ఇవాళ ముంబాయిలో దిగుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నిరసనలు తెలిపేందుకు సీపీఐ, సీపీఎమ్, ఫార్వార్డ్ బ్లాక్ తదితర వామపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఐదుగంటలకు ముంబాయిలోని చర్చిగేట్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. మరోవైపు ఎల్లుండి ఒబామా భారత్ లో అధికారిక కార్యక్రమాలలో పాల్గొననున్నందున...ఆ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించబోతున్నారు. తీవ్రవాదంపై పోరులో...ముఖ్యంగా 2008 నవంబర్ 26నాటి ముంబాయి పేలుళ్ళ సూత్రధారి డేవిడ్ హెడ్లీని భారత ప్రభుత్వానికి అప్పజెప్పడానికి...అమెరికా ఏమాత్రం సాయపడటంలేదని, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో కీలక నిందితుడు యూనియన్ కార్బైడ్ మాజీ అధినేత వారెన్ ఆండర్సన్ ను భారత ప్రభుత్వానికి అప్పజెప్పడానికి కూడా అమెరికా సహకరించడంలేదని వామపక్షనేతలు ఆరోపిస్తున్నారు. అమెరికాకు అనుకూలమైన ఆర్ధిక, విదేశాంగ విధానాలను అనుసరించేలా భారత్ పై ఒత్తిడి చేస్తోందని కూడా వారి ఆరోపణ.
మరోవైపు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ గురూజీ శ్రీశ్రీశ్రీ రవిశంకర్...ఇది తగదంటూ లెఫ్ట్ పార్టీలను వారిస్తున్నారు. ఒబామా భారతదేశానికి వస్తున్న అతిధి అని, అతిధులను ఆదరించడం భారత సంస్కృతి, నాగరికతలో భాగమని అని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ గురూజీ శ్రీశ్రీశ్రీ రవిశంకర్...ఇది తగదంటూ లెఫ్ట్ పార్టీలను వారిస్తున్నారు. ఒబామా భారతదేశానికి వస్తున్న అతిధి అని, అతిధులను ఆదరించడం భారత సంస్కృతి, నాగరికతలో భాగమని అని ఆయన గుర్తు చేశారు.
Yes he is right ,provided-అమెరికన అతిధులకు అయ్యే ౧౦౦ కోట్ల ఖర్చును ఆయన భరించడానికి ముందుకొస్తే.....
ReplyDeleteఆస్ట్రాయిడ్ చెప్పిన దాన్ని నేను సమర్థిస్తున్నా.... అమెరికా ప్రయోజనాలకు లోబడే ఒబామా పర్యటన ఉంటుంది. మన దేశానికి జరిగే నష్టాన్ని ఎవరు భరించాలి. అమెరికా ఒకపక్క పరోక్షంగా పాకిస్తాన్కు మద్దతు ఇస్తుంది. మనదేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. మన్మోహన్సింగ్ మాటకోసం, సంపన్నుల కొమ్ముకాసేలా ఉందని నాఅభిప్రాయం.
ReplyDelete