ఈనాడులో ఇవాళ "మాటలు జాగ్రత్త!" శీర్షికతో వచ్చిన వార్తలో తప్పులు చిత్తగించండి. కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ప్రతిరోజూ సుమారు 5,000 ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయి(రహస్యంగా వింటున్నాయి) అన్నది ఒక వార్త. దానిపై ఈనాడు మెయిన్ ఎడిషన్ మూడో పేజిలో "మాటలు జాగ్రత్త" అనే శీర్షికతో ఇచ్చిన వార్తలో... 'ట్యాపింగ్'కు బదులుగా 'ట్యాంపరింగ్' అని వచ్చింది. పోనీ ఏదో ఒకచోట అయితే...ఏదో పొరపాటున, అజాగ్రత్తవలన న్యూస్ డెస్క్ వారు చూసి ఉండకపపోవచ్చు అని అనుకోవచ్చు. హెడ్డింగ్లో ఒకసారి, కింది వార్తలో నాలుగుసార్లు 'ట్యాంపరింగ్' అనే మాట ప్రచురితమయింది.
ఆవార్తను చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి http://www.eenadu.net/story.asp?qry1=19&reccount=23
అంటే ట్యాపింగ్కు, ట్యాంపరింగ్కు తేడా తెలియని సబ్ ఎడిటర్ ఈ వార్తను రాశాడన్న మాట. సరే...మరి ఆ వార్తను సరిదిద్దిన డెస్క్ ఇన్ ఛార్జి అనే శాల్తీ ఏం చేస్తున్నట్లో? ట్యాంపరింగ్ అంటే ఫలితాన్ని తారుమారు చేయడం...ఆటోమీటర్లను ట్యాంపరింగ్ చేస్తారు, ఈవీఎమ్ లను ట్యాంపరింగ్ చేస్తారు. టెలిఫోన్లను ట్యాంపరింగ్ చేయడమంటే బిల్లులను తారుమారు చేయడమో లేక బిల్లు అసలు రాకపోవడమో చేసినట్లు. సబ్ ఎడిటర్ అంటే దాదాపుగా ఏ విషయం మీదైనా కొద్దోగొప్పో పరిజ్ఞానం ఉన్నవాడయినా అయిఉండాలి. లేకపోతే తనకు తెలియని విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించి వార్తను సవివరంగా ఇవ్వగలిగినవాడయినా ఉండాలి. ఈరెండూ లేని సబ్ ఎడిటర్, డెస్క్ ఇన్ ఛార్జి అక్కడ ఉన్నట్లు అర్ధమవుతోంది. అసలు ఝలక్ ఏమిటంటే...ఈవార్తకు పెట్టిన శీర్షిక...ఈనాడు సంపాదకవర్గానికి, యాజమాన్యానికే(రెండూ ఒకటేలెండి...ఎడిటర్, పబ్లిషర్ రామోజీయే) వర్తించడం.
మరోవైపు ఇవాళ సాక్షి హైదరాబాద్ జిల్లా ఎడిషన్లో మేయర్ కార్తీకరెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించి ఒక ఫోటో వార్త ఇచ్చారు. దాని ఫోటో రైటప్ లో Indianapolis నగరం గురించి రాస్తూ 'ఇండియానాపొలిస్'కు బదులుగా 'ఇండియానా పోలీసు' అని రాశారు. ఆ నగరం ఇండియానా అనే రాష్ట్రానికి రాజధాని. తెలియని వాళ్ళు అది చదివి ఇండియానా రాష్ట్ర పోలీసులని అనుకునే ప్రమాదముంది. పైగా కొసమెరుపేమిటంటే...ఆ ఫోటోలో మేయర్ తదితరుల వెనక కనిపిస్తున్న బ్యానర్లో ఇండియానపొలిస్ అని స్పష్టంగా తెలుగులో రాసిఉంది. అది చూసినా ఆ పేరును ఎలా రాయాలో అర్ధమై ఉండేది. ఆ ఫోటోను చూడాలంటే ఈ లింక్కు వెళ్ళండి. http://epaper.sakshi.com/apnews/City-Hyderabad/23112010/12
ఆవార్తను చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి http://www.eenadu.net/story.asp?qry1=19&reccount=23
అంటే ట్యాపింగ్కు, ట్యాంపరింగ్కు తేడా తెలియని సబ్ ఎడిటర్ ఈ వార్తను రాశాడన్న మాట. సరే...మరి ఆ వార్తను సరిదిద్దిన డెస్క్ ఇన్ ఛార్జి అనే శాల్తీ ఏం చేస్తున్నట్లో? ట్యాంపరింగ్ అంటే ఫలితాన్ని తారుమారు చేయడం...ఆటోమీటర్లను ట్యాంపరింగ్ చేస్తారు, ఈవీఎమ్ లను ట్యాంపరింగ్ చేస్తారు. టెలిఫోన్లను ట్యాంపరింగ్ చేయడమంటే బిల్లులను తారుమారు చేయడమో లేక బిల్లు అసలు రాకపోవడమో చేసినట్లు. సబ్ ఎడిటర్ అంటే దాదాపుగా ఏ విషయం మీదైనా కొద్దోగొప్పో పరిజ్ఞానం ఉన్నవాడయినా అయిఉండాలి. లేకపోతే తనకు తెలియని విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించి వార్తను సవివరంగా ఇవ్వగలిగినవాడయినా ఉండాలి. ఈరెండూ లేని సబ్ ఎడిటర్, డెస్క్ ఇన్ ఛార్జి అక్కడ ఉన్నట్లు అర్ధమవుతోంది. అసలు ఝలక్ ఏమిటంటే...ఈవార్తకు పెట్టిన శీర్షిక...ఈనాడు సంపాదకవర్గానికి, యాజమాన్యానికే(రెండూ ఒకటేలెండి...ఎడిటర్, పబ్లిషర్ రామోజీయే) వర్తించడం.
మరోవైపు ఇవాళ సాక్షి హైదరాబాద్ జిల్లా ఎడిషన్లో మేయర్ కార్తీకరెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించి ఒక ఫోటో వార్త ఇచ్చారు. దాని ఫోటో రైటప్ లో Indianapolis నగరం గురించి రాస్తూ 'ఇండియానాపొలిస్'కు బదులుగా 'ఇండియానా పోలీసు' అని రాశారు. ఆ నగరం ఇండియానా అనే రాష్ట్రానికి రాజధాని. తెలియని వాళ్ళు అది చదివి ఇండియానా రాష్ట్ర పోలీసులని అనుకునే ప్రమాదముంది. పైగా కొసమెరుపేమిటంటే...ఆ ఫోటోలో మేయర్ తదితరుల వెనక కనిపిస్తున్న బ్యానర్లో ఇండియానపొలిస్ అని స్పష్టంగా తెలుగులో రాసిఉంది. అది చూసినా ఆ పేరును ఎలా రాయాలో అర్ధమై ఉండేది. ఆ ఫోటోను చూడాలంటే ఈ లింక్కు వెళ్ళండి. http://epaper.sakshi.com/apnews/City-Hyderabad/23112010/12
Junior Editing staff suppose to correct these errors. But they were paid low wages, demand more work from them, so the news quality is low.
ReplyDeleteIt may be copy/paste errors also, or typing errors by the data entry people.
I agree that they should spend more time on quality of the news.
@అనానిమస్ గారూ,
ReplyDeleteఆ వార్తను, తప్పులను కరెక్ట్ చేయాల్సింది జూనియర్ ఎడిటింగ్ స్టాఫ్ కాదు...సీనియర్లు. డెస్క్ లో సెటప్ ఎలా ఉంటుందంటే...సబ్ ఎడిటర్ రాసిన వార్తను షిఫ్ట్ లేదా డెస్క్ ఇన్ ఛార్జి సరిదిద్దుతారు. తర్వాత సీనియర్ డెస్క్ ఇన్ ఛార్జి కూడా పేజీలవారీగా వార్తలు చూసేటపుడు ప్రతి వార్తనూ పరిశీలించాలి. గతంలో అయితే పూర్తి అయిన ప్రతిపేజీని డెస్క్ లో డ్యూటీలో ఉన్న ప్రతివారూ చదవాలని కొన్ని పేపర్లలో నియమాన్ని పాటించేవారు...తప్పులను నివారించడానికి. ఇంకో విషయమేమిటంటే ఇంతకుమునుపు సబ్ ఎడిటర్లు రాసిన వార్తలను కంపోజ్ చేయడానికి వేరే స్టాఫ్(టీపీ ఆపరేటర్లు) ఉండేవారు. అయితే ఇప్పుడు ప్రతి సబ్ ఎడిటర్ కూ విధిగా కంపోజింగ్ కూడా వచ్చి ఉండాలి. కాబట్టి, డేటా ఎంట్రీ మనుషులేమీ అక్కడ ఉండరు...కాపీ, పేస్టుకు కూడా అవకాశంలేదు.
'ఇండియానాపోలిస్'కు బదులుగా 'ఇండియానా పోలీసు'
ReplyDelete___________________________________
Wow, this is creativity!
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeletehttp://vivaadavanam.blogspot.com/
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఇంకా దేశం పేరు ఎలా రాస్తే మీకేం
ReplyDelete________________________
అక్కడ రాసింది దేశం పేరు కాదు - ఊరిపేరు. ఇండియాకీ ఇండియానాపొలిస్ కీ చాలా తేడా ఉంది :))
This comment has been removed by the author.
ReplyDelete