Skip to main content

సీమాంధ్రప్రాంతంలో 'హాట్ ఫేవరెట్' తెలుగుదేశమా!


సీమాంధ్రలో తెలుగుదేశంలోకి జంపింగ్‌లు, మీడియాలో వస్తున్న వార్తలనుబట్టిచూస్తే అక్కడ జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీయే 'హాట్ ఫేవరెట్'అన్న అభిప్రాయం కలగకమానదు. మరోవైపు తమ పార్టీలోకి వస్తున్న జంప్ జిలానీలను చూసి ఆత్మవిశ్వాసం పొంగి పొర్లుతున్న చంద్రబాబునాయుడు ఇప్పటికే సీమాంధ్ర సీఎమ్ అయిపోయినట్లు మాట్లాడుతున్నారు(ఇటీవల హైదరాబాద్‌లో 'మీట్ ది పీపుల్' అనే కార్యక్రమంలో  పాల్గొంటూ, ఆ కార్యక్రమానికి హాజరైన వివిధవర్గాలవారికి భారీ లెవల్‌లో హామీలు గుప్పించి సీమాంధ్ర ముఖ్యమంత్రిననే భావం అక్కడున్నవారికి కల్పించారట చంద్రబాబు). భారీస్థాయిలో   కాంగ్రెస్ నుంచి దూకుతున్న జంప్ జిలాని నాయకులతో తెలుగుదేశంపార్టీ కిటకిటలాడుతున్నమాట వాస్తవమే. ఓవర్‌ఫ్లోను తట్టుకోలేక కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడిన మాటా నిజమే. అయితే దీనిని ఫలితాలకు సూచికగా తీసుకోవటం అమాయకత్వమే అవుతుంది. టీడీపీలోకి దూకుతోంది నాయకులేగానీ, ఓటర్లుకాదన్న విషయాన్ని మరిచిపోగూడదు. అసలు ఈ జంపింగ్ జపాంగ్‌లవలన విశాఖపట్నం, అనంతపురం, కర్నూలువంటి పలు జిల్లాలలో  ఆ పార్టీ వ్యతిరేక ఫలితాలను చవిచూడబోతోందని అంటున్నారు. విశాఖపట్నంజిల్లాలో తాజా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావువర్గం చేరికపై అయ్యన్నపాత్రుడువర్గం, అనంతపురంలో జేసీ బ్రదర్స్ చేరికపై పరిటాలవర్గం, కర్నూలుజిల్లాలో తాజా మాజీ మంత్రిలు టీజీ, ఏరాసు చేరికపై తీవ్ర అసంతృప్తితో రగులుతున్న విషయం తెలిసిందే. ఎన్నోసంవత్సరాలనుంచి పార్టీని అంటిపెట్టుకునిఉన్నవారు ఉండగా, ఎన్నికలముందు వచ్చినవారికి పెద్దపీటవేస్తే ఆగ్రహజ్వాలలు పెల్లుబకడం సహజం.

ఈ జంప్ జిలానీలను, చంద్రబాబు ఆత్మవిశ్వాసాన్నిమాత్రమే చూసేవారు జగన్ వేవ్‌ను మరిచిపోగూడదు. జగన్‌కు మొదట్లో ఉన్న ఊపు తర్వాతికాలంలో 
కొంత తగ్గినప్పటికీ అది ఇప్పటికీ గణనీయంగానే ఉందనేది కాదనలేని వాస్తవం. అతని లక్షకోట్ల అవినీతి గురించి ఎంత ప్రచారం జరిగినా, వైఎస్ సంక్షేమపథకాలవలన లబ్ది పొందినవారిలో చాలామంది ఒక్కసారికి మాత్రం జగన్‌కు ఓటువేయాలని ఏనాడో డిసైడైపోయారు. ఇక క్రైస్తవ సెంటిమెంట్ ఉండనే ఉంది. రెడ్డి సామాజికవర్గ యువకులైతే పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. ఈ మూడువర్గాల ఓట్లు జగన్ పార్టీకి హోల్‌సేల్‌గా పడనున్నాయనటంలో ఎటువంటి సందేహంలేదు. కాకపోతే ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు అంత సజావుగా లేనందున వారి పోల్ మేనేజ్‌మెంట్, అభ్యర్ధుల ఎంపిక ఎలా ఉంటుందనేదానిపై కొంత సందేహాలు ఉన్నాయి.

అయితే, తెలుగుదేశానికి ఈ ఎన్నికల్లో అనుకూలించే మంచి అంశాలు లేకపోలేదు. మొదటిది ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన కాంగ్రెస్‌పై సీమాంధ్రలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత. ఇక రెండవది, పదిసంవత్సరాలనుంచి కాంగ్రెస్‌పాలనను, ముఖ్యంగా రాజశేఖరరెడ్డి మరణంతర్వాత రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను చూసిన సీమాంధ్రమధ్యతరగతిప్రజలలో, ముఖ్యంగా ఉద్యోగవర్గాలలో 'చంద్రబాబే మెరుగు' అన్నవాదన బాగానే వినబడుతోంది. అయితే ఈ వర్గాలు ఓటింగుకు రావటం  తక్కువ అన్నది తెలిసిందే. ఓటుహక్కు వినియోగంపై ఈ సారి ప్రచారం జరుగుతున్నందున విద్యావంతులు, పట్టణఓటర్లు, మధ్యతరగతివారు ఓటింగ్‌లో చురుకుగా పాల్గొంటేమాత్రం తెలుగుదేశానికి కలిసిరావొచ్చు. ఇక రాష్ట్రంలోని రెండు ప్రధాన దినపత్రికలు, అదే యాజమాన్యం క్రింద ఉన్న న్యూస్ ఛానళ్ళు టీడీపీకి అనుకూలించే మరో అంశం. ఈ రెండు మీడియా సంస్థలూ కొంతకాలంగా చంద్రబాబును మళ్ళీ గద్దెనెక్కించాలని కంకణం కట్టుకుని తీవ్రంగా కృషిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీతో పొత్తుపెట్టుకుంటే ముస్లిమ్ ఓట్లను తెలుగుదేశం కోల్పోవలసి వస్తుంది. బీజేపీ మిత్రపక్షాలకు వేస్తే అది తమ చిరకాల శత్రువు మోడిని ప్రధానిని చేసే అవకాశమున్నందున టీడీపీకి ముస్లిమ్‌ల ఓట్లు పడకపోవచ్చు.

ఇక సీమాంధ్రలో జైసమైక్యాంధ్ర, జనసేన, బీజేపీలుకూడా ఉన్నా పోటీ తెలుగుదేశం, జగన్ పార్టీలమధ్యే ప్రధానంగా ఉంటుంది. కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్రకోసం చేసినకృషి, ఆయననిబద్ధత పలువురి ప్రశంశలు అందుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినతర్వాత పార్టీ ఏర్పాటును వెంటనే ప్రకటించకుండా మీనమేషాలు లెక్కపెట్టడం, ఆయనకు 'వర్గాన్ని కాపాడుకోవటం'వంటి నాయకత్వలక్షణాలు లేకపోవటం జై సమైక్యాంధ్రకు మైనస్ పాయింట్లు. అయితే స్వయంగా మంచి వ్యూహకర్త అయిన కిరణ్, మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ పార్టీకి ప్లస్ పాయింట్లు. ఇక జనసేన విషయానికొస్తే, పవన్ కళ్యాణ్‌కు ఎప్పుడు ఆవేశం వస్తే అప్పుడు ప్రజలముందుకు రావటం తప్పితే, యువతలో తనకున్న అపూర్వ ప్రజాదరణను ఓట్లగా మలుచుకునే నిర్మాణాత్మక వ్యవస్థ, విధానాలు ఆ పార్టీలో కనబడటంలేదు. బీజేపీకి సీమాంధ్రలో టీడీపీతో పొత్తుపెట్టుకుంటే తప్పిస్తే, ఎక్కడా డిపాజిట్లు దక్కించుకునేంత దృశ్యం ఉండదు.

Comments

  1. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి అధోగతి పట్టడం ఖాయమా? ఒకవేళ అదే జరిగితే ఆంద్ర ప్రజలలో సమైక్య భావన లేదని అర్ధం కాదా?

    ReplyDelete
  2. jagan ki bhajana chesukovadame ee blog main theme anukunta...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.