Skip to main content

గుడివాడలో దొంగనోట్లు పంచింది తెలుగుదేశమంటూ సాక్షి కథనం



గత ఆదివారం గుడివాడలో మున్సిపల్ ఎన్నికలసందర్భంగా ఒకవార్డులో జగన్ పార్టీ నేతలు ఓటర్లకు దొంగనోట్లు పంచారని మీడియా అంతా కోడైకూసిన సంగతి తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియావంటి ఆంగ్ల దినపత్రికలుకూడా వైఎస్ఆర్ సీపీనేతలు ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్నట్లు (http://goo.gl/UqFBNR) వార్తను ఇచ్చాయి. అయితే, సాక్షి మీడియామాత్రం ఈ వార్తను దీనిని 'తనదైన శైలి'లో ఆవిష్కరించింది. గుడివాడలో తెలుగుదేశంనేతలు చెల్లనినోట్లు పంపిణీ చేశారంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో కథనాలు ఇచ్చింది. క్రింది లింక్‌లో ఆ కథనాలను చూడొచ్చు.

http://goo.gl/ogIJM3

ఈ వార్త పూర్వాపరాలలోకి వెళ్తే, గుడివాడ పట్టణంలోని 21వవార్డులో అభ్యర్ధి ఒకరు ఓటుకు రెండువేలరూపాయల చొప్పున డబ్బు పంచారు. నాలుగు ఐదొందలరూపాయల నోట్లుగా ఆ డబ్బును ఇచ్చారు. తీసుకున్న ఓటర్లలో కొందరు వాటిని దుకాణాలలో ఇవ్వబోగా అవి 2005కు పూర్వం ముద్రించినవి కాబట్టి చెల్లబోవంటూ వ్యాపారులు నిరాకరించారు. దీంతో, తాము మోసపోయామని భావించిన సదరు ఓటర్లు లబోదిబోమన్నారు. అయితే తాము తీసుకుంది అక్రమ వ్యవహారంకాబట్టి పోలీసులకు చెప్పలేక తేలుకుట్టిన దొంగల్లాగా కిమ్మనకుండా కూర్చున్నారు. అయితే  మీడియాకు ఎలాగో పొక్కి ఈ విషయం బయటకొచ్చింది. స్థానిక తెలుగుదేశంనేతలు ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ సీపీ నేతలమీద పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇద్దరు జగన్ పార్టీ నేతలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, తాము పంచింది నకిలీ నోట్లుకాదని, 2005కుపూర్వం ముద్రించినవిమాత్రమేనని సదరు అభ్యర్ధితరపువారు ఓటర్లకు నచ్చచెబుతున్నా ఉపయోగంలేకుండా పోయింది. విషయం పోలీసులదృష్టిలోకెళ్ళిపోయింది. పోలీసులు పంపిణీ జరిగిన నోట్లను సేకరించి విచారణ ప్రారంభించారు.

image courtesy:wikipedia.com

Comments

  1. జగన్‌పార్టీ నేతల కుళ్ళు రాజకీయాలకు కాలం చెల్లేదెప్పటికో. . .దరిద్రమేమంటే ఆ పార్టీ కరపత్రిక సాక్షిని చదివే మూర్ఖులకు ఇక నిజాలు తెలిసే అవకాశమే లేదు. . . నేను టిడిపికి సపోర్ట్‌కాదండి గమనించండి. ఈరోజునుంచి మరో శవ రాజకీయం. . . ఈనాడు చందాదారులుగా ఉన్న ప్రతి ఒక్కరికి సాక్షి పత్రిక మూడు నెలలు ఉచితంగా వేస్తారట. . . ఈ మూడు నెలలు ఉచితంగా కరపత్రాలు (సాక్షి) పంచి ఎన్నికల కమిషన్‌నుంచి తప్పించుకుందామని. సామాన్యుడు పేపర్‌ ఉచితంగా వస్తుందని భావిస్తున్నాడే కానీ, ఉచితంగా పేపర్‌ ఇచ్చి ఎన్ని కోట్లు సంపాదిస్తాడో ఊహించట్లేదు. అసలు ఉచితంగా ఎవ్వరైనా ఎందుకు ఇస్తారు? అప్పనంగా సంపాదించిన సొమ్ము అయితేనే కదా. . సామాన్య ఓటరుకు తెలిసేదెన్నడో. . .

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని