Skip to main content

ఒబామాకు నిరసనలు తెలిపేందుకు సిద్ధమైన లెఫ్ట్ పార్టీలు-అతిథిని ఆదరించాలన్న శ్రీశ్రీశ్రీ రవిశంకర్

ఇవాళ ముంబాయిలో దిగుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నిరసనలు తెలిపేందుకు సీపీఐ, సీపీఎమ్, ఫార్వార్డ్ బ్లాక్ తదితర వామపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఐదుగంటలకు ముంబాయిలోని చర్చిగేట్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. మరోవైపు ఎల్లుండి ఒబామా భారత్ లో అధికారిక కార్యక్రమాలలో పాల్గొననున్నందున...ఆ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించబోతున్నారు. తీవ్రవాదంపై పోరులో...ముఖ్యంగా 2008 నవంబర్ 26నాటి ముంబాయి పేలుళ్ళ సూత్రధారి డేవిడ్ హెడ్లీని భారత ప్రభుత్వానికి అప్పజెప్పడానికి...అమెరికా ఏమాత్రం సాయపడటంలేదని, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో కీలక నిందితుడు యూనియన్ కార్బైడ్ మాజీ అధినేత వారెన్ ఆండర్సన్ ను భారత ప్రభుత్వానికి అప్పజెప్పడానికి కూడా అమెరికా సహకరించడంలేదని వామపక్షనేతలు ఆరోపిస్తున్నారు. అమెరికాకు అనుకూలమైన ఆర్ధిక, విదేశాంగ విధానాలను అనుసరించేలా భారత్ పై ఒత్తిడి చేస్తోందని కూడా వారి ఆరోపణ.

మరోవైపు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ గురూజీ శ్రీశ్రీశ్రీ రవిశంకర్...ఇది తగదంటూ లెఫ్ట్ పార్టీలను వారిస్తున్నారు. ఒబామా భారతదేశానికి వస్తున్న అతిధి అని, అతిధులను ఆదరించడం భారత సంస్కృతి, నాగరికతలో భాగమని అని ఆయన గుర్తు చేశారు.

Comments

  1. Yes he is right ,provided-అమెరికన అతిధులకు అయ్యే ౧౦౦ కోట్ల ఖర్చును ఆయన భరించడానికి ముందుకొస్తే.....

    ReplyDelete
  2. ఆస్ట్రాయిడ్‌ చెప్పిన దాన్ని నేను సమర్థిస్తున్నా.... అమెరికా ప్రయోజనాలకు లోబడే ఒబామా పర్యటన ఉంటుంది. మన దేశానికి జరిగే నష్టాన్ని ఎవరు భరించాలి. అమెరికా ఒకపక్క పరోక్షంగా పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తుంది. మనదేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. మన్మోహన్‌సింగ్‌ మాటకోసం, సంపన్నుల కొమ్ముకాసేలా ఉందని నాఅభిప్రాయం.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర