Skip to main content

పేపర్లకెక్కిన అక్కినేని ఫ్యామిలీ: జప్తు నోటీసులు జారీచేసిన బ్యాంక్‌లు



హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో అన్నపూర్ణ స్టూడియోస్‌కు చెందిన అత్యంత విలువైన 7 ఎకరాలు 25 గుంటల స్థలాన్ని ఇండియన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ అధికారులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. స్టూడియోస్‌తరపున తమవద్ద తీసుకున్న రుణాలకు సంబంధించి రు. 62కోట్లు బకాయి ఉందని, దీనిపై గత ఏడాది జనవరి రెండున డిమాండ్ నోటీస్ జారీ చేసినప్పటికీ రుణగ్రహీతలు స్పందించనందున 20మార్చి 2015న స్టూడియోస్‌ తరపున తనఖా పెట్టిన స్థలాన్ని స్వాధీన పరుచుకున్నట్లు బ్యాంక్ అధికారులు ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ స్థలానికి సంబంధించి ఎట్టి లావాదేవీలూ జరుపరాదని హెచ్చరించారు. రుణాన్ని తీసుకున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కు అక్కినేని నాగేశ్వరరావు, ఆయన కుమారులు నాగార్జునరావు(నాగార్జున) ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అయితే నాగేశ్వరరావు చనిపోయినందున  నాగార్జునతోబాటు నాగేశ్వరరావు వారసులు వెంకట నారాయణరావు(వెంకట్), కుమార్తె నాగసుశీల('కరెంట్' సుశాంత్ తల్లి), మరో కుమార్తె సరోజ మనవరాలు సుప్రియ(అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం హీరోయిన్), ఇంకా నిమ్మగడ్డ ప్రసాద్(వాన్‌పిక్, మ్యాట్రిక్స్, మాటీవీ), వెంకటేశ్ రొడ్డంకూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారని బ్యాంక్ అధికారులు  తెలిపారు. ఈ బకాయిలకు గ్యారెంటర్లుగా నాగార్జున, సుప్రియ ఉన్నట్లు వెల్లడించారు. 



ఆర్థిక వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉంటారని ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదటినుంచి అక్కినేనికి మంచి పేరుంది. మద్రాస్‌లో, హైదరాబాద్‌లో, ప.గో.జిల్లాలో అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటినుంచో అనేక స్థిరాస్తులు ఉన్నాయి. దానికితోడు ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిచిన 'మనం' చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అలాంటిది అక్కినేని చనిపోయిన కొద్దికాలానికే ఇలా ఆయన కుటుంబం పేరు పేపర్లకెక్కటం ఆశ్చర్యకరంగా ఉంది. 


బ్యాంక్ అధికారుల పత్రికా ప్రకటనను ఈ లింక్‌లో చూడొచ్చు -  http://epaper.eenadu.net. ఈ లింక్ లోకి వెళ్ళిన తర్వాత డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఎంచుకుని అక్కడి dropdownనుంచి హైదరాబాద్ ఎడిషన్‌ సెలక్ట్ చేసుకుని రెండవ పేజిలో చూడండి.

Comments

  1. తెలుగు ప్రజలకి సినిమావాళ్ళంతా ఆరాధ్యదైవాలు కదా. వాళ్ళ గుడ్డి ఆరాధన ముందు ఇటువంటి వార్తలు యేపాటి?

    ReplyDelete
  2. All that glitters is not gold. Thank God there is a security

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

గ్రేటర్‌లో జనం గుణపాఠం చెప్పవలసింది కేసీఆర్‌కా, బీజేపీకా?

  రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్‌ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.