ఈ జంప్ జిలానీలను, చంద్రబాబు ఆత్మవిశ్వాసాన్నిమాత్రమే చూసేవారు జగన్ వేవ్ను మరిచిపోగూడదు. జగన్కు మొదట్లో ఉన్న ఊపు తర్వాతికాలంలో కొంత తగ్గినప్పటికీ అది ఇప్పటికీ గణనీయంగానే ఉందనేది కాదనలేని వాస్తవం. అతని లక్షకోట్ల అవినీతి గురించి ఎంత ప్రచారం జరిగినా, వైఎస్ సంక్షేమపథకాలవలన లబ్ది పొందినవారిలో చాలామంది ఒక్కసారికి మాత్రం జగన్కు ఓటువేయాలని ఏనాడో డిసైడైపోయారు. ఇక క్రైస్తవ సెంటిమెంట్ ఉండనే ఉంది. రెడ్డి సామాజికవర్గ యువకులైతే పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. ఈ మూడువర్గాల ఓట్లు జగన్ పార్టీకి హోల్సేల్గా పడనున్నాయనటంలో ఎటువంటి సందేహంలేదు. కాకపోతే ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు అంత సజావుగా లేనందున వారి పోల్ మేనేజ్మెంట్, అభ్యర్ధుల ఎంపిక ఎలా ఉంటుందనేదానిపై కొంత సందేహాలు ఉన్నాయి.
అయితే, తెలుగుదేశానికి ఈ ఎన్నికల్లో అనుకూలించే మంచి అంశాలు లేకపోలేదు. మొదటిది ఆంధ్రప్రదేశ్ను విభజించిన కాంగ్రెస్పై సీమాంధ్రలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత. ఇక రెండవది, పదిసంవత్సరాలనుంచి కాంగ్రెస్పాలనను, ముఖ్యంగా రాజశేఖరరెడ్డి మరణంతర్వాత రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను చూసిన సీమాంధ్రమధ్యతరగతిప్రజలలో, ముఖ్యంగా ఉద్యోగవర్గాలలో 'చంద్రబాబే మెరుగు' అన్నవాదన బాగానే వినబడుతోంది. అయితే ఈ వర్గాలు ఓటింగుకు రావటం తక్కువ అన్నది తెలిసిందే. ఓటుహక్కు వినియోగంపై ఈ సారి ప్రచారం జరుగుతున్నందున విద్యావంతులు, పట్టణఓటర్లు, మధ్యతరగతివారు ఓటింగ్లో చురుకుగా పాల్గొంటేమాత్రం తెలుగుదేశానికి కలిసిరావొచ్చు. ఇక రాష్ట్రంలోని రెండు ప్రధాన దినపత్రికలు, అదే యాజమాన్యం క్రింద ఉన్న న్యూస్ ఛానళ్ళు టీడీపీకి అనుకూలించే మరో అంశం. ఈ రెండు మీడియా సంస్థలూ కొంతకాలంగా చంద్రబాబును మళ్ళీ గద్దెనెక్కించాలని కంకణం కట్టుకుని తీవ్రంగా కృషిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీతో పొత్తుపెట్టుకుంటే ముస్లిమ్ ఓట్లను తెలుగుదేశం కోల్పోవలసి వస్తుంది. బీజేపీ మిత్రపక్షాలకు వేస్తే అది తమ చిరకాల శత్రువు మోడిని ప్రధానిని చేసే అవకాశమున్నందున టీడీపీకి ముస్లిమ్ల ఓట్లు పడకపోవచ్చు.
ఇక సీమాంధ్రలో జైసమైక్యాంధ్ర, జనసేన, బీజేపీలుకూడా ఉన్నా పోటీ తెలుగుదేశం, జగన్ పార్టీలమధ్యే ప్రధానంగా ఉంటుంది. కిరణ్కుమార్రెడ్డి సమైక్యాంధ్రకోసం చేసినకృషి, ఆయననిబద్ధత పలువురి ప్రశంశలు అందుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినతర్వాత పార్టీ ఏర్పాటును వెంటనే ప్రకటించకుండా మీనమేషాలు లెక్కపెట్టడం, ఆయనకు 'వర్గాన్ని కాపాడుకోవటం'వంటి నాయకత్వలక్షణాలు లేకపోవటం జై సమైక్యాంధ్రకు మైనస్ పాయింట్లు. అయితే స్వయంగా మంచి వ్యూహకర్త అయిన కిరణ్, మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ పార్టీకి ప్లస్ పాయింట్లు. ఇక జనసేన విషయానికొస్తే, పవన్ కళ్యాణ్కు ఎప్పుడు ఆవేశం వస్తే అప్పుడు ప్రజలముందుకు రావటం తప్పితే, యువతలో తనకున్న అపూర్వ ప్రజాదరణను ఓట్లగా మలుచుకునే నిర్మాణాత్మక వ్యవస్థ, విధానాలు ఆ పార్టీలో కనబడటంలేదు. బీజేపీకి సీమాంధ్రలో టీడీపీతో పొత్తుపెట్టుకుంటే తప్పిస్తే, ఎక్కడా డిపాజిట్లు దక్కించుకునేంత దృశ్యం ఉండదు.
కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి అధోగతి పట్టడం ఖాయమా? ఒకవేళ అదే జరిగితే ఆంద్ర ప్రజలలో సమైక్య భావన లేదని అర్ధం కాదా?
ReplyDeletejagan ki bhajana chesukovadame ee blog main theme anukunta...
ReplyDelete