Skip to main content

వెన్నుచూపి పారిపోనందుకు మొత్తానికి చిరుకు మంచి ప్రతిఫలమే దక్కేటట్లుంది


వ్రతం చెడ్డా ఫలం దక్కడమంటే ఇదేనేమో. మొత్తానికి ముఖ్యమంత్రి కాలేకపోయినా చిరంజీవికి ఏదో గౌరవప్రదమైన స్థానం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఒకానొక సమయంలో చిరంజీవి తన పార్టీని రద్దు చేసేస్తారని, మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోతారని పుకార్లు జోరుగా వినిపించాయి. ప్రజారాజ్యం దుకాణం బంద్ అని, పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తారని మీడియాలో...ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలలో కొంతకాలంగా ఎన్నో కథనాలు వచ్చాయి. దానికి తగ్గట్లుగా తెలంగాణాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు(అనిల్, మహేశ్వరరెడ్డి) ఉన్నా లేనట్లే. రాయలసీమలోని ఇద్దరు ఎమ్మెల్యేలు(శోభానాగిరెడ్డి, కాటసాని) జగన్ వర్గంలో చేరిపోయారు. ఇక ఉన్న 14మందిలో కూడా నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి కూడా జగన్ వర్గంమనిషే. ఇక నికరంగా చూస్తే 13మంది ఉన్నట్లు.

ఒక విషయంలో చిరుని మెచ్చుకోవాలి. రాష్ట్రంలో అంత భారీస్థాయిలో ఆసక్తిరేపుతూ సంచలనాత్మకంగా రాజకీయాల్లోకి వచ్చి, తీరా ఎన్నికల్లో తుస్సుమన్న తర్వాత – ఎవరయినా ఛీ మనకెందుకు ఈ రొచ్చు అని వెనక్కి పారిపోయి ఉండేవారేమో(వెనకకు వెళితే సినిమాఫీల్డులో మరో ఐదారేళ్ళు కెరీర్ కొనసాగించే అవకాశాలున్నాయి కాబట్టి). అయితే ఆ పనిచేయకుండా అంటిపెట్టుకుని ఉన్నందుకు చిరంజీవికి మంచి ఫలితమే దక్కుతున్నట్లుగా అనిపిస్తోంది...తాజా పరిణామాలు చూస్తుంటే. రాజకీయాలలో అపజయం ఎదురయినా వదలబోనని, విజయం సాధించేవరకు పోరాడతానని మొదటినుంచీ(రాజకీయరంగ ప్రవేశం వార్తల వస్తున్న దగ్గరనుంచి) చెబుతూ వస్తున్న చిరంజీవి, దానికి కట్టుబడిఉండటమే ఈ సత్ఫలితానికి కారణం అయిఉండొచ్చు.

గత ఎన్నికల్లో చిరంజీవి పరాజయానికి కారణాలపై ఇప్పటికే ఎంతో చర్చ జరిగినప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి మరోసారి చూద్దాం.
1. రాజకీయాల్లోకి తనంతతానుగా కాక బంధుమిత్రుల ప్రోద్బలంతో అన్యమనస్కంగా ప్రవేశించడం, సంకల్పం బలంగా లేకపోవడం
2. పార్టీ నిర్మాణాన్ని అల్లు అరవింద్ ఒక సినిమా నిర్మాణంలాగా జరపడం.
3. ఉవ్వెత్తున వచ్చిన ఆదరణను, అభిమానాన్ని క్రమపద్ధతిలో నిలుపుకోకుండా నిర్లక్ష్యం చేయడం.
4. పార్టీకి థింక్ ట్యాంక్, ఐడియాలజీ లేకపోవడం.
5. పార్టీలోకి వచ్చిన మేధావులను సక్రమంగా వినియోగించుకోకుండా, పార్టీ వ్యవహరాలను సొంత కుటుంబ వ్యవహారంలాగా నడపడం.
6. పర్యటించిన ప్రతిచోటికీ వేల, లక్షలమంది ప్రజలు వస్తే...అలాంటి అపూర్వ అవకాశాన్ని చేజిక్కించుకుంటూ ప్రసంగాలతో ఆకట్టుకోవలసిందిపోయి, జనం వచ్చారని సంబరపడి తృప్తిపడిపోయారు
7. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మంచి లక్ష్యాలతో నడుపుతున్నప్పటికీ ప్రత్యర్ధులు వాటిమీద లేనిపోని ఆరోపణలు చేస్తే, వాటిని తిప్పికొట్టకపోగా, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రజలు తమ వెనకే ఉన్నారని విర్రవీగారు.
8. అరవింద్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని ప్రజలందరూ నమ్ముతున్నా, చిరంజీవి మాత్రం నమ్మకపోవడం...కనీసం డేమేజ్ కంట్రోల్ చేయకపోవడం.
9. పార్టీ టిక్కెట్ల కేటాయింపులో అవగాహనాలోపం.
10. ప్రత్యర్ధుల ప్రాపగాండాని ఎదుర్కోవడానికి, తమ వాదనను వినిపించుకోడానికి సొంత మీడియా ఉండాలన్న ప్రాధమిక సూత్రాన్ని కూడా పట్టించుకోకపోవడం.

ఏది ఏమైనా...ప్రజారాజ్యం అస్తిత్వంమీద ప్రజలందరికీ అనుమానాలు రేకెత్తుతున్న ఈ సమయంలో, ఆ పార్టీని ఇంకా అంటిపెట్టుకునిఉన్న వీరాభిమానులు కూడా పునరాలోచన పడుతున్న ప్రస్తుత తరుణంలో, కాంగ్రెస్ నుంచి ఈ అవకాశం రావడం చిరుకు ఎంతోకొంత శుభ పరిణామమేనని చెప్పొచ్చు. పీఆర్పీకి కొంత పునరుజ్జీవం లభించినట్లయింది. నానాటికీ ఇమేజ్ దిగజారిపోతున్న ఆ పార్టీ కోలుకోడానికి అవకాశం దొరికింది. ఊళ్ళలో ఉన్న పీఆర్పీ, చిరంజీవి అభిమానులు కాస్త తలెత్తుకుని తిరగగలిగేటట్లయింది. దీనిని నిలబెట్టుకోడానికి చిరంజీవి ప్రయత్నించాలి ఇప్పటికైనా మేలుకుని వ్యూహాలను మార్చుకుని... రాజకీయరంగప్రవేశం చేసి తాను సాధించిందేమిటి,ఇకముందు ఏమిచేయాలి అనేదానిపై చక్కటి అవగాహనకొస్తే మంచిది. వీటన్నటికంటే అరవింద్ మీద ఆధారపడకుండా, అతనిని పక్కనబెట్టి సొంత వ్యక్తిత్వంతో, సొంత ఆలోచనలతో ముందుకు సాగాలి.

Comments

  1. Looks like this is the end of PRP as a political party and end for the dreams of Chiru for CM post.

    Chiru at best will work under Congress and resort to black mail politics similar to MQM and CPM and CPI and TRS.

    ReplyDelete
  2. It is a disgraceful surrender to congress.
    The people who voted to PRP will never forgive Chiranjeevi. His supporters are in a precarious position in the villages and small towns.
    He is unfit for politics.
    He better apologize to the people of AP and close the shop.

    ReplyDelete
  3. రాజకీయాల్లో చిరంజీవి లానే ఉంటేనే అంటే ఓడినా కుడా మనం కాదులే ఓడింది మనకేం పోయింది బోల్డు డబ్బులు వచ్చాయి గా ఏదో ఒకలా పదవి వస్తే చాలుఅనుకోవాలి

    ReplyDelete
  4. సూపర్ ప్లాన్ బాసు ....

    startup company లాగ పార్టీ పెట్టాడు !

    మంచి రేటుకి అమ్మేసుకున్నాడు !

    'అభిమానం' కూడా అంగడి సరుకు లాగా వాడుకోవచ్చని చూపించాడు !

    ReplyDelete
  5. HI
    అంత బావుంది బాసు మనం ప్రతి 5 సంవస్తరలకు Elections పెత్తి బొలెదు Kotlu కర్చు పెత్తి MLA లను MP లను ఎన్నుకుంతం కద.
    మరి తెలంగన విషయం లొ కూద వొతింగ్ పెత్తమని అదగొచుగ మీరు (మెము కూద) అది మానెసి బందు లంతం రస్త రొకొలు అంతం సకలజన సమ్మెలంతం రైల్ రొకొలు అంతం బస్సు రొకొలు అంతం మన ఆస్తులను మనమె తగలబెత్తు కుంతం .ఆత్మ హత్యలు చెసుకుంతం
    దరిద్రపు ఎదవలు అందరుకలిసి సమైక్యంద్ర AND టెలంగన ఉద్యమల్లొ ఉన్నతున్నరు ఒక్కదు logical గ ఆలొచించదు.
    ఎమొ వాల్లకు ఎమైన స్వప్రయొజనలు ఉన్నయెమొ తెలియదు బాసు తెలంగన ఇవ్వలొ వద్దొ Election పెత్తమను.
    టెలంగన ఒక్కదంత్లొనె Election పెదితె 80% మంది తెలంగన కావలంతె ఇచెయ్యమని అందరు పొరదదం
    మొత్తం అంద్రప్రదెష్ లొ అయితె 60% ఒప్పుకుంతె తెలంగన ఇవ్వమని పొరదదం అంతెకాని మన ఆస్తులను మనమె పాదు చెసుకొవదమొ లెక మన సొదరులను (సీమంద్ర OR టెలంగన) మనమె కొత్తుకొవదమొ మూర్కత్వం ల లెదు
    ఇంక 80% మీద నీకు doubt రవొచు కాని అది correct ఎందుకంతె మల్లి మర్చుకొలెని నిర్నయం కాబత్తి.అందరు
    బాసు ఇకనైన లొగిచల్ గ aalochiddam.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.