ఏదో ఒక సమస్య తీసుకుని ప్రజా ఉద్యమాలు నడిపి అర్జెంట్గా ఏపీలో అగ్రనేతగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న నటుడు శివాజికి దురదృష్టవశాత్తూ నిన్న విశాఖపట్నంలో చుక్కెదురయింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాకోసం శివాజీ ఇటీవల ఉద్యమం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రం నలువైపులా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో మొదటి సమావేశం నిర్వహించారుకూడా. గురువారం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలోని ప్లాటినంజుబ్లీ హాల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశంలో మాట్లాడుతూ కొందరు వక్తలు బీజేపీ, టీడీపీ పార్టీలను విమర్శించినపుడు శివాజీ వారిని అడ్డుకుని మైక్ కట్ చేశారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ వక్తలను శివాజి అనుచరులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అసంతృప్తికి గురైన శివాజి, ఇలా అయితే వెళ్ళిపోతానంటూ తన అనుచరులతోసహా అక్కడనుంచి కారులో ఉడాయించారు. ఓర్పు, సహనంలేని శివాజికి రాజకీయాలు ఎందుకంటూ సమావేశానికి హాజరైన విద్యార్థులు, ఉద్యమకారులు హీరోగారిని తీవ్రంగా దుర్భాషలాడారు. ఈ సమావేశంతాలూకు వీడియోను ఇక్కడ చూడొచ్చు.
'మాస్టర్' చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన శివాజి, గుంటూరుజిల్లా నర్సరావుపేటప్రాంతానికి చెందిన సామాన్యకుటుంబంనుంచి వచ్చారు. హైదరాబాద్లో జెమిని టీవీ ఛానల్లో మొదట చిన్నఉద్యోగం చేసేవారు. ఒకరోజు పాటల ప్రోగ్రామ్కు యాంకర్ రాకపోవటంతో మంచి మాటకారి అయిన శివాజినే ఆ ప్రోగ్రామ్ నిర్వాహకులు యాంకర్ను చేసేశారు. ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు 2000 సంవత్సరంలో కొత్త నటీనటులకోసం నిర్వహించిన పోటీలో సెలక్ట్ అయ్యారు. 'పరదేశి' అనే సినిమాలో అవకాశం సంపాదించుకుని 'మాస్టర్' చిత్రంద్వారా వెలుగులోకి వచ్చారు. హీరో స్నేహితుడి వేషాలు వేస్తూ ఉండే శివాజి మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం వంటి చిత్రాలద్వారా హీరోగా ఓ వెలుగు వెలిగారు. మాస్ హీరోగా ఎదగాలని స్టేట్ రౌడీ, సీతారాముడు అనే కొన్ని చిత్రాలు తీయగా అవి వారంకూడా ఆడలేదు. ఆ దెబ్బతో చిన్న సినిమాల ఆఫర్లు కూడా పోయాయి. ఇటీవల అవకాశాలు లేకపోవటంతో తనే స్వంతంగా 'బూచమ్మ బూచాడు' అనే కామెడీ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించారు. అది ఓ మాదిరిగా నడిచింది.
టీవీ9 ఎడిటర్ రవిప్రకాష్తో సాన్నిహిత్యం కలిగిఉన్న శివాజీ, ఆ ఛానల్ మద్దతుతో ఉద్యమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఏదో ఒక సమస్య తీసుకుని రోడ్డెక్కుతున్నారు. ఆ కార్యక్రమాలన్నింటినీ టీవీ9 అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చూపిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెంవద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదం బాధితుల సమస్యతో ఉద్యమాల బాటలో బయలుదేరారు. ఆ తర్వాత, తిరుమలలో దేవస్థానం బోర్డ్ ధనికులకు ఊడిగం చేస్తోందంటూ హైదరాబాద్లో ఒకరోజు ధర్నా చేశారు(టీటీడీ బోర్డ్ ఛైర్మన్ కావాలన్నది తన కోరికలలో ఒకటని ఈయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వాక్రుచ్చారు). రోడ్డుప్రమాదాలు ఎక్కువైపోతున్నాయంటూ కొన్నిరోజులు ఆక్రోశం వెలిబుచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాకోసం గళమెత్తారు. అన్నిపార్టీలూ కలిసి ఏపీని తొక్కేస్తున్నాయని, దీనికోసం ఉద్యమించాలని నినదించారు. అంతర్యుద్ధం తప్పదని ప్రభుత్వాలను హెచ్చరించారు.
లక్ష్యం స్వార్థపూరితమైనప్పటికీ ఆ ప్రయత్నంలో శివాజి మరింత శ్రద్ధ, కృషి పెడితే బాగుండేది. ఏదో ఒక సమస్యతో టీవీ ఛానల్లో కనిపించాలనికాకుండా, చిత్తశుద్ధితో ఏదో ఒకటి నిర్మాణాత్మకంగా చేయాలి. ఆ సమస్యను సమూలంగా అధ్యయనం చేయాలి. శివాజి సభలలో మాట్లాడే మాటలు చూస్తే పరిణతితోకూడినవిగాలేకపోగా చిన్నపిల్లలు మాట్లాడినట్లు ఉన్నాయి. షార్ట్కట్లద్వారా తొందరగా పైకి ఎగబాకాలనికాక ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకంగా శివాజి కృషిచేస్తే బాగుంటుంది.
Image courtesy:fb.com/ActorSivaji
good one dont trust him
ReplyDeleteఆంద్ర కేజ్రీవాల్ స్వ. ఎంఎస్ నారాయణ గారండీ బాబూ. శివాజీ & లోక్సత్తా నారాయణ రాజకీయాలలో ఎంఎస్ నారాయణ లాంటి వాళ్ళు.
ReplyDeleteమహేష్ బాబు శ్రీమంతుడు పాటలను ఇక్కడ వినండి srimanthudu songs download - మహేష్ బాబు శ్రీమంతుడు పాటలను ఇక్కడ వినండి
ReplyDeleteమీరు తెలుగు వార ఐతే ఇక్కడే మనకు నచిన srimanthudu songs download - మహేష్ బాబు శ్రీమంతుడు పాటలను ఇక్కడ వినండి