Skip to main content

చంద్ర‌బాబు, రామోజీరావు జీర్ణించుకోలేని పరిణామం

అవును నిన్నటి సీఎమ్ మార్పు వ్య‌వ‌హారం వాళ్ళిద్ద‌రికీ అస్స‌లు మింగుడుప‌డ‌ని ప‌రిణామమని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ త‌ర్వాత‌...వాళ్ళిద్ద‌రూ కాంగ్రెస్‌లో  తీవ్రంగా ద్వేషించే వ్య‌క్తి కిర‌ణ్ కుమార్‌రెడ్డి. అటువంటి వ్య‌క్తి ఇవాళ సీఎమ్ అవుతున్నాడంటే వాళ్ళిద్ద‌రికీ నిన్న‌రాత్రి నిద్రకూడా పట్టిఉండదు.

అస‌లు వీళ్ళిద్ద‌రికీ - కిర‌ణ్‌కూ గొడ‌వేమిట‌నుకుంటున్నారా...! కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఒక ఏగ్రెసివ్ కాంగ్రెస్ నాయ‌కుడు. 2004లో అధికారంలోకి రాక‌మునుపు, వ‌చ్చిన త‌ర్వాత కూడా తెలుగుదేశంమీద ఎటాక్‌ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో గ‌ట్టివ్య‌క్తి ఎవ‌ర‌ని చూస్తే... కిర‌ణ్‌కుమార్ రెడ్డే ముందుండేవారు. గాంధీభ‌వ‌న్‌లో, సీఎల్పీలో జ‌రిగే ప్రెస్‌మీట్‌ల‌లో ఆయ‌న విమ‌ర్శ‌లు ధాటిగా ఉండేవి. "చంద్ర‌బాబునాయుడూ... ఇదేమిటి, అదేమిటి..." అంటూ ఏక‌వ‌చ‌న సంబోధ‌న‌తోనే కొట్టిన‌ట్లు మాట్లాడేవారు. అసెంబ్లీలో కూడా కిర‌ణ్‌ టీడీపీని బాగా ఎదుర్కొనేవారు. దీంతో చంద్రబాబునాయుడు కిరణ్‌కుమార్ ఉనికిని కూడా సహించలేకపోయేవారు.  దరిమిలా 2004తర్వాత కిరణ్ వైఎస్‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. అసెంబ్లీలో ప్రతిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు కిర‌ణ్ స్పంద‌న‌ను ప్ర‌శంసిస్తూ..."మా కిర‌ణ్ బాగా స‌మాధాన‌మిచ్చాడు" అని వైఎస్ అనేవారు కూడా. 2009 ఎన్నిక‌ల్లో...ముందుకంటే బ‌ల‌ప‌డిన టీడీపీని క‌ట్ట‌డి చేయ‌డానికి కిర‌ణ్ లాంటి వ్య‌క్తే స‌రిపోతాడ‌ని భావించి - వైఎస్ ఆయ‌న‌ను స్పీక‌ర్‌ను చేశారు. అయితే స్పీక‌ర్ అయిన త‌ర్వాత కిర‌ణ్ అంత ఏక‌ప‌క్షంగా ఏమీ వ్య‌వ‌హ‌రించ‌కుండా హుందాగానే ప్ర‌వ‌ర్తించార‌నుకోండి.

ఇక రామోజీరావు కిర‌ణ్‌ను ఎందుకు ద్వేషిస్తారంటారా...చంద్ర‌బాబునాయుడిని గ‌డ్డిపోచ లెక్క‌న మాట్లాడే కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అంటే బాబు వర్గంవారంద‌రికీ, టీడీపీ వారంద‌రికీ ఒళ్ళుమంటే. అలాగే రామోజీరావుకుకూడా... కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పేరును ఉచ్ఛ‌రించ‌డానికికూడా రామోజీరావు ఇష్ట‌ప‌డ‌ర‌ని ఆ సంస్థ‌ల‌లో ప‌నిచేసేవారు చెబుతారు. గ‌తంలో ఒక‌ న్యూస్ డెస్క్ స‌మావేశంలో...పేరెత్త‌కుండానే కిర‌ణ్‌ను ప్ర‌స్తావిస్తూ... అలాంటి వారిని ఎందుకు హైలైట్ చేస్తారంటూ రామోజీరావు ఎడిటోరియల్ స్టాఫ్ మీద మండిప‌డ్డార‌ని స‌మాచారం.

అయితే వాళ్ళిద్ద‌రికీ వైఎస్‌తో ఉన్నంత  శ‌త్రుత్వం కిర‌ణ్‌తో లేక‌పోవ‌చ్చుగానీ, వాళ్ళిద్ద‌రూ తీవ్రంగా ద్వేషించే వ్య‌క్తి మాత్రం కొత్త ముఖ్య‌మంత్రే. మ‌రి వాళ్ళిద్ద‌రూ నిన్న‌టి ప‌రిణామాన్ని ఇంకా జీర్ణించుకున్నారో...లేదో.

Comments

  1. అక్షర తప్పులను ఎత్తి చూపే మీ బ్లాగులో ఇన్ని తప్పులా?

    ReplyDelete
  2. అనానిమస్‌గారూ, ఆ తప్పులేమిటో తెలియజేస్తే సంతోషిస్తాను.

    కృత‌జ్ఞ‌తాభినందనలతో

    ReplyDelete
  3. Naku kuda sarigga kanipinchatam ledu.. may be some fault with my browser..

    some words -

    కృత‌జ్ఞ‌తాభినందనలతో
    వ్య‌వ‌హారం వాళ్ళిద్ద‌రికీ అస్స‌లు

    chala unnayi

    ReplyDelete
  4. అనానిమస్‌గారూ...నేను అక్షరదోషాలు ఎత్తిచూపింది ఒక్క పోస్టులోనే...అదీ ఒకపదం తప్పు రాయడంతో(ఆ ఒక్కవార్తలో మొత్తం ఐదుసార్లు ఆ తప్పు దొర్లింది) భావం మొత్తం మారిపోయినందున...ఆ దోషాన్ని ఎత్తి చూపాను. మీరు ఇప్పుడు నా పోస్టులో ఎత్తి చూపినవి వ్యాకరణపరంగా తప్పే. కానీ భావం మారిపోయేటంత blunders కాదు.

    అసలు మీకు ఈ పోస్టులోని కోర్ పాయింట్ నచ్చినట్లులేదు.

    ReplyDelete
  5. చాలా కరెక్ట్ గా చెప్పారు. బాబు రామోజీ ఇద్దరికి వెలక్కాయ నోట్లో పడినట్టు ఉంది. బాగా వ్రాస్తున్నారు. very good.

    ReplyDelete
  6. @2nd anonymous

    అభినందనలకు కృత‌జ్ఞ‌త‌లు. ఇకముందుకూడా మీ స్పందనను తెలియజేస్తూ ఉండగలరు.

    ReplyDelete
  7. రాశేరె కొడుక్కి చెక్ పెట్టడానికి కెకెఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే మీరేమో మోకాలుకి బోడిగుండు కు ముడి పెడుతున్నారు.రాజకీయాల్లొ పర్మినెంట్ మిత్రులుగాని పర్మినెంట్ శత్రువులుగాని ఉండరన్న విషయం మీరు వినే వుంటారు.

    ReplyDelete
  8. అయ్యా తారకంగారూ, చంద్రబాబుకూ, రామోజీరావుకూ చెక్ పెట్టడానికి అధిష్టానం కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిందని నేను రాయలేదు. ఆయన ముఖ్యమంత్రి కావడం వాళ్ళిద్దరికీ మింగుడుపడని పరిణామమని మాత్రమే రాశాను. మీకు మీరే ఏదో అన్వయించుకుని నా మీద పడితే ఎలా...మోకాలుతో కాకుండా బోడిగుండుతో ఆలోచించండి.

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  10. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  11. tejasvi gaaru baagundi anni postlu chadivi aBhiprayam chebutaanu. eenadu tappule yette vaaru mi post lo tappulanu prastaavincharu. patrikalu tappulu raakunda chusenduku aneka dashalu untaayi. rasindi raasinattuga publish kaadu. kaani blog ala kadu blog one man show. pai ga g mail lo raayadam adi teluguloki maaradam tho aneka tappulu untaayi . aite tappulu raakunda unte manchide kaani polika tagadu

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.