Skip to main content

చ‌ర‌ణ్‌కు తొలి చేదు(నారింజ‌) అనుభ‌వం రుచి చూపించిన భాస్క‌ర్


పాపం చ‌ర‌ణ్‌...చిరుత, మ‌గ‌ధీరవంటి విజయాల త‌ర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచించి...చించీ...చించీ(ఆరెంజ్‌కు ముందు చ‌ర‌ణ్ ఎంతో మ‌థ‌న‌ప‌డ్డాడ‌ని  చిరంజీవి ఆ ఆడియో విడుద‌ల ఫంక్ష‌న్‌లో చెప్పారు) మూడోసినిమాకు - ప్రేమ‌క‌థ‌ను, ద‌ర్శ‌కుడిగా భాస్క‌ర్‌ను ఎంచుకుంటూ అతను తీసుకున్న నిర్ణయం మిస్‌ఫైర్ అవ్వ‌డం విచార‌క‌రం. అయితే దీనిలో చ‌ర‌ణ్ త‌ప్పేమీ లేద‌ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక‌టే ఇమేజ్‌లో ఇమిడిపోకుండా వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాలు చేస్తూ అటు మాస్‌ను, ఇటు క్లాస్‌ను మెప్పించాల‌నుకోవ‌డం మంచి ఆలోచ‌నే. కానీ అత‌ని ఆలోచ‌న‌ను ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ స‌రిగా execute చేయ‌లేక‌పోయాడు.

క‌థ‌లో, క్యారెక్ట‌రైజేష‌న్‌లో లోపాల వ‌ల‌న సినిమా అటు క్లాస్‌నుగానీ, ఇటు మాస్‌నుగానీ ఆక‌ట్టుకోలేక‌పోతోంద‌ని విమ‌ర్శ‌కులంద‌రూ ముక్త‌కంఠంతో చెబుతున్నారు. క‌థ‌కు మంచి పాయింటునే తీసుక‌న్న భాస్క‌ర్, దానిపై ఇంకా బాగా క‌స‌ర‌త్తు చేసి, ఆ త‌ర్వాత‌ సినిమా రూపొందిస్తే బాగుండేది. తీసుకున్న పాయింటును జ‌స్టిఫై చేసే సీన్లు లేవ‌ని అంద‌రూ అంటున్నారు. మ‌రీ క్లాస్‌గా, ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో ఉంచుకుని తీసే బాలీవుడ్ ల‌వ్‌స్టోరీలాగా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. పైగా భాస్కర్ అనవసరఖర్చు పెట్టించి బడ్జెట్ విపరీతంగా పెంచాడని కూడా వార్తలొచ్చాయి. దానికితోడు... నాగబాబు ఉద్దేశ్య‌పూర్వ‌కంగా చేశారో, లేక రిలీజ్ ప‌నుల్లోబ‌డి నిర్ల‌క్ష్యం చేశారోగానీ, ఈ సినిమా ప్ర‌చారం అంతా ఒక low key affair లాగా న‌డిచింది. జ‌ల్సాలాగా, మ‌గ‌ధీర‌లాగా హైప్ క్రియేట్ అవ్వ‌లేదు. దాంతో ఓపెనింగ్స్ కూడా పెద్ద‌గాలేవు. నేను ఇంతకుముందొక పోస్టులో అనుమానించినట్లే(ముందే  చెప్పిన ....టీవీ అని అన్ని ఛానల్స్ వాళ్ళూ స్క్రోలింగ్ వేసుకున్నట్లా...హ్హహ్హ..హ్హా) జెనీలియా ముఖం exhaust అయిపోయినట్లు కనబడిందని అంటున్నారు.

ఈ సినిమాలో విమ‌ర్శ‌కులంద‌రూ కామ‌న్‌గా చెబుతున్న మ‌రో పాయింట్ చ‌ర‌ణ్ లుక్స్‌, అతని యాక్ష‌న్. ఈ రెండూ బాగున్నాయ‌ని అంటున్నారు. అంటే న‌టుడుగా అత‌ను విఫ‌ల‌మ‌వ్వ‌లేద‌న్న‌మాట‌. ఫెయిల‌యింద‌ల్లా ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ మాత్ర‌మేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. టాలీవుడ్‌లో మోస్ట్ హంబుల్, మోడెస్ట్  యంగ్‌హీరోగా అన్నివ‌ర్గాల‌నుంచి మంచిపేరు తెచ్చుకున్న చ‌ర‌ణ్‌కు, త‌ర్వాత సినిమా అయినా మంచి ఫ‌లితాన్నివ్వాల‌ని ఆశిద్దాం.

p.s.:ఈ పోస్టు రాత్రే రాసినా, వ్యతిరేక ప్రచారం చేస్తున్నానని మెగా అభిమానుల కోపం మూటగట్టుకున్నట్లవుతుందేమోననే ఆలోచన వచ్చి ఆపాను. అయితే పరమ వీరాభిమాని a2zగారే (నో ఫీల్ మూవీ అని)పెదవి విరిచిన తర్వాత ఇక మనదేముంది అని ఈ ఉదయం పబ్లిష్ చేసేశాను.



Comments

  1. తెలంగాణలో తుమ్మాలన్నా కేసీఆర్ అనుమతి అవసరమైనట్లు, బ్లాగుల్లో రామచరణ్ సినిమా బాలేదనాలంటే ఏటూజీ గారి పర్మిషన్ అవసరమన్నమాట. బాగుంది బాగుంది :-)

    ReplyDelete
  2. అబ్రకదబ్రగారూ, తెలుగోడులో మీ పోస్టులు చాలా చదివాను. felt nice. మీరు ఇటీవల ఎక్కువ రాయడంలేదు...? నా బ్లాగును సందర్శించినందుకు ధన్యవాదాలు. స్పందనలు తెలియజేస్తూ ఉండగలరు. అన్నట్లు, తెలుగోడు పేరుమీద ఈమధ్య ఎవరో మరొకరు రాస్తున్నట్లున్నారు. కొద్దిగా confusionగా ఉంది.

    శుభాభినందనలతో
    ప్రజ్ఞ‌

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర