త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ పార్టీ, తెలంగాణలో తెరాస మెజారిటీ సాధిస్తాయని తాము నిర్వహించిన సర్వేలో తేలినట్లు నీల్సన్-ఎన్టీవీ సంస్థలు వెల్లడించాయి. ఇవాళ వెలువడిన ఈ సర్వేఫలితాల ప్రకారం, సీమాంధ్రలో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి 129-133, తెలుగుదేశానికి 42-46, కాంగ్రెస్కు 0 స్థానాలు, పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ పార్టీకి 19-21స్థానాలు, తెలుగుదేశానికి 4-6, కాంగ్రెస్కు 0 స్థానాలు లభిస్తాయి. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు 51-57, కాంగ్రెస్కు 46-52, బీజేపీకి 5-8, తెలుగుదేశానికి 4-6,ఎమ్ఐఎమ్కు 7-8, పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసకు 6-8, కాంగ్రెస్కు 7-9 సీట్లు దక్కనున్నాయని సర్వే చెబుతోంది.
అయితే, అభ్యర్ధుల ఎంపిక, పొత్తుల ఖరారు తర్వాత ఈసర్వే ఫలితాలలో స్వల్ప తేడాలుంటాయని, మళ్ళీ తాము కొద్దిరోజులలో మరో సర్వే జరపబోతున్నామని, అప్పుడు మరింత ఖచ్చితత్వం వస్తుందని నీల్సన్ సంస్థ ప్రతినిధి శేషగిరిరావు చెప్పారు. సీమాంధ్రలో జగన్ పార్టీ ప్రభావం నిలకడగా ఉంటుండగా, తెలుగుదేశం పుంజుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండుపార్టీలమధ్య ఓట్లశాతం తేడా ఎనిమిదేనని, పట్టణ ప్రాంత ఓటర్లు టీడీపీవైపు మొగ్గుచూపుతున్నారని వెల్లడించారు.
జగన్ పార్టీ పోల్ మేనేజ్మెంట్, అభ్యర్ధుల ఎంపిక విషయాలలో బాగా బలహీనంగా ఉందికాబట్టి అది తెలుగుదేశానికి కలిసిరావచ్చని సర్వేఫలితాలపై ఎన్టీవీలో జరిగిన చర్చాకార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీమాంధ్రశాఖ ముఖ్యనాయకుడు రఘునాధబాబు అన్నారు. మరోవైపు సీమాంధ్రలో అసెంబ్లీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశానికి మెజారిటీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ ప్రకటించారు. ఎన్టీవీలో జరిగిన చర్చాకార్యక్రమంలో రమేష్ ఈ ప్రకటన చేశారు. ఈ సర్వేను నమ్ముతున్నామని జగన్ పార్టీ నేత మైసూరారెడ్డి, తెరాస నేత కేటీఆర్ చెప్పారు.
image courtesy:ntvtelugu.com
అయితే, అభ్యర్ధుల ఎంపిక, పొత్తుల ఖరారు తర్వాత ఈసర్వే ఫలితాలలో స్వల్ప తేడాలుంటాయని, మళ్ళీ తాము కొద్దిరోజులలో మరో సర్వే జరపబోతున్నామని, అప్పుడు మరింత ఖచ్చితత్వం వస్తుందని నీల్సన్ సంస్థ ప్రతినిధి శేషగిరిరావు చెప్పారు. సీమాంధ్రలో జగన్ పార్టీ ప్రభావం నిలకడగా ఉంటుండగా, తెలుగుదేశం పుంజుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండుపార్టీలమధ్య ఓట్లశాతం తేడా ఎనిమిదేనని, పట్టణ ప్రాంత ఓటర్లు టీడీపీవైపు మొగ్గుచూపుతున్నారని వెల్లడించారు.
జగన్ పార్టీ పోల్ మేనేజ్మెంట్, అభ్యర్ధుల ఎంపిక విషయాలలో బాగా బలహీనంగా ఉందికాబట్టి అది తెలుగుదేశానికి కలిసిరావచ్చని సర్వేఫలితాలపై ఎన్టీవీలో జరిగిన చర్చాకార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీమాంధ్రశాఖ ముఖ్యనాయకుడు రఘునాధబాబు అన్నారు. మరోవైపు సీమాంధ్రలో అసెంబ్లీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశానికి మెజారిటీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ ప్రకటించారు. ఎన్టీవీలో జరిగిన చర్చాకార్యక్రమంలో రమేష్ ఈ ప్రకటన చేశారు. ఈ సర్వేను నమ్ముతున్నామని జగన్ పార్టీ నేత మైసూరారెడ్డి, తెరాస నేత కేటీఆర్ చెప్పారు.
image courtesy:ntvtelugu.com
Emi survey andi veella moham. aa ABP vaadu NDTV ki official partner. NDTV is Sakshi's official sponsorer and mentor. You can expect it now. Moreover country motham lo 29000 members ni survey chesadu anta. ante on an average each Parliament segment ki 49 members and each Assembly segment ki 5 people ni theeskoni average chesadu. ee survey ki credibility emundhi cheppandi.
ReplyDeletewell Said
Deleteసర్వేలంటే అలానే చెస్తారు మరి.. అంతేగాని, ఇండియాలో అందరి దగ్గరికీ వెళ్ళరు.. ఇవే సర్వేలు గత రెండు ఎన్నికల్లో దాదాపుగా.. ఖచ్చితంగా అంచనా వేయగలిగాయి..
ReplyDeleteidhe survey delhi lo AAP ki 5 seats kuda ravu ani cheppindhi.
Deleteidhe survey Madhya Pradesh lo congress clean sweep ani cheppindhi.
idhe survey Rajasthan lo neck to neck competition ani cheppindhi.
results emayyayo meeku thelusu anukunta.
Survey is true
ReplyDeleteఏందుకొ్ ఈ సర్వే ని నమ్మవచ్చు అనిపిస్తుంది.పాత సర్వేలన్ని కూడ నిజం అయ్యాయి కదా.
ReplyDeleteపాత సర్వేలప్పటి బంధం వేరు ఇప్పటి బంధం వేరు అనిపిస్తన్నుది. ఎన్టీవి అమ్ముడు పోయిందని ఈ మధ్య వార్తలను చూస్తుంటే చిన్నపిల్లలకు కూడా అర్ధమవుతుంది
ReplyDeleteఅద్భుతం జరిగి టెక్నాలజీ అంతా నాశనమయిపోయి వెనుకటి దూరదర్శన్ రోజులు వస్తే బాగుండు. నాలుగు రోజులాగితే ఓటు ద్వరాఆ ఫలితం తెలుస్తుందికదా ఇంతలో ఈ కంగారేల?
ReplyDelete