Skip to main content

యాపిల్ తెలుగు కీబోర్డ్ వాడేవారికి ఒక మంచి చిట్కా


యాపిల్ తెలుగు కీబోర్డ్ అలవాటు ఉన్నవారికి కొత్తగా కంప్యూటర్‌లో ఆ సెటప్ పెట్టుకోవడానికి సాధారణంగా రెండు మార్గాలను అనుసరిస్తున్నాం.

1) అనూ ఫాంట్స్ సాఫ్ట్ వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవడం.(ఇది యూనికోడ్ కాదు)

2) వీవెన్ గారు రూపొందించిన కీబోర్డ్ లేఔట్‌ను నెట్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయడం.

అనూ ఫాంట్స్ ఇన్‌స్టాల్ చేయాలంటే దానిని కొననైనా కొనాలి...లేదా పైరసీ వెర్షన్ అయినా తీసుకోవాలి. అందుకనే యాపిల్ కీబోర్డ్ వాడేవారం ఎక్కువగా వీవెన్ గారి సాఫ్ట్ వేర్ వాడుతున్నాం. అయితే దీనిలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి. ‘ఇన్‌స్టాల్‘ అనే పదం కంపోజ్ చేయాలంటే ఇన్ స్టాల్ అని మధ్యలో గ్యాప్ ఇచ్చి కంపోజ్ చేయవలసి వస్తోంది. అలాగే ‘జ్ఞాన‌ము’ అనే పదములో ఉన్న మొదటి అక్షరం కంపోజ్ చేయడానికి వీలుకావడంలేదు.

ఇదేకాక మనం మన ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా(నెట్ సెంటర్‌లోగానీ, వేరే సిస్టమ్‌లోగానీ) తెలుగులో కంపోజ్ చేయాలంటే తెలుగు సాఫ్ట్ వేర్ అక్కడ అందుబాటులో ఉండటం అరుదు. పై సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం ఉంది. దీనిగురించి మీకు తెలిస్తే సరే. తెలియకపోతే కింద చూడండి.

తెలుగు కీబోర్డుల గురించి నెట్‌లో బ్రౌజ్ చేస్తుండగా నాకు ఈ లింక్‌లో మంచి పరిష్కారం దొరికింది. దీనిలో సౌలభ్యం ఏమిటంటే వీవెన్ గారి కీబోర్డుతో కంపోజ్ చేయలేని పదాలను కూడా ఇక్కడ కంపోజ్ చేయవచ్చు. దీనిలో మరో సౌలభ్యం ఏమిటంటే దీనిని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లో కూడాను వాడుకోగలం. అంటే మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్‌లో తెలుగు కీబోర్డు ఇన్‌స్టాల్ చేసి లేకపోయినా నెట్ ద్వారా ఈ సైట్‌కు వెళ్ళి ఆ ఇంట‌ర్‌ఫేస్‌లోనే కంపోజ్ చేసుకోవచ్చు...లేదా దీనిని డౌన్‌లోడ్ చేసుకుని మన పెన్‌డ్రైవ్‌లో పెట్టుకుని ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. దీనికి ఆన్‌లైన్‌ కీబోర్డ్(లేఔట్) కూడా ఉంది. కొత్తవాళ్ళు నేర్చుకోవాలన్నా చాలా సులభంగా నేర్చుకోవచ్చు.

అయితే దీనిలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఇంటర్ ఫేస్‌లో సేవ్ చేసుకునే అవకాశంలేదు. ఎప్పటికప్పుడు మనం కాపీ చేసుకుని వేరేచోట పేస్ట్ చేసుకుంటూ ఉండాలి. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే వీవెన్ గారి కీబోర్డుకీ దీనికీ కొద్దిగా తేడాలున్నాయి. ‘ఆ, ఈ, ఊ, ఓ’ వంటి దీర్ఘాక్షరాలు కంపోజ్ చేయాలంటే గోపీగారి కీబోర్డులో షిఫ్ట్ పట్టుకోనవసరంలేదు. ఆ ఇంటర్ ఫేస్‌లో ఇచ్చిన కీబోర్డు చూసుకుంటే అర్ధమవుతుంది.

ఈ ఇంటర్ ఫేస్‌ను తమిళుడైన గోపాలకృష్ణన్ అనే ఐటీ నిపుణుడు రూపొందించారు. దీనిపై ఏమైనా సందేహాలుంటే ఆయననే నేరుగా సంప్రదించవచ్చు. నేను కాంటాక్ట్ చేస్తే ఆయన వెంటనే చక్కగా స్పందించారు. కంప్యూటర్ రంగానికి సంబంధించినవాడిని కానప్పటికీ యాపిల్ కీబోర్డుతో తెలుగు టైపింగు చేసేవారు ఎదుర్కొంటున్న చిన్నచిన్న సమస్యలకు ఇది పరిష్కారం కాగలదని, చాలామందికి ఉపయోగపడుతుందని చిట్కాలాంటి ఈ పోస్టు రాశాను. మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.


Image courtesy: www.pixabay.com

Comments

  1. ఇలాంటి సౌకర్యం అను మాడ్యులార్ కీ బోర్డ్ వాడే వారికి ఉందా తెలుప గలరు.
    - ప్రకాష్, హైదరాబాద్

    ReplyDelete
  2. మంచి సమాచారం అందించారండీ. మీరిచ్చిన లింకు బాగుంది. కృతజ్ఞతలు! అక్కడకు వెళ్ళి ‘ఇన్ స్టాల్’ అనే మాట గ్యాప్ లేకుండానే కంపోజ్ చేయగలిగాను.

    వీవెన్ గారు అందించిన లే అవుట్ లో కూడా ‘జ్ఞ’ అక్షరం టైప్ చేయవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ Keys ఉపయోగించాలి. జ టైప్ చేసి, తర్వాత Shift h కొట్టి Alt T టైప్ చేస్తే ఈ అక్షరం వస్తుంది. మీరిచ్చిన లింకులో ఇంత శ్రమపడనక్కర్లేదు.

    ReplyDelete
  3. శ్రవణ్ గారూ, బాగుంది.

    ప్రకాష్ గారూ, మాడ్యులర్ లేయవుటులో యూనికోడ్ టైపు చెయ్యడానికి ఈ లంకెలో చూడండి.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర