Skip to main content

మైక్రోసాఫ్ట్ హస్తగతమైన నోకియా:కుమిలిపోతున్న ఫిన్లాండ్ దేశస్థులు



  


14 సంవత్సరాలపాటు ప్రపంచ మొబైల్ ఫోన్ మార్కెట్ లో ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన నోకియాసంస్థ అమ్ముడుపోయింది. తమ మొబైల్ ఫోన్ తయారీ విభాగాన్ని సాఫ్ట్ వేర్ దిగ్గజం 5.44 బిలియన్ యూరోలకు(7.17 బిలియన్ డాలర్లకు)మైక్రోసాఫ్ట్ కు అమ్మేసుకుంది.అయితే 148 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఫిన్లాండ్ కంపెనీ, నెట్ వర్క్ పరికరాలు, సర్వీసులు వంటి ఇతర వ్యాపారాలను యధావిధిగా కొనసాగిస్తుంది.

మొబైల్ ఫోన్ ల వ్యాపారంలో నోకియా ఆధిపత్యానికి గత కొద్ది సంవత్సరాలుగా శామ్ సంగ్, యాపిల్ (ఐఫోన్ తయారీసంస్థ) కారణంగా గండిపడింది.దీని నోకియా సంస్థ స్వయంకృతాపరాథమే కారణం.బూజుపట్టిన సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ నే పట్టుకుని వేలాడుతూ పోటీగా దూసుకొస్తున్న ఆండ్రాయిడ్, ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ లను, స్మార్ట్ ఫోన్ మార్కెట్ నూ నోకియా పట్టించుకోలేదు. వీటన్నింటినీ మించి, నోకియా తలరాతను మారుస్తాడనే నమ్మకంతో మైక్రోసాఫ్ట్ నుంచి తెచ్చుకున్న ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీఫెన్ ఎలాప్ తన మాతృసంస్థప్రతినిధిలాగానే పనిచేశాడు. ఆండ్రాయిడ్ అవసరం నోకియాకు లేదని, మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తోనే భవిష్యత్ నోకియా స్మార్ట్ ఫోన్లు రూపొందించాలని 2011లో వివాదాస్పదనిర్ణయంతీసుకున్నాడు. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ తో నోకియానుంచి వచ్చిన ప్రతిష్ఠాత్మక లుమియా ఫోన్లు కూడా పెద్దగా విజయవంతంకాలేదు. 2007లో 40శాతం ఉన్న నోకియా మార్కెట్ షేర్ ప్రస్తుతం 15 శాతానికి పడిపోయింది. ఇక స్మార్ట్ ఫోన్ విభాగంలోనయితే దారుణంగా 3 శాతానికి చేరింది.

మొబైల్ ఫోన్ విభాగాన్ని నోకియా అమ్మేయడంపై మాతృదేశం ఫిన్లాండ్ లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫిన్లాండ్ దేశస్థులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. నోకియా అమ్మకాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిణామాన్ని వారు దేశ ప్రతిష్ఠకు మచ్చగా పరిగణిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ నుంచి స్టీఫెన్ ఎలాప్ రూపంలో ఒక ట్రోజన్ హార్స్(మారువేషంలో వచ్చి దెబ్బతీసే శత్రువు)ను తీసుకొచ్చి నోకియా నెత్తిన పెట్టుకుందని, దానికి ఇప్పుడు మూల్యం చెల్లిస్తోందని ఫిన్లాండ్ లోని ఒక ప్రముఖ టాబ్లాయిడ్ ఇవాళ వ్యాఖ్యానించింది.

మరోవైపు, నోకియా కొనుగోలుద్వారా, యాపిల్(ఐఫోన్), గూగుల్(మోటరోలా) తరహాలో మొబైల్ ఫోన్ ల మార్కెట్ లోకి మైక్రోసాఫ్ట్ కూడా ప్రమేశించినట్లయింది. త్వరలో రిటైర్ కాబోతున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బామర్, రిటైర్ అయ్యేలోపు మైక్రోసాఫ్ట్ నుకూడా యాపిల్ తరహాలో సర్వీసులతోబాటు పరికరాలు తయారుచేసే సంస్థగా మార్చడమే తన లక్ష్యమని ఇటీవల ప్రకటించారు.ఆ లక్ష్యం దాదాపుగా నెరవేరినట్లే ఉంది.

Images courtesy:GOOGLE



Comments

  1. పాత ఓడ కొన్నదండి చిల్లిబోటునూ!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర