Skip to main content

మూర్తీభవించిన స్త్రీత్వం సుజాత


ఒద్దిక, అణకువ, సుకుమారం, లాలిత్యం, బిడియం, అపురూపం వంటి సున్నితమైన, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన భావాలకు ప్రతిరూపంగా సుజాతగారిని చెప్పొచ్చు. అసలు ఆమెలో ప్రత్యేకత ఏమిటంటే...సున్నితభావాలతోబాటు ఆత్మాభిమానం, గాంభీర్యం, హుందాతనం పరిణతి, స్పష్టత, మానసికధృడత్వం, ఖచ్చితత్వం(ఎసర్టివ్ నెస్) వంటి భావాలను కూడా ఆమె బ్రహ్మాండంగా పలికించేవారు. మిరుమిట్లుగొలిపే అందం కాకపోయినా స్ఫురద్రూపం. మంచి ఎత్తు, చక్కటి కనుముక్కుతీరు. మాతృభాష మళయాళం కాగా, తెలుగులోనే డైలాగులు చెప్పడంకోసం మన భాషను కూడా నేర్చుకున్నారు. మొదట్లో చౌకబారు(మళయాళీ) సినిమాల్లో నటించినప్పటికీ తర్వాత, తర్వాత తనకు తాను ఒక ఇమేజ్ ఏర్పరుచుకుని దానికే కట్టుబడిఉండటం గొప్పవిషయం(ఫీల్డులో నిలబడటంకోసం దాదాపుగా ప్రతి టాప్ హీరోయిన్ కూడా మొదట్లో చౌకబారు వేషాలు వేసినవారే).

తెరమీదలాగానే, తెరవెనక కూడా ఒద్దికగా, అణకువగా ఉండే ఆమె సహజ స్వభావంవలనో, అదృష్టంవలనోగానీ, సుజాతగారికి మంచి మంచి పాత్రలు లభించాయి. ముఖ్యంగా అవళ్ ఒరు తొడర్ కథై(అంతులేనికథ), అన్నక్కిళి(రామచిలుక), అవర్ గళ్(ఇది కథకాదు), గుప్పెడుమనసు, గోరింటాకు, సుజాత(ఈ సినిమాలో ద్విపాత్రాభినయం) వంటి చిత్రాలలో ఉన్నత వ్యక్తిత్వంగల స్త్రీ పాత్రలను ఆమె తన ప్రతిభతో పండించారు(పైవాటిలోని మొదటి మూడు సినిమాలలోని పాత్రలను తెలుగులో జయప్రద, వాణిశ్రీ, జయసుధ పోషించారు). ఆమె హావభావాలు, ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్...వగైరా అన్నీ ఫక్తు సంప్రదాయ మహిళను తలపించేవి.

తమిళంలో బాలచందర్, తెలుగులో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన చిత్రాలలో సుజాతగారికి మంచి పాత్రలు(author backed roles) లభించాయి. ముఖ్యంగా గోరింటాకులో ఆమె విశిష్ట ప్రతిభ కనబరచింది. శోభన్ బాబుతో ప్రణయ సన్నివేశాలలో ఎంత సున్నితంగా, లలితంగా కనిపిస్తుందో...కట్టుకున్న భర్త(దేవదాస్ కనకాల) మోసగాడని తెలిసి అతనిని నిలదీసేటప్పుడు అంతే కఠినంగా కనబడుతుంది. వయసుపైబడేకొద్దీ హుందాగా తల్లిపాత్రలు తీసుకుని అక్కడా తన ముద్ర వేసుకుంది. రజనీకాంత్ సినిమాలు చాలావాటిలో అతనికి తల్లిపాత్ర వేసింది. ఇక తెలుగులో పెళ్ళి సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఉత్తమసహాయనటిగా నంది అవార్డు కూడా గెలుచుకుంది. కొన్నాళ్ళుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస తీసుకోవడంతో దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పోయినట్లయింది.

Comments

  1. She was one of the good actress in Telugu Movie industry.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.