Skip to main content

ఏపీలో పీక్స్‌కు చేరిన కులపిచ్చి: కమ్మ, రెడ్డి వర్గాల్లో తీవ్ర అసహనం!

చంద్రబాబునాయుడిని ఎవరైనా విమర్శిస్తే కమ్మవారు భగ్గుమని మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా తప్పుబడితే రెడ్లు నిప్పులు చెరుగుతున్నారు. ఆ మధ్య 'అసహనం' అనే మాట దేశాన్ని పట్టికుదిపేసిన సంగతి తెలిసిందే. ముస్లిమ్, దళిత వర్గాలపై సంఘ్ పరివార్ హిందుత్వ శక్తులు దాడులకు పాల్పడటాన్ని మత అసహనంగా విపక్షాలు, ప్రజాసంఘాలు అభివర్ణించాయి. ఇప్పుడు ఏపీలో అలాంటిదే ఒక అసహనం చోటుచేసుకుంటోంది... కమ్మ, రెడ్డి సామాజికవర్గాలలో. వారి వారి కులాలకు చెందిన పార్టీలపై, తమ కుల అధినేతలపై ఎవరైనా విమర్శలు చేస్తే లేశమైనా తాళలేకపోతున్నారు... విమర్శకులను దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రెండువర్గాలలో నూటికి 95శాతం మంది ఇలాగే మాట్లాడుతున్నారు... వ్యవహరిస్తున్నారు. పరస్పర భౌతికదాడులైతే జరగటంలేదుగానీ కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఈ రెండువర్గాల మధ్య పానిపట్టుయుద్ధం, తళ్ళికోటయుద్ధం స్థాయిలో పరస్పరదాడులు జరుగుతున్నాయి. తీవ్రఅసహనంతో రగిలిపోతున్న ఈ రెండు సామాజికవర్గాల వైఖరిని ఒకసారి పరిశీలిద్దాం.To Read the Full Story, Click Here.

Comments

  1. కులపిచ్చి తన్నులాటలో ఆంధ్ర పరిస్థితి బుచికో బుచిక్. భారతీయుడు సినిమాలో చూపినట్లు 'మీరు
    మారరురా' అందరి నెత్తిమీద ఒక బొట్టికాయ్ వెయ్యాలి.

    ReplyDelete
  2. good afternoon
    its a nice information blog
    The one and the only news website portal INS Media.
    please visit our website for more news updates..

    https://www.ins.media/

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర