Skip to main content

ఏపీ ఎన్జీఓల సభ విజయవంతం



సభను అడ్డుకుంటామని తెలంగాణవాదులు, జరపాలన్న కృతనిశ్చయంలో ఎన్జీఓలు ఇరువైపులా మోహరించి ఉంటడంతో ఎప్పుడేమి జరుగుతుందో అని శనివారం ఉదయంనుంచి హైదరాబాద్ వాసులు ఉత్కంఠతతో ఊపిరి బిగబట్టి చూశారు. మొత్తానికి చెదురుమదురు ఘటనలు మినహా సభ సాఫీగా సాగిపోయింది. సభ నిర్వాహకులను, ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని దీనికి అభినందించాలి. మోరల్ సపోర్ట్, లాజిస్టిక్ సపోర్ట్, లా అండ్ ఆర్డర్ సపోర్ట్...ఒకటేమిటి అన్ని సపోర్టులూ అందించి సభను విజయవంతం చేయించారు కిరణ్.

ఏపీ ఎన్జీఓలు ఈ వేదికను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. సమైక్యవాదానికి తమ కారణాలను, తమ వాదనను స్పష్టంగా వినిపించారు. విభజన వలన నష్టాలను వివరించడంకూడా ఈ సభ లక్ష్యమైనప్పటికీ, వక్తలలో అశోక్ బాబు తప్పితే మిగిలిన ఉద్యోగసంఘాల నాయకులెవరూఆ విషయాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. సభలో వక్తల ఉపన్యాసాలుసంయమనంతో సాగాయని చెప్పొచ్చు. ఎవరైనా శృతి మించినా, అశోక్ బాబు వెనకనుంచి వారిని వారించడంతో వక్తలు మళ్ళీ గాడిలోకి వచ్చారు. వక్తలలో అశోక్ బాబు తర్వాత మిత్రా, సత్యవాణి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఇంకా పలువురు వక్తలు ప్రసంగించాల్సి ఉన్నప్పటికీ, సమయాన్ని పాటిస్తూ 5గంటల ప్రాంతంలో సభను ముగించేశారు. ఈ క్రమశిక్షణకూడా సభ విజయవంతమవడానికి ఒక కారణమని చెప్పొచ్చు. దీనికి తోడు ఎంతో పరిణతితో అశోక్ బాబు వ్యవహరించిన తీరు మరొక కారణమని చెప్పక తప్పదు. ఉపన్యాసాలలో వ్యక్తులగురించి ప్రస్తావించొద్దని ఆయన వక్తలకు పదేపదే గుర్తుచేశారు. రాజకీయాలలోకి రాబోనని చెప్పి అందరి ప్రశంశలూ అందుకున్నారు. ఎవరిపై ద్వేషం, విషం కక్కకుండా సభ మొత్తం ఒక పాజిటివ్ ఫీల్ తో సాగేటట్లు చేశారు. సీమాంధ్రప్రాంతంలోని 13జిల్లాలలో ఎటువంటి కేంద్రీయ నాయకత్వం లేకుండా, అసంఘటితంగానే  సమైక్యాంధ్రకోసం ఉద్యమం చేస్తున్నవారిలో ఇవాళ్టి హైదరాబాద్ సభ మరింత స్ఫూర్తిని రగులుస్తుందనడంలో ఏమాత్రం సందేహంలేదు

image courtesy:ప్రజాశక్తి

Comments

  1. ఈ సభ గురించి ఎంత చెప్పినా తక్కువె.ఇంత సంయమనం ఎప్పుడూ చూడలెదు

    ReplyDelete
    Replies
    1. ఆవును ఎంత చెప్పిన తక్కువె ...... ఎంత చెప్పినా తక్కువె...
      అరెరె! ఎంత సోదరభావం, ఎంత సమైక్యత, ఎంత క్రమశిక్షణ. నిజంగా మన సీమాంధ్ర NGOs ఎంత శాంతికాముకులో కదా…
      ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 రైళ్లు, 1200 బస్సుల్లో హైదరాబాదుకు పిక్నిక్ వచ్చిన మన సోదరులు, నిజాం కాలేజి విద్యార్ధులను చూస్తూ “పీక కోస్తాం” అంటూ చేసిన సైగలివి.
      గొప్ప సమైక్యత కదూ వీరిది!

      ఇప్పుడు ఎవరిని ఎవరినుండి రక్షించాలని ప్రశ్నించాలె మనం!

      http://missiontelangana.com/samaikya-goodaism-slit-throat/

      Delete
    2. అబ్బ, ఎంత బాగుందో నటన, ఎంత అమాయకత్వ ప్రదర్శనో - ఒకటో రెండో నందుల్ని ఇచ్చిపారెయ్యొచ్చు.

      సభకొచ్చే సీమాంధ్రులను చావగొడతం అంటూ ఉస్మానియాకు చెందిన రౌడీలు టీవీల ముందు కూసిన కారుకూతలు చూళ్ళేదా ప్రాశ్నికుడా? ఆ తరవాత హై. కి వస్తున్న బస్సులపై రాళ్ళేసిన వైనం తెలీదా? సభ తరవాత తిరిగి వెళ్తున్నవాళ్ళపై రాళ్ళేసిన సంగతి తెలీకుండా కళ్ళూ చెవులూ మూసుకున్నావా?

      ఇక ఆపండి మీ దిక్కుమాలిన అబద్ధపు ప్రచారాలు.

      Delete
    3. ఇంకో సంగతి ఎనానిమస్సూ..
      ఎవరిని ఎవరినుండి రక్షించాలని ప్రశ్నించాలె మనం అంటూ వేదన చెందడం బాగుంది. కానీ ఊరికే గాల్లోకి ప్రశ్నలు వదలడం కాకుండా మీరే స్వయంగా మీ అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేసి ఉంటే మీకు కింది వీడియో (40 వ సెకను నుంచి చూడండి) కనబడి ఉండేది. మీ వేదనకు కారకులు ఎవరో తెలిసి ఉండేది.

      https://www.youtube.com/watch?v=SJL_5iYUMY8

      సభ జరగడానికి ఒకరోజు ముందు చెప్పిన మాటలివి. గొప్ప శాంతికాముకులు కదా వీళ్ళు.

      Delete
  2. Jai Jai Kiran Kumar Reedy & Jai Jai DGP

    ReplyDelete
  3. thanks to our andhra CM & andhra DGP for their nice cooperation.

    ReplyDelete
  4. SEEMANDHRALO EKKADAINA OKKA TELANGANA NAAYAKULA VIGRAHALU UNNAVA ?
    EEROJU MEETING LO ELA GNAPAKAMU VACHINAADI BOORGULA PHOTO VEEDIKA PI PETTADANIKI?

    ReplyDelete
  5. emi baboo seemandhralo telangaanaa naayakula vigrahaalu lekapothe neeku nidra raavatledaa? leka edo okati adagaali kaabatti adugutunnaavaa?

    telangaanaa naayakula vigrahaala visayaniki vaste -- PV vigrahaalu raastramanthaa unnayi. ala rasta paridhilo pani chesina telangaanaa nayakudi peru inkoti cheppu. vigraham petteddam.

    ReplyDelete
    Replies
    1. పీవీ విగ్రహాలు సీమాంధ్రలో ఎన్ని ఉన్నాయి, ఎక్కెడెక్కడ ఉన్నాయి, జెర డెటైల్స్ ఫోటొస్ తో ఇయ్యరాదె.

      Delete
    2. ఇంక నాకు ఇదే పని. ఎప్పుడయినా పొరపాటున బావి దాటి బయటకి వెళ్తే ఒక లుక్కెయ్యి కనిపిస్తాయి

      Delete
  6. businesses of your beloved politicians are running well in various places in seemandhra , telangana and other places in india . who were loosing in bundh are govt school students RTC employees NGOs daily wages workers small business establishments.how they will survive?

    ReplyDelete
    Replies
    1. ఈ ఉద్యమాల వల్ల లాభపడేది రాజకీయ నాయకులు నష్టపోయేది సామాన్య ప్రజలు. కాబట్టి ఈ బంద్ లన్ని ఆపి ఎవరి పనులు వాళ్ళు చూసుకుని రాజకీయ నాయకుల జుట్టు పట్టుకుని అభివృద్ది జరిపించుకుంటే మంచిది. లేదూ నాయకుల తాళానికి చిందులు వేస్తాం అంటే ఇంకా నష్టపోతారు అంతే.

      Delete
  7. At last samaikhaya people shows how faith they are having on courts AND NATIONAL ANTHEM................................................................

    ReplyDelete
  8. The statue of Sri.P.V.Narasimharao is in our Vizag..Please come to my home..I will show it.

    ReplyDelete
  9. Rendu pranthalloo unna yuvataram,prajalu idi baagaa telusukondi.Eee socalled rajakeeya nayakulu, naayakulu desanni digamingataniki inkaa mana madhya nippu ragulusthunee unnaaru. Evadiki kavaali eee samikyamu or separate.Mundhu vaallnu nooru muinchandi. Prajalu haigaa nidrapootharu.Media koodaa chalaa chendaalamga vyavaharisthundi. Paper chudaalannaa asahyam vesthundi.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర