కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తాను కేంద్రమంత్రిననే విషయాన్ని మరిచిపోయి ఏపీ రాష్ట్రానికి ప్రతినిధిలాగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నీతిఆయోగ్ బృందాన్ని తన ఇంటికి పిలిపించుకుని ఏపీకి చెందిన అంశాలపై మాట్లాడటంపై మండిపడ్డారు. దీనిని టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. వెంకయ్యనాయుడు విభజనతో ఏపీ నష్టపోయినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. Read Full Story Here.
నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...
> వెంకయ్యనాయుడు విభజనతో ఏపీ నష్టపోయినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు!
ReplyDeleteవిభజనతో ఏపీ నష్టపోయినట్లుగా చూపించే ప్రయత్నం ఒకటి ఎవరన్నా చేయాలా? కళ్ళూ చెవులూ ఉన్నవాళ్ళకి అది తెలియని విషయమా?
>వెంకయ్యనాయుడు ఆంధ్రా తరపున మాట్లాడకూడదా?
ఏమో! ప్రపంచంలో అందరూ ఒక్క తెలంగాణా తరపున మాట్లాడటమే బాధ్యతగా జన్మించారని అనుకుంటున్నారేమో!
అయినా మన వెంకయ్యగారివి శుష్కప్రియాలూ - శూన్యహస్తాలూ అన్నసంగతి ఎవరికి తెలియదూ అని!
హోదాపై వెనక్కు తగ్గంఏపీకి స్పెషల్ స్టేటస్ అంశంలో కేంద్రం వెనక్కి తగ్గలేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేకంగా సాయం అందించడం, పరిశ్రమలకు రాయితీలపై.. నీతి ఆయోగ్
ReplyDelete