Skip to main content

కేసీఆర్ హామీల వర్షంలో తడిసి ముద్దవుతున్న తెలంగాణ



అసలే ఎన్నికల వేళ. ఏ రాజకీయపార్టీ అయినా కొత్త కొత్త హామీలను, సంక్షేమ పథకాలను ప్రకటించి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించటం మామూలే. మరి రాజకీయంలో ఎత్తులు, జిత్తులు అన్నిటినీ పుక్కిట పట్టిన కేసీఆర్‌వంటి నాయకుడి సంగతి చెప్పేదేముంది. ఈసారి ఎన్నికల కదనరంగంలో వాగ్దానాల ప్రకటనలో అన్నిపార్టీల నాయకులలోకీ కేసీఆరే ముందంజలో ఉన్నారని చెప్పాలి. బంగారు తెలంగాణను తయారుచేసి తెలంగాణ ప్రజలకు అందించటమే టీఆర్ఎస్ లక్ష్యమని చెబుతూ ప్రతి ఎన్నికలసభలోనూఆకర్షణీయమైన హామీలను గుప్పిస్తున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కగదితో ఇల్లు కట్టించి ఇచ్చి దానినే కైలాసం, వైకుంఠంగా భావించమంటోందని, తమ ప్రభుత్వంవస్తే పేదలకు వంటగది, స్నానాలగదితోసహా రు.3 లక్షలతో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇస్తున్నారు. దళితులకు 3 ఎకరాల భూమిని ఉచితంగా అందిస్తామని వాగ్దానం చేశారు. రు.1 లక్ష లోపు ఇళ్ళ, పంట రుణాలున్నవారెవరూ వాటిని కట్టొద్దని, వాటన్నంటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణరాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులనందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు(ఈ హామీపై తెలంగాణ నిరుద్యోగులు కేసీఆర్‌మీద కారాలు, మిరియాలు నూరుతున్నారు). ప్రభుత్వోద్యోగులకు కేంద్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలిస్తామని చెబుతున్నారు. ఆంధ్రా ఉద్యోగులు వెళ్ళిపోతే లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీ అవుతాయని, వాటిని తెలంగాణ నిరుద్యోగులతో భర్తీ చేయొచ్చని అంటున్నారు. తెలంగాణలో ఉద్యోగులను ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఆ ప్రాంతంనుంచి కనీసం మూడేళ్ళవరకు బదిలీ చేయబోమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గిరిజనులకు, ముస్లిమ్‌లకు 12శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని, వితంతువులకు, వృద్ధులకు రు.1,000, వికలాంగులకు రు. 1,500 పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తనదని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రతి మండలకేంద్రంలోనూ 30 పడకల ఆసుపత్రిని కట్టిస్తామని, ఒక్కొక్కరికి రు. లక్ష జీతంఇచ్చి నలుగురు వైద్యులను నియమిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని, జిల్లా కేంద్రంలో నిమ్స్ తరహాలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కడతామని హామీ ఇచ్చారు. నిజాం షుగర్స్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కేసీఆర్ అన్నారు.

ఉచిత విద్యహామీ విషయంలో కేసీఆర్ ఒక అడుగు ముందుకెళ్ళారని చెప్పక తప్పదు. చిన్నపిల్లల చదువు బాధ్యత స్థానిక పోలీసులకు అప్పగిస్తామని, ఎవరైనా పిల్లలు బడికి వెళ్ళకుండా ఉంటే స్థానిక పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా కార్పొరేట్ విద్య అందిస్తామని, పిల్లలకు తిండి, చదువు, బట్టలు, పుస్తకాలు అన్నీ ప్రభుత్వమే భరించేలా చూస్తామని అన్నారు. ప్రతి నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలో అందరికీ ఒకే పాఠశాల, ఒకే విద్య, ఒకే భోజనం, ఒకే యూనిఫామ్ ఉంటుందని అన్నారు.

విద్యుత్ విషయంలోనూ కేసీఆర్ భారీ హామీలే గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ అంతా విద్యుత్ వెలుగులతో దేదీప్యమానమవుతుందని అన్నారు. కొత్త ప్రభుత్వంలో అవినీతికి తావుండదని, అవినీతి అంతం తన పంతం అని కేసీఆర్ చెప్పారు.

కొసమెరుపు: తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని, ముస్లిమ్‌ను ఉపముఖ్యమంత్రిని చేస్తానని గతంలో చెప్పి ఇప్పుడు మాట మార్చటాన్నే కేసీఆర్‌పై ప్రధాన ప్రచారాస్త్రంగా ప్రత్యర్ధులు వాడుకుంటున్న ప్రస్తుత తరుణంలో...ఆయన గుప్పిస్తున్న పై హామీలను తెలంగాణ ప్రజలు నమ్ముతారో, లేదో తెలియాలంటే ఫలితాలవరకు వేచి చూడాల్సిందే!


image courtesy: wikipedia

Comments

  1. "తెలంగాణరాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని ప్రకటించారు(ఈ హామీపై తెలంగాణ నిరుద్యోగులు కేసీఆర్‌మీద కారాలు, మిరియాలు నూరుతున్నారు)"

    ఎందుకో నాకు అర్ధం కాలేదు. కాస్త వివరిస్తారా?

    "తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని, ముస్లిమ్‌ను ఉపముఖ్యమంత్రిని చేస్తానని గతంలో చెప్పి ఇప్పుడు మాట మార్చటాన్నే కేసీఆర్‌పై ప్రధాన ప్రచారాస్త్రంగా ప్రత్యర్ధులు వాడుకుంటున్న ప్రస్తుత తరుణంలో"

    ఆయన ఆ హామీలను వెనక్కు తీసుకున్న దాఖలాలు లేవు కదండీ.

    ReplyDelete
    Replies
    1. ఓరీ ఏడుపుగొట్టు తెలబాన్, నీకు పని, పాటా ఏం లేదా? కష్టపడి పని చెయ్యడం నేర్చుకో, ఏడుపు, అసూయా అంతా మటుమాయం, పరాన్నభుక్కూ.

      Delete
    2. @ Jai Gottimukkala - http://www.sakshi.com/news/andhra-pradesh/telangana-unemployees-angry-over-kcr-117697

      Delete
    3. @ Jai - see this link also. http://www.andhrajyothy.com/node/73829

      Delete
    4. థాంక్సండీ (తేజస్వి గారికి మాత్రమె సుమా).

      ఒక్క విషయం గమనించాలి. ఖాళీ అవుతుయాని చెబుతున్న ఉద్యోగాలు కొత్త నియామకాలతో భర్తీ చేస్తారు. ఈ ఖాళీలకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అడ్డు కాదు.

      Delete
  2. ఓరీ ఏడుపుగొట్టు తెలబాన్, నీకు పని, పాటా ఏం లేదా? కష్టపడి పని చెయ్యడం నేర్చుకో, ఏడుపు, అసూయా అంతా మటుమాయం, పరాన్నభుక్కూ.

    ReplyDelete
  3. ఆయనకి తెలుగు సరిగ్గా రాదు:-P)

    ReplyDelete
  4. ఇంగ్లీషు పేపర్ల లింకులు ఉంటే ఇవ్వండి,అప్పుడే అర్ధ మవుతుంది:-P)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.