Skip to main content

నిర్భయ-రిషిత: మరణించి సాధించారు, మార్పులకు నాంది పలికారు!



                    ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి!

Comments

  1. యేమి సాధించారు?

    మానవమృగాలు ఇంకా బలాత్కార మానభంగాలు చేస్తూనే ఉన్నారు!నేరస్తులలఓ పశ్ఛాత్తాపం ఉంటుందా?మన సమాజం నేరస్తుల కార్ఖానాగా తయారయిపోయింది!అనాదిగా అన్యాయాలు అని ఘోషిస్తున్నవి యేవీ అంతమైపోలేదు,కనీసం శాతాల లెఖ్ఖ్క చూసినా పెరుగుతునాయే తప్ప లెఖ్ఖ్క తగ్గడం లేదు,దేన్ని చూసి సతోషించాలి?

    ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి ఇద్దరు మగళ్ళ పేర్లు చెప్పి వాళ్లలో యెవరో ఒకర్ని "లవ్" చెయ్యమని వెంటపడి వేధించటం,తిరస్కరించినందుకు కసిగా నగ్నంగా నడిపించి వీడియో తీసి ఇద్దరు మగాళ్లకి పంపించతం - చూసి యెంజాయ్ చెయ్యమని,ఆ ఇద్దరిలో ఒకడు ట్రెయినీ లెక్చరర్,యెక్కడ జరిగింది ఇదంతా?నాగార్జునా విశ్వవిద్యాలయం యేమన్నా నాగరికతకి దూరంగా ఉందా!జనసమూహం మధ్యనే ఉన్నారు.ఆ మొదటి అమ్మాయి చెయ్యమన్నది ఒక జీవిత కాలపు బంధం అనబడే సీరియస్ వ్యవహారమా - కాదు తార్చదం!

    ఇలాంటి తార్పుడు పనుల కోసమా కాలేజిలకి పంపిస్తున్నది?!ఇలాంటి పైశాచిక చేష్టలకి ట్రెయింగు కోసమా కాలేజీలు ఉన్నది?
    అంత దుర్మార్గం అంతకాలం పాపభీతి గానీ ఆత్మవిమర్స గానీ లేకుండా ఒక ఆదపిల్ల చేసింది!ప్రతిస్పందన యెలా ఉంది?అంత దుర్మార్గం చేసిన తమ కూతురు అమాయకురాలని తలిదంద్రులు వెనకేసుకొచ్చారు!ఒక మంత్రి మేము సింగపూరును తలపించే రాజధాని కడుతుంటే ఆధునిక సంస్కృతిని అలవాటు చేసుకోలేక చచ్చింది అనేశాడు రిషితేశ్వరి గురించి!అతనింకా అంత్రిగానే ఉన్నాడు,అవునా కాదా?

    తన వయస్సులో సగం ఉన కుర్రాళ్ళతో అసహ్యంగా కాళ్ళూ చేతులూ వూపుతూ డ్యాన్సులు చేసేవాడు విద్యాధికారియా?ఆ అమ్మాయీ ఆమె తండ్రీ రిపోర్టు చేసినా పట్టించుకోకుండా ఒక ఆడపిల్ల చస్తే ఇంత రాధ్ధాంతమేమితని విసుకున్న యాజమాన్యన్నీ అతన్నీ సమర్ధిస్తూ కొందరు ఆందోళనలు చెయ్యటం,అంటే నిజంగానే రిషితేశ్వరి ఒళ్ళు ఒవ్వెక్కి చచ్చిపోఇందనా వాళ్ళు అంటున్నది?!బయతపడింది గాబట్టి ఆ ఒక్కచోటు చుట్టూ ఆందోళనలు చేస్తున్నారు అక్కడ కొత్త మనిషిని వీసీగా అపాయింటు చేశారు,మరి మిగతా చోట్ల అద్భుతంగా వెలిగిపోతున్నదా?

    నేరప్రవృత్తిని తగ్గించి సంగంలో ఆదర్సవంతులుగా నిలబెట్టాల్సిన వాళ్ళే కొత్త కొత్త నేరాలకి ట్రెయింగులు తీసుకోవడానికి ఉపయోగించుకుంటున్న దుస్థితి ఇంకా లాగే ఉందిగా?!

    సంస్కారం లేని విద్యని నేర్పుతూ యేమి గర్విస్తాం?!విద్యారంగంలో సమూల మార్పులు అవసరం!

    ReplyDelete
  2. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అమరజ్యోతులైతే కిరణ్ బేడీని ఏమని పిలవాలి ?

    ReplyDelete
    Replies
    1. బాగా అడిగారు.
      'అమర' అన్న పదం చనిపోయినవారిని ఉద్దేశించి వాడేదిగా రూడిలోకి వచ్చేసింది మరి.

      Delete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

చంద్ర‌బాబు, రామోజీరావు జీర్ణించుకోలేని పరిణామం

అవును నిన్నటి సీఎమ్ మార్పు వ్య‌వ‌హారం వాళ్ళిద్ద‌రికీ అస్స‌లు మింగుడుప‌డ‌ని ప‌రిణామమని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ త‌ర్వాత‌...వాళ్ళిద్ద‌రూ కాంగ్రెస్‌లో  తీవ్రంగా ద్వేషించే వ్య‌క్తి కిర‌ణ్ కుమార్‌రెడ్డి. అటువంటి వ్య‌క్తి ఇవాళ సీఎమ్ అవుతున్నాడంటే వాళ్ళిద్ద‌రికీ నిన్న‌రాత్రి నిద్రకూడా పట్టిఉండదు. అస‌లు వీళ్ళిద్ద‌రికీ - కిర‌ణ్‌కూ గొడ‌వేమిట‌నుకుంటున్నారా...! కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఒక ఏగ్రెసివ్ కాంగ్రెస్ నాయ‌కుడు. 2004లో అధికారంలోకి రాక‌మునుపు, వ‌చ్చిన త‌ర్వాత కూడా తెలుగుదేశంమీద ఎటాక్‌ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో గ‌ట్టివ్య‌క్తి ఎవ‌ర‌ని చూస్తే... కిర‌ణ్‌కుమార్ రెడ్డే ముందుండేవారు. గాంధీభ‌వ‌న్‌లో, సీఎల్పీలో జ‌రిగే ప్రెస్‌మీట్‌ల‌లో ఆయ‌న విమ‌ర్శ‌లు ధాటిగా ఉండేవి. "చంద్ర‌బాబునాయుడూ... ఇదేమిటి, అదేమిటి..." అంటూ ఏక‌వ‌చ‌న సంబోధ‌న‌తోనే కొట్టిన‌ట్లు మాట్లాడేవారు. అసెంబ్లీలో కూడా కిర‌ణ్‌ టీడీపీని బాగా ఎదుర్కొనేవారు. దీంతో చంద్రబాబునాయుడు కిరణ్‌కుమార్ ఉనికిని కూడా సహించలేకపోయేవారు.  దరిమిలా 2004తర్వాత కిరణ్ వైఎస్‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. అసెంబ్లీలో ప్రతిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు కిర‌ణ్ స్పంద‌న‌ను ప్ర‌