Skip to main content

చంద్రబాబునాయుడు 4 ఏళ్ళ పాలనలోని 10 తీవ్ర తప్పిదాలు!

చంద్రబాబు 1995లో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవటంలోగానీ, 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ తో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించటంలోగానీ, 1999లో ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని తిరిగి అధికారంలోకి రావటంలోగానీ - ప్రదర్శించిన రాజకీయ చతురత, వ్యవహారదక్షత అందరికీ తెలిసిందే. మరి నాటి ఆ సామర్థ్యం, దూకుడు ఏమయ్యాయోగానీ 2014లో అధికారంలోకి వచ్చిననాటినుంచి పరిశీలిస్తే, ఆయన వ్యవహారశైలి, తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూయిష్టంగానూ, అవకతవకలుగానూ ఉంటున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన 'ఓటుకు నోటు కేసు' అనే ఒక్క తప్పిదం(blunder) తాలూకు మూల్యాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం భరించాల్సివస్తోంది. ఒకనాడు కేంద్రంలో చక్రం తిప్పిన ఆ బాబు ఇప్పుడు ఈ కేసు కారణంగా మోడి ముందు మోకరిల్లుతున్నారు. తద్వారా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోగానీ, ప్యాకేజి విషయంలోగానీ కేంద్రంనుంచి చట్టం ప్రకారం రావాల్సినవాటిని డిమాండ్ చేసే హక్కును(bargaining capacity)ని కూడా కోల్పోవటం ఏపీ ప్రజలపాలిట దురదృష్టంగా మారింది. మరోవైపు ఈ కేసుకారణంగా చంద్రబాబు ఏపీ ప్రజలతోబాటు అటు తెలంగాణలో సొంత పార్టీ శ్రేణులకు కూడా తీవ్రమైన అన్యాయం చేశారని చెప్పాలి.To Read the Full Story, CLICK HERE.

Comments

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

కమ్మవారిని దెబ్బతీయటానికే రాజధానిని జగన్ మార్చారా?

కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే  అంశంపై   మంత్రి   కొడాలినాని నిన్న అసెంబ్లీలో   ఒక   అనూహ్యమైన  కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా   మంత్రి   కొడాలినాని  అసెంబ్లీలో  చేసిన   ప్రసంగం   ఆద్యంతం   ఆసక్తికరంగా   సాగింది .  మాజీముఖ్యమంత్రి   చంద్రబాబు   నాయుడు ,  టీడీపీలోని   తమ   సామాజికవర్గం   నాయకులు ,  ఆ  పార్టీకి   సంపూర్ణ   సహకారాలు   అందిస్తున్న   పత్రికాధిపతులు   రామోజీరావు ,  రాధాకృష్ణ , టీవీ5  నాయుడులపై తనదైనశైలిలో   నాని   చెణుకులు  విసిరారు.    పంచారామాలలో  ఒకటైన పుణ్యక్షేత్రం,  అంతర్జాతీయంగా  ఖ్యాతిగాంచిన  బౌధ్ధ   స్థూపం  ఉ న్న   పవిత్రస్థలం ,  శాతవాహనులకు ...

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .