Skip to main content

నిర్భయ-రిషిత: మరణించి సాధించారు, మార్పులకు నాంది పలికారు!



                    ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి!

Comments

  1. యేమి సాధించారు?

    మానవమృగాలు ఇంకా బలాత్కార మానభంగాలు చేస్తూనే ఉన్నారు!నేరస్తులలఓ పశ్ఛాత్తాపం ఉంటుందా?మన సమాజం నేరస్తుల కార్ఖానాగా తయారయిపోయింది!అనాదిగా అన్యాయాలు అని ఘోషిస్తున్నవి యేవీ అంతమైపోలేదు,కనీసం శాతాల లెఖ్ఖ్క చూసినా పెరుగుతునాయే తప్ప లెఖ్ఖ్క తగ్గడం లేదు,దేన్ని చూసి సతోషించాలి?

    ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి ఇద్దరు మగళ్ళ పేర్లు చెప్పి వాళ్లలో యెవరో ఒకర్ని "లవ్" చెయ్యమని వెంటపడి వేధించటం,తిరస్కరించినందుకు కసిగా నగ్నంగా నడిపించి వీడియో తీసి ఇద్దరు మగాళ్లకి పంపించతం - చూసి యెంజాయ్ చెయ్యమని,ఆ ఇద్దరిలో ఒకడు ట్రెయినీ లెక్చరర్,యెక్కడ జరిగింది ఇదంతా?నాగార్జునా విశ్వవిద్యాలయం యేమన్నా నాగరికతకి దూరంగా ఉందా!జనసమూహం మధ్యనే ఉన్నారు.ఆ మొదటి అమ్మాయి చెయ్యమన్నది ఒక జీవిత కాలపు బంధం అనబడే సీరియస్ వ్యవహారమా - కాదు తార్చదం!

    ఇలాంటి తార్పుడు పనుల కోసమా కాలేజిలకి పంపిస్తున్నది?!ఇలాంటి పైశాచిక చేష్టలకి ట్రెయింగు కోసమా కాలేజీలు ఉన్నది?
    అంత దుర్మార్గం అంతకాలం పాపభీతి గానీ ఆత్మవిమర్స గానీ లేకుండా ఒక ఆదపిల్ల చేసింది!ప్రతిస్పందన యెలా ఉంది?అంత దుర్మార్గం చేసిన తమ కూతురు అమాయకురాలని తలిదంద్రులు వెనకేసుకొచ్చారు!ఒక మంత్రి మేము సింగపూరును తలపించే రాజధాని కడుతుంటే ఆధునిక సంస్కృతిని అలవాటు చేసుకోలేక చచ్చింది అనేశాడు రిషితేశ్వరి గురించి!అతనింకా అంత్రిగానే ఉన్నాడు,అవునా కాదా?

    తన వయస్సులో సగం ఉన కుర్రాళ్ళతో అసహ్యంగా కాళ్ళూ చేతులూ వూపుతూ డ్యాన్సులు చేసేవాడు విద్యాధికారియా?ఆ అమ్మాయీ ఆమె తండ్రీ రిపోర్టు చేసినా పట్టించుకోకుండా ఒక ఆడపిల్ల చస్తే ఇంత రాధ్ధాంతమేమితని విసుకున్న యాజమాన్యన్నీ అతన్నీ సమర్ధిస్తూ కొందరు ఆందోళనలు చెయ్యటం,అంటే నిజంగానే రిషితేశ్వరి ఒళ్ళు ఒవ్వెక్కి చచ్చిపోఇందనా వాళ్ళు అంటున్నది?!బయతపడింది గాబట్టి ఆ ఒక్కచోటు చుట్టూ ఆందోళనలు చేస్తున్నారు అక్కడ కొత్త మనిషిని వీసీగా అపాయింటు చేశారు,మరి మిగతా చోట్ల అద్భుతంగా వెలిగిపోతున్నదా?

    నేరప్రవృత్తిని తగ్గించి సంగంలో ఆదర్సవంతులుగా నిలబెట్టాల్సిన వాళ్ళే కొత్త కొత్త నేరాలకి ట్రెయింగులు తీసుకోవడానికి ఉపయోగించుకుంటున్న దుస్థితి ఇంకా లాగే ఉందిగా?!

    సంస్కారం లేని విద్యని నేర్పుతూ యేమి గర్విస్తాం?!విద్యారంగంలో సమూల మార్పులు అవసరం!

    ReplyDelete
  2. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అమరజ్యోతులైతే కిరణ్ బేడీని ఏమని పిలవాలి ?

    ReplyDelete
    Replies
    1. బాగా అడిగారు.
      'అమర' అన్న పదం చనిపోయినవారిని ఉద్దేశించి వాడేదిగా రూడిలోకి వచ్చేసింది మరి.

      Delete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

గ్రేటర్‌లో జనం గుణపాఠం చెప్పవలసింది కేసీఆర్‌కా, బీజేపీకా?

  రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్‌ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.