Skip to main content

బీహార్ ఫలితాలు: మళ్ళీ నితీష్‌కే కుర్చీ, లాలూకి గడ్డి, రాహుల్‌కు చెయ్యి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కే ప్రజలు మళ్ళీ పట్టం కట్టినట్లు దాదాపుగా స్పష్టమవుతోంది. జేడీయూ-బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు బీహార్‌ను పదిహేనేళ్ళపాటు అప్రతిహతంగా పాలించిన లాలూకు(పశుగ్రాసం కుంభకోణాన్ని అక్కడి జనం మరిచిపోలేదనుకుంటా...!) మరోసారి ఘోర పరాభవం ఎదురయింది. లాలూ-పాశ్వాన్ కూటమిని బీహార్ ప్రజలు తిరస్కరించారు. అటు రాహుల్ కరిష్మా కూడా బీహార్లో పనిచేయలేదు. ఆయనకు ప్రజలు చెయ్యిచ్చారు.  కాంగ్రెస్‌ రెండంకెలకు చేరుకోవడం కూడా కష్టమయ్యేటట్లుగా ఉంది.

నితీష్ చేసిన అభివృద్ధే ఆయనకు విజయం సాధించిపెట్టింది. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, సుదీర్ఘంగా పెండింగులో ఉన్న వంతెనల నిర్మాణాలను చేపట్టడం, నేరాలసంఖ్యను తగ్గించడం, లక్షమంది టీచర్లను నియమించడం, వైద్యులు తప్పనిసరిగా ప్రాధమిక విద్యాకేంద్రాలలో పనిచేయాలని నిబంధన పెట్టడం వంటి చర్యల వలన నితీష్‌కు ప్రజాదరణ లభించింది. దానికితోడు ఆయన వ్యూహాత్మకంగా...ఈ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ అల్లర్లకేసు నిందితుడయిన ముఖ్యమంత్రి నరేంద్రమోడిని(సంకీర్ణ భాగస్వామ్యపక్షానికి చెందిన ముఖ్యనేత అయినప్పటికీ) దూరంగా పెట్టారు.  సరిగ్గా  ఐదేళ్ళక్రితం ఇదేరోజున నితీష్ బీహార్ 31వముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Comments

  1. బీహార్ ప్రజలకున్న విజ్ఞతకూడా మన తెలుగోళ్ళకు లేకుండా పోయింది అప్పుడు.ఇప్పుడు బీహార్ స్థానానికన్న దిగువకు మన రాష్ట్రం దిగజారిపోయింది.కాంగ్రెస్ వారు ప్రజలకు కుక్కలకేసినట్లు ఓ ఎముకేసి వాళ్ళేమో మొత్తం దోచేసినారు.

    ReplyDelete
  2. తేజస్వి గారు, మీ గత టపాలకు వచ్చిన కామెంట్స్ చూసాను,
    బ్లాగ్ అడ్మిన్ గా మీరు వచ్చిన కామెంట్స్ ను పరిశీలించాల్సి ఉంటుంది కదా?
    క్రితం టపాకు వచ్చిన కామెంట్స్ లో కొందరి వ్యక్తుల వ్యక్తిగత దూషణ ఉంది.
    న్యూస్ పేపర్ లో తప్పులు ఎంచి చక్కగా చూపిస్తున్న మీరు, మీ బ్లాగ్ లో ఉన్న
    ఇలాంటి అసంబద్ధ కామెంట్స్ ను డిలీట్ చెయ్యకపోతే వచ్చే రీడర్స్ అసౌకర్యంగా
    ఫీల్ అవుతారనడంలో సందేహం లేదు.

    ReplyDelete
  3. వైదేహిగారూ, మీ సూచనకు కృతజ్ఞ‌తలు. ఈ విషయం మీద నాకు అవగాహన లేదు, నేను ఆలోచించనుకూడా లేదు. ఏమిటి ఇలా ఇక్కడకొచ్చి తిట్టుకుంటున్నారు అని మాత్రం అనుకున్నాను. మీ సూచనమేరకు ఆ కామెంట్స్ తొలగించాను. ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు చేస్తే సంతోషిస్తాను. మీ బ్లాగు కూడా చూశాను. మీరు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ లాగా అనిపించారు. సంప్రదాయ దుస్తులను ఇష్టపడుతూనే(emblemలో లంగా ఓణీ ధరించిన అమ్మాయి) సంప్రదాయాలను సడలించండి అనడం quite interesting. btw మాదీ గుంటూరుజిల్లాయేనండి.(మీది తెనాలి...మాది తెనాలి)

    శుభాభినందనలతో

    ReplyDelete
  4. "రాహుల్ కరిష్మా కూడా బీహార్లో పనిచేయలేదు".

    ముందు "కరిష్మా" వుండాలి కదా, అది పనిచెయాలి అన్నా, పనిచెయక పొవడానికైనా!.

    అతనికి "కరిష్మా" వుంది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర