Skip to main content

"సీమాంధ్రలో జగన్, తెలంగాణలో తెరాస విజయఢంకా"

త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ పార్టీ, తెలంగాణలో తెరాస మెజారిటీ సాధిస్తాయని తాము నిర్వహించిన సర్వేలో తేలినట్లు  నీల్సన్-ఎన్‌టీవీ సంస్థలు వెల్లడించాయి. ఇవాళ వెలువడిన ఈ సర్వేఫలితాల ప్రకారం, సీమాంధ్రలో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి 129-133, తెలుగుదేశానికి 42-46, కాంగ్రెస్‌కు 0 స్థానాలు, పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ పార్టీకి 19-21స్థానాలు, తెలుగుదేశానికి 4-6, కాంగ్రెస్‌కు 0 స్థానాలు లభిస్తాయి. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు 51-57, కాంగ్రెస్‌కు 46-52, బీజేపీకి 5-8, తెలుగుదేశానికి 4-6,ఎమ్ఐఎమ్‌కు 7-8, పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసకు 6-8, కాంగ్రెస్‌కు 7-9 సీట్లు దక్కనున్నాయని సర్వే చెబుతోంది.

అయితే, అభ్యర్ధుల ఎంపిక, పొత్తుల ఖరారు తర్వాత ఈసర్వే ఫలితాలలో స్వల్ప తేడాలుంటాయని, మళ్ళీ తాము కొద్దిరోజులలో మరో సర్వే జరపబోతున్నామని, అప్పుడు మరింత ఖచ్చితత్వం వస్తుందని నీల్సన్ సంస్థ ప్రతినిధి శేషగిరిరావు చెప్పారు. సీమాంధ్రలో జగన్ పార్టీ ప్రభావం నిలకడగా ఉంటుండగా, తెలుగుదేశం పుంజుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండుపార్టీలమధ్య ఓట్లశాతం తేడా ఎనిమిదేనని, పట్టణ ప్రాంత ఓటర్లు టీడీపీవైపు మొగ్గుచూపుతున్నారని వెల్లడించారు. 

జగన్ పార్టీ పోల్ మేనేజ్‌మెంట్, అభ్యర్ధుల ఎంపిక విషయాలలో బాగా బలహీనంగా ఉందికాబట్టి అది తెలుగుదేశానికి కలిసిరావచ్చని సర్వేఫలితాలపై ఎన్‌టీవీలో జరిగిన చర్చాకార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీమాంధ్రశాఖ ముఖ్యనాయకుడు రఘునాధబాబు అన్నారు. మరోవైపు సీమాంధ్రలో అసెంబ్లీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశానికి మెజారిటీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ ప్రకటించారు. ఎన్‌టీవీలో జరిగిన చర్చాకార్యక్రమంలో రమేష్ ఈ ప్రకటన చేశారు. ఈ సర్వేను నమ్ముతున్నామని జగన్ పార్టీ నేత మైసూరారెడ్డి, తెరాస నేత కేటీఆర్ చెప్పారు. 

image courtesy:ntvtelugu.com

Comments

  1. Emi survey andi veella moham. aa ABP vaadu NDTV ki official partner. NDTV is Sakshi's official sponsorer and mentor. You can expect it now. Moreover country motham lo 29000 members ni survey chesadu anta. ante on an average each Parliament segment ki 49 members and each Assembly segment ki 5 people ni theeskoni average chesadu. ee survey ki credibility emundhi cheppandi.

    ReplyDelete
  2. సర్వేలంటే అలానే చెస్తారు మరి.. అంతేగాని, ఇండియాలో అందరి దగ్గరికీ వెళ్ళరు.. ఇవే సర్వేలు గత రెండు ఎన్నికల్లో దాదాపుగా.. ఖచ్చితంగా అంచనా వేయగలిగాయి..

    ReplyDelete
    Replies
    1. idhe survey delhi lo AAP ki 5 seats kuda ravu ani cheppindhi.
      idhe survey Madhya Pradesh lo congress clean sweep ani cheppindhi.
      idhe survey Rajasthan lo neck to neck competition ani cheppindhi.

      results emayyayo meeku thelusu anukunta.

      Delete
  3. ఏందుకొ్ ఈ సర్వే ని నమ్మవచ్చు అనిపిస్తుంది.పాత సర్వేలన్ని కూడ నిజం అయ్యాయి కదా.

    ReplyDelete
  4. పాత సర్వేలప్పటి బంధం వేరు ఇప్పటి బంధం వేరు అనిపిస్తన్నుది. ఎన్టీవి అమ్ముడు పోయిందని ఈ మధ్య వార్తలను చూస్తుంటే చిన్నపిల్లలకు కూడా అర్ధమవుతుంది

    ReplyDelete
  5. అద్భుతం జరిగి టెక్నాలజీ అంతా నాశనమయిపోయి వెనుకటి దూరదర్శన్‌ రోజులు వస్తే బాగుండు. నాలుగు రోజులాగితే ఓటు ద్వరాఆ ఫలితం తెలుస్తుందికదా ఇంతలో ఈ కంగారేల?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర