. ఇక భాస్కర్ ఈ సినిమాకు చాలా ఎక్కువ ఖర్చు పెట్టించాడని, మెగా బ్రదర్స్ దీనిపై అసంతృప్తిగా ఉన్నారని వెబ్ సైట్లలో పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిజల్ట్ బట్టి చరణ్ ఛాయిస్ కరెక్టా కాదా అనేది తెలుస్తుంది.

Comments

  1. "ఆరెంజ్ ప్రోమోలు చూస్తుంటే జెనీలియాలో ఫ్రెష్ లుక్ కనిపించడంలేదు".

    27 years వయసున్న పెళ్ళి కాని అమ్మాయి జెనీలియాలో నీకు ఫ్రెష్ లుక్ కనిపించడంలేదు అంటే, నీ expectations చాలా ఎక్కువ అని తెలుస్తంది. మరి నీకు కాబొయే బార్య/బర్త ఎలా survive అవుతారొ?

    Have fun!.

    ReplyDelete
  2. జెనిలియా wrong choice. she look like elder sister. ram charan తప్పు చేశాడు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

చంద్ర‌బాబు, రామోజీరావు జీర్ణించుకోలేని పరిణామం

అవును నిన్నటి సీఎమ్ మార్పు వ్య‌వ‌హారం వాళ్ళిద్ద‌రికీ అస్స‌లు మింగుడుప‌డ‌ని ప‌రిణామమని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ త‌ర్వాత‌...వాళ్ళిద్ద‌రూ కాంగ్రెస్‌లో  తీవ్రంగా ద్వేషించే వ్య‌క్తి కిర‌ణ్ కుమార్‌రెడ్డి. అటువంటి వ్య‌క్తి ఇవాళ సీఎమ్ అవుతున్నాడంటే వాళ్ళిద్ద‌రికీ నిన్న‌రాత్రి నిద్రకూడా పట్టిఉండదు. అస‌లు వీళ్ళిద్ద‌రికీ - కిర‌ణ్‌కూ గొడ‌వేమిట‌నుకుంటున్నారా...! కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఒక ఏగ్రెసివ్ కాంగ్రెస్ నాయ‌కుడు. 2004లో అధికారంలోకి రాక‌మునుపు, వ‌చ్చిన త‌ర్వాత కూడా తెలుగుదేశంమీద ఎటాక్‌ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో గ‌ట్టివ్య‌క్తి ఎవ‌ర‌ని చూస్తే... కిర‌ణ్‌కుమార్ రెడ్డే ముందుండేవారు. గాంధీభ‌వ‌న్‌లో, సీఎల్పీలో జ‌రిగే ప్రెస్‌మీట్‌ల‌లో ఆయ‌న విమ‌ర్శ‌లు ధాటిగా ఉండేవి. "చంద్ర‌బాబునాయుడూ... ఇదేమిటి, అదేమిటి..." అంటూ ఏక‌వ‌చ‌న సంబోధ‌న‌తోనే కొట్టిన‌ట్లు మాట్లాడేవారు. అసెంబ్లీలో కూడా కిర‌ణ్‌ టీడీపీని బాగా ఎదుర్కొనేవారు. దీంతో చంద్రబాబునాయుడు కిరణ్‌కుమార్ ఉనికిని కూడా సహించలేకపోయేవారు.  దరిమిలా 2004తర్వాత కిరణ్ వైఎస్‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. అసెంబ్లీలో ప్రతిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు కిర‌ణ్ స్పంద‌న‌ను ప్ర‌