చంద్రబాబునాయుడిని ఎవరైనా విమర్శిస్తే కమ్మవారు భగ్గుమని మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా తప్పుబడితే రెడ్లు నిప్పులు చెరుగుతున్నారు. ఆ మధ్య 'అసహనం' అనే మాట దేశాన్ని పట్టికుదిపేసిన సంగతి తెలిసిందే. ముస్లిమ్, దళిత వర్గాలపై సంఘ్ పరివార్ హిందుత్వ శక్తులు దాడులకు పాల్పడటాన్ని మత అసహనంగా విపక్షాలు, ప్రజాసంఘాలు అభివర్ణించాయి. ఇప్పుడు ఏపీలో అలాంటిదే ఒక అసహనం చోటుచేసుకుంటోంది... కమ్మ, రెడ్డి సామాజికవర్గాలలో. వారి వారి కులాలకు చెందిన పార్టీలపై, తమ కుల అధినేతలపై ఎవరైనా విమర్శలు చేస్తే లేశమైనా తాళలేకపోతున్నారు... విమర్శకులను దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రెండువర్గాలలో నూటికి 95శాతం మంది ఇలాగే మాట్లాడుతున్నారు... వ్యవహరిస్తున్నారు. పరస్పర భౌతికదాడులైతే జరగటంలేదుగానీ కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఈ రెండువర్గాల మధ్య పానిపట్టుయుద్ధం, తళ్ళికోటయుద్ధం స్థాయిలో పరస్పరదాడులు జరుగుతున్నాయి. తీవ్రఅసహనంతో రగిలిపోతున్న ఈ రెండు సామాజికవర్గాల వైఖరిని ఒకసారి పరిశీలిద్దాం.To Read the Full Story, Click Here.
ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి - లింక్ .
Add Kapus also
ReplyDeleteకులపిచ్చి తన్నులాటలో ఆంధ్ర పరిస్థితి బుచికో బుచిక్. భారతీయుడు సినిమాలో చూపినట్లు 'మీరు
ReplyDeleteమారరురా' అందరి నెత్తిమీద ఒక బొట్టికాయ్ వెయ్యాలి.
good afternoon
ReplyDeleteits a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/