Skip to main content

Posts

Showing posts from 2012

నోకియాకు చుక్కలు చూపిస్తున్న గూగుల్, ఏపిల్

మొబైల్ ఫోన్ల మార్కెట్‌లో ఏళ్ళతరబడి రారాజుగా చెలామణీ అయిన నోకియా మార్కెట్ గణనీయంగా పడిపోయింది. మరోవైపు శ్యాంసంగ్, సోని ఎరిక్సన్ కంపెనీలు విపరీతంగా పుంజుకున్నాయి. ఈ పరిణామానికి కారణం స్వయంకృతాపరాధమని తెలుసుకున్న నోకియా పూర్వ ప్రాభవాన్ని సంతరించుకోవడానికి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సెల్ ఫోన్ అంటేనే నోకియా అనే స్థాయిలో ఆ కంపెనీ ప్రస్థానం ప్రారంభమయింది. ఫిన్లాండ్ దేశానికి చెందిన ఈ కంపెనీ దాదాపు ఒకటిన్నర దశాబ్దాలపాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే రెండేళ్ళుగా ఆ కంపెనీ అమ్మకాలు తిరోగమనదిశలో సాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గూగుల్ కంపెనీ సెల్ ఫోన్లకోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో మొబైల్ ఫోన్ల ఉపయోగంలో ఎన్నో సానుకూల, విప్లవాత్మక మార్పులు రావడంతో అందరూ దానిపట్ల ఆకర్షితులయ్యారు. దీనిని గమనించిన శ్యాంసంగ్ కంపెనీ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పలు మోడల్స్‌ను మార్కెట్లోకి దించింది. సోని ఎరిక్సన్, మోటరోలా తదితర కంపెనీలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాయి. కానీ మార్కెట్ నంబర్ వన్‌గాఉన్న నోకియామాత్రం ఈ పరిణామాన్ని లైట్ తీసుకుంది. ఏళ్ళతరబడి తమ ఫోన్లలో అమర్చుతున్

"కాపులకు ఇంత ప్రాధాన్యత ఎందుకు?"

‘ పీసీసీ నాయకత్వం కాపుకు ’ , ‘ మంత్రివర్గవిస్తరణలో ఇద్దరు కాపులు ’ , ‘ కొత్త సమాచార కమిషనర్లలో ఇద్దరు కాపులు ’ . అసలు కాపులకు ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు ? వీళ్ళను ఈ స్థాయిలో ఎందుకు అందలాలెక్కిస్తున్నారు ? ఇప్పుడు రాష్ట్రంలో మీడియాలో ఇదో పెద్ద చర్చ అయి కూర్చుంది. మరోవైపు, ఉన్నట్లుండి కాపులకు లభిస్తున్న ఈ గుర్తింపుపై మిగిలిన కులాల్లో(ముఖ్యంగా వెనకబడిన వర్గాలలో) కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. అయితే కాపువర్గాలు మాత్రం, కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న కుల రాజకీయ చదరంగంలో తమ వర్గం పావులాగా మారడం వలన తాము ఇలా అందరి వ్యతిరేకతను మూటకట్టుకోవలసి వస్తోందని వాపోతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలలో రాజ్యమేలుతున్న కులరాజకీయాల ఫార్ములాను ఆంధ్రప్రదే శ్‍లో కూడా అమలుచేసే ప్రణాళికలో భాగమే కాంగ్రెస్ అధిష్టానానికి కాపులపై ఈ కొత్త ప్రేమ అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు కమ్మయువత, ప్రజారాజ్యం పెట్టినపుడు కాపుయువత ఆవేశంతో ఎలా ఊగిపోయారో, ఇప్పుడు వై ఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీపట్ల రెడ్డి యువత కూడా అంతే ఆవేశంగా ఉన్నారన్న విషయం ఢిల్