Skip to main content

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లయిన 'శక్తి'


నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'శక్తి' విడుదలవడం...మొదటి షో నుంచే నిర్ద్వంద్వంగా ఫ్లాప్ టాక్ రావడం వెంటవెంటనే జరిగిపోయాయి. నిజంగా నందమూరి అభిమానులకు ఇది ఆశనిపాతమే. ఒక టాప్ హీరో సినిమాకోసం అతని అభిమానులు రోజుల తరబడి కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తుంటారు. అది ఫ్లాపయితే వాళ్ళు... తమ హీరో కంటే ఎక్కువ బాధపడతారు. మళ్ళా తర్వాత సినిమాకోసం ఎదురు చూపులు మొదలుపెడతారు. అందుకనే అగ్రహీరోలు సినిమాలను ఒప్పుకునేటప్పుడు తమ విచక్షణతోబాటు అభిమానుల ఆశలను, అంచనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

తెలుగు సినిమా పరిశ్రమలో ముందున్న రికార్డులకంటే 50-60% అధికంగా కలెక్షన్లు వసూలు చేసి(సాధారణంగా ఇది 10-15% ఉంటుంది), కనీవినీ ఎరగని రికార్డులను స్థాపించిన 'మగధీర'ను తలదన్నే సినిమా చేయాలని ఎన్టీఆర్ కన్న కలలను దర్శకుడు మెహర్ రమేష్ కాలరాశాడు. నిర్మాత అశ్వనీదత్ ఇచ్చిన వనరులను, అవకాశాన్ని సద్వినియోగం చేయలేకపోయాడు(బడ్జెట్ ఎంతో చెబితే ఆ మొత్తాన్ని రమేష్ ఖాతాలో డిపాజిట్ చేస్తానని సినిమా ప్రారంభానికి ముందే దత్ చెప్పాడట). మగధీరను చూసి శక్తి స్టోరీ తయారు చేసుకున్నాడు(ఈయనగారు చేసిన మొదటి సినిమా-కంత్రీ మరో బంపర్ హిట్ సినిమా పోకిరికి కాపీ). ఏమాత్రం కొత్తదనం లేకుండా ప్రతిచోటా మగధీరను తలపిస్తూ తీయడంతో దానితో పోల్చుకోవడం సహజం. మగధీర ప్రమాణాలతో ఎక్కడా తూగకపోవడంతో సినిమా హాస్యాస్పదంగా మారిపోయింది.

అయితే దీనిలో ఎన్టీఆర్ తప్పు కూడా లేదనలేము. కౌలాలంపూర్ లో వేరే సినిమా షూటింగులో ఉన్న తనకు...(వేరే హీరోకోసం సిద్ధంచేసుకున్న)ఈ స్టోరీని రమేష్ వినిపిస్తే...ఇది తానుకాక ఎవరు చేస్తారంటూ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఎన్టీఆరే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. సినిమాల ఎంపికలో అతను మరింత జాగ్రత్తపడాలి.

ఇప్పటికే 'లోకల్ టీవీ'తో నష్టాలపాలయిన అశ్వనీదత్తుకు(ఛానల్ ను ప్రైమ్ స్లాట్ లో పెట్టేందుకు కేబుల్ ఆపరేటర్లకు విపరీతమైన ఛార్జీలు ఇచ్చి లాభాలు గూబల్లోకి వచ్చేటట్లు చేసిందట దత్తుగారి కుమార్తె స్వప్న) ఇది మరో దెబ్బే. దానికితోడు, రేపు(02.04.11) వరల్డ్ కప్ ఫైనల్ ఉండటంతో ఓపెనింగ్స్ బాగా దెబ్బతింటాయని ఇండస్ట్రీవర్గాలు ముందే చెప్పాయి. అసలు, ఫలితం ముందే తెలిసిపోయిందో, ఏమో శక్తికి పబ్లిసిటీ కూడా లో ప్రొఫైల్ లో చేశారు.

Comments

  1. ayyo papam distributors

    ReplyDelete
  2. dattu gaare distributor ani vinnanu, idi nijamaithe manchide kada, evadu teesina gotiloki vade...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

కమ్మవారిని దెబ్బతీయటానికే రాజధానిని జగన్ మార్చారా?

కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే  అంశంపై   మంత్రి   కొడాలినాని నిన్న అసెంబ్లీలో   ఒక   అనూహ్యమైన  కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా   మంత్రి   కొడాలినాని  అసెంబ్లీలో  చేసిన   ప్రసంగం   ఆద్యంతం   ఆసక్తికరంగా   సాగింది .  మాజీముఖ్యమంత్రి   చంద్రబాబు   నాయుడు ,  టీడీపీలోని   తమ   సామాజికవర్గం   నాయకులు ,  ఆ  పార్టీకి   సంపూర్ణ   సహకారాలు   అందిస్తున్న   పత్రికాధిపతులు   రామోజీరావు ,  రాధాకృష్ణ , టీవీ5  నాయుడులపై తనదైనశైలిలో   నాని   చెణుకులు  విసిరారు.    పంచారామాలలో  ఒకటైన పుణ్యక్షేత్రం,  అంతర్జాతీయంగా  ఖ్యాతిగాంచిన  బౌధ్ధ   స్థూపం  ఉ న్న   పవిత్రస్థలం ,  శాతవాహనులకు ...

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .