Skip to main content

అమెరికా విద్యార్ధికి ఒక్కరికైనా భారత్‌లో ఇలా జరిగితే ఊరుకునేవారా?


చింత చచ్చినా పులుపు చావనట్లు...ఆర్ధిక వ్యవస్థ కుదేలైపోయి అగ్రరాజ్య హోదా పోగొట్టుకునే దశలో ఉన్నా, అమెరికా ఇంకా దురహంకార వైఖరిని విడనాడడంలేదు. ఇంకా తమకొకన్యాయమూ, ఎదుటివారికొక న్యాయమన్నట్లుగానే వ్యవహరిస్తోంది. మెక్సికో గల్ఫ్ లో చమురు లీకేజికిగానూ BP ఆయిల్ కంపెనీనుంచి చెవులు మెలిపెట్టి మరీ నష్టపరిహారం కట్టించిన అంకుల్ శామ్...భోపాల్ గ్యాస్ బాధితులకు నష్టపరిహారం విషయంలో మాత్రం సెలెక్టివ్ అమ్నీషియా(మతిమరుపు)ను తెచ్చిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల భారత పర్యటనలో మనదేశాన్ని, సమకాలీన పరిస్థితులలో ప్రపంచంలో మనదేశ ప్రాధాన్యతను ఆకాశానికెత్తేస్తూ మాట్లాడి, అమెరికాఉత్పత్తుల అమ్మకాలకోసం వేలకోట్లరూపాయల వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్ళిన ఒబామాకు, ట్రైవ్యాలీ యూనివర్సిటీ చేతిలో మోసపోయిన భారతీయ విద్యార్ధుల విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం లేదా?

ఆ భారతీయ విద్యార్ధులంతా అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేత వంటి విధ్వంసరచనకు వెళ్ళిన ఉగ్రవాదులో, లేకపోతే మెక్సికోతీరంనుంచి పోలీసుల కళ్ళుగప్పి అక్రమంగా చొరబడే వలసదారులో కాదుకదా. అలా వెళ్ళిన సంఘ వ్యతిరేకశక్తులను పట్టుకోలేని చేతకాని ప్రభుత్వం ఈ పెట్టీ కేసుల విషయంలో తమ ప్రతాపాన్ని చూపుతూ తమ పోలీసుల mediocrityని బయటపెట్టుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ నేరంలో ఆ ప్రభుత్వానికి కూడా భాగం ఉంది. వీరందరికీ వీసాలు మంజూరు చేసేటపుడే ఆ యూనివర్సిటీ గురించి, దాని గత చరిత్ర గురించి విచారించడం ఇమ్మిగ్రేషన్ అధికారుల బాధ్యత కాదా? ఒక్క క్లిక్ చేస్తే ఆ యూనివర్సిటీ గురించిన ఫీడ్ బ్యాక్, దానికి గుర్తింపు ఉందా, లేదా అనే సమాచారం మొత్తం కళ్ళెదుట ఉంటుంది కదా(అంత అభివృద్ధి చెందిన దేశంలో ఏ మనిషిదిగానీ, సంస్థదిగానీ సమగ్రసమాచారం కంప్యూటర్ లో అందుబాటులో ఉండకుండా ఉండే అవకాశంలేదు).

తమ దళాలు మోహరించిఉన్న ఇరాక్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ లలో ఒక్క సైనికుడు కనబడకుండా పోయినా, అతనికోసం ఆయా దేశాలలో అమెరికా పెద్దఎత్తున అల్లకల్లోలం సృష్టించిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. మరి వారి దేశానికి చెందిన విద్యార్ధో, పర్యాటకుడో భారత్ లో ఇలా పట్టుబడితే ఆ ప్రభుత్వం ఇలా ఊరుకుని ఉండేదా. ఆ వ్యక్తిని వదిలేదాకా భారత ప్రధాని దగ్గరనుంచి కానిస్టేబుల్ వరకూ ఎవరినీ ఊపిరి తీసుకోనిచ్చేదికాదు. మరి ఇంతమంది(వేయికి పైగా అనుకుంటా) భారతీయ విద్యార్ధుల విషయంలో ఎందుకీ న్యాయం? వేలమంది ప్రాణాలు తీసిన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీకి నాడు సీఈవోగా ఉన్న ఆండర్సన్ ను భారత ప్రభుత్వానికి ఎందుకు అప్పజెప్పలేదు?

బాధితుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుకుగానే వ్యవహరిస్తోందని చెప్పాలి. విదేశాంగ వ్యవహరాల మంత్రిత్వశాఖ కార్యదర్శి నిరుపమారావును ప్రత్యేకంగా ఈ విషయంపైనే నేడో, రేపో వాషింగ్టన్ పంపిస్తున్నారు. అయితే కేవలం ఇమ్మిగ్రేషన్ అధికారులతో చర్చిస్తే ఉపయోగం ఉండదు. ఆమె అక్కడ ఆ దేశ విదేశాంగ వ్యవహారాల మంత్రి హిల్లరీ క్లింటన్ తోనూ, అధ్యక్షుడు ఒబామాతోనూ ఈ విషయం చర్చిస్తేనే సమస్య పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. అమెరికాలో ముందునించి స్థిరపడిఉన్న ఎన్నారైలు బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ వారికి అండగా నిలవడం ఒక మంచి పరిణామం. మరోవైపు భారత్ తిరిగివెళ్ళి మళ్ళీ అప్లయ్ చేసుకుంటే తాజా వీసాలు ఇస్తామని అమెరికా ప్రభుత్వం చెబుతున్నా బాధితులు నమ్మడంలేదు. ఎంతో కష్టపడి, డబ్బు ఖర్చుపెట్టి ఇక్కడకు వచ్చాం కాబట్టి ఎలాగైనా అక్కడే వేరే యూనివర్సిటీలో సీటు సంపాదించుకునితీరాలని బాధితులు కొంతమంది పట్టుదలగా ఉన్నారు.

Comments

  1. andukE vallu manalaa egaesuku poru...venakaa mundu choosukokundaa pommani evadannaadu??

    ReplyDelete
  2. అమెరికాఉత్పత్తుల అమ్మకాలకోసం వేలకోట్లరూపాయల వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్ళిన ఒబామాకు, ట్రైవ్యాలీ యూనివర్సిటీ చేతిలో మోసపోయిన భారతీయ విద్యార్ధుల విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం లేదా?

    ReplyDelete
  3. "andukE vallu manalaa egaesuku poru...venakaa mundu choosukokundaa pommani evadannaadu??"

    What a stupid response!.

    Human rights are universal. They can not be selectively applied based on ones nationality.

    Prgna: Good post.

    ReplyDelete
  4. మీరు తెలుగు దినపత్రికల్లో చదివిన వార్తల ఆధారంగా ఈ అభిప్రాయానికొచ్చినట్లున్నారు. ఇక్కడ నిజాలు వేరుగా ఉన్నాయి.

    ఈ ట్రైవ్యాలీ యూనివర్సిటీ విద్యార్ధులని మోసం చేయలేదు. యూనివర్సిటీ, విద్యార్ధులు కలసి ప్రభుత్వాన్ని మోసం చేశారు. వీళ్లందర్నీ 'బాధితులు' అంటూ ఒకే గాటన కట్టకండి.

    అసలు కథ ఇది: ఈ 'మోసపోయిన విద్యార్ధులు' ఎవరూ ఈ యూనివర్సిటీ పేరుతో వీసాలు పొంది అమెరికా వచ్చినవాళ్లు కారు. వేరే యూనివర్సిటీల పేరుతో వీసాలు పొంది అమెరికా వచ్చాక, రెండో మూడో సెమిస్టర్లు చదువు పూర్తి చేసి ఆ తర్వాత ట్రైవ్యాలీకి బదిలీ చేయించుకొచ్చినోళ్లు. అలా వచ్చినోళ్లు ఇక్కడ (బే ఏరియాలో) చదవకుండా ఏ టెక్సాస్‌లోనో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. సరే. వీళ్లందరూ ఏదో కోట్లకు పడగలెత్తుదామని చదువు పక్కనబెట్టి పార్ట్ టైమ్ ఉద్యోగాలకి వెంపర్లాడినోళ్లు కాదు. చాలామంది - అమెరికాలో ఆర్ధికమాంద్యం తగ్గేదాకా వేచి ఉండి ఉద్యోగావకాశాలు పెరిగే సమయానికి చదువు పూర్తి చేసుకుంటే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎన్నికయ్యే అవకాశముంటుందని, అప్పటిదాకా ఏదో ఓ ఉద్యోగం చేసుకుని పొట్టపోసుకుంటున్నవాళ్లే. కాకపోతే చట్టరీత్యా అది నేరం. పట్టుబడితే శిక్ష ఖాయం. ఆ సంగతి తెలిసీ వీళ్లు రిస్క్ తీసుకున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇది బుద్ధిపూర్వకంగా చట్టాన్ని అతిక్రమించటమే తప్ప మోసపోవటం కాదు. ఈ మోసంలో సదరు యూనివర్సిటీకీ భాగస్వామ్యం ఉంది కనకనే ప్రభుత్వం ఆ యూనివర్సిటీని మూసివేసింది.

    ఇకపోతే 'వాళ్లేమన్నా ట్విన్ టవర్స్ కూల్చివేతకి వచ్చిన తీవ్రవాదులా?' అన్నారు మీరు. కాకపోవచ్చు. కానీ ఆ ట్విన్ టవర్స్ కూల్చేసింది విద్యార్ధుల ముసుగులో అమెరికా వచ్చిన తీవ్రవాదులే కాబట్టి వీళ్లకీ విదేశీ విద్యార్ధులంటే అంత ఉలికిపాటు ఉండటం సహజం. ఓ సారి చేతులు కాలాకైనా జాగ్రత్త పడకపోతే ఎలా?

    పెరోల్ మీద బయటికొచ్చిన వాళ్లకి రేడియో కాలర్లు తొడగటం ఇక్కడ వింత కాదు. జైళ్లలో మగ్గటం కన్నా అది నయం కాదా?

    ReplyDelete
  5. I agree with Abracadabra. Unless I am terribly wrong, it clearly appears like this is a fraud committed jointly by the students and the university.

    IT WAS ACTUALLY THE STUDENTS WHO OPTED FOR THE COLLARS IN ORDER TO ESCAPE FROM THE JUDICIAL PROCEEDINGS.

    ReplyDelete
  6. స్పందిస్తున్న అందరికీ కృతజ్ఞ‌తలు. అబ్రకదబ్ర, మలక్ పేట రౌడీగారూ, మనవాళ్ళు చేసింది కరెక్టని నా ఉద్దేశ్యం కాదు. అయితే అక్కడ సెటిలయిఉన్న మీ లాంటి తెలుగువారు, షార్ట్ కట్ లో సెటిలవడానికి వచ్చారని చులకనగా చూడకుండా, బాధితులపట్ల సానుభూతితో వ్యవహరిస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయం.

    ReplyDelete
  7. షార్ట్‌కట్‌లో వచ్చారన్న చులకనేమీ లేదండీ. వాళ్ల బాధలు వాళ్లకుండబట్టే శిక్షకి తెగించి మరీ ఉద్యోగాలు చెయ్యాలన్న నిర్ణయం తీసుకున్నారన్న గ్రహింపు ఉంది, దానికి దారితీసిన పరిస్థితులపై (వాళ్లలో కొందరు తమని అమెరికా పంపటానికి తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చటానికి ఆ పని చేశారని విన్నాను) సానుభూతి ఉంది. అయితే ఇందులో ప్రభుత్వం వాళ్లని పనిగట్టుకుని వేధిస్తున్నదేమీ లేదన్నదే నేను చెప్పదలచుకుంది.

    ReplyDelete
  8. మీరు సహృదయంతోనే స్పందించారు. కానీ తమ బ్లాగుల్లో కొందరు ఎన్నారైలు అలా వ్యాఖ్యానించారు. అందుకని నేనలా రాశాను. BTW ఈ బాధితుల సమస్యలకు పరిష్కారాలు మీరేమైనా సూచించగలరా?

    ReplyDelete
  9. There are about 12-20 Million illegals living here.

    Tejaswi has a valid point. Why only these students? Why not all illegals?

    Answer to the above question tells you, why they targeted only these students.

    ReplyDelete
  10. to anonymous...illegle means the govt is anble to find them....pattukunna vallani kuda vadileyamantara...vallu kuda illegal ayi pattu kovadam kastam avuthundi kada.

    ReplyDelete
  11. "illegle means the govt is anble to find them"

    You are mistaken my friend. If Govt. want to find illegals, they can round all illegals in 6 months time.

    But there is "no political will" to find them and deport them.

    It is some what similar to Bangladesi illegals living in India. I agree that it is difficult to find those illegals in India, because those illegals mingle with their Indian counterparts hiding in old cities all over India.

    ReplyDelete
  12. I know from Personal experience, that Most of the students who went to Trivally were Motivated by Greed. There are many consultancies in Hyderabad that offer I20's for Free, The students know that they are fake universities, they go there because they think they can do Partime Jobs instead of Studying in Class.
    Tagging Legs is a common Practise in USA, it is used for implementing HOUSE ARREST, the other Option is locking up in Prison, and US prisons are known for their Gang violence and Rapes, If a young Andhra student is sent to US prison I bet he or She will be Raped a hundred times.


    Many of u upper middle class Bloggers think NRI's are only in US, but many Indians live and work in Gulf Countries, where their conditions are worse than Slaves.

    But no Lagadpati speaks for them in Parliament or No blogger like U writes about them

    ReplyDelete
  13. Manam satruvuni kudaa mithrudilaa chuse Samskruthi lo puttamandi.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.