Skip to main content

నెట్‌లో లభిస్తున్న మీ ఇంటి శాటిలైట్‌మ్యాప్, ఫోటోలు చూసుకోండి!



మీరు లేదా మీవాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉంటున్నట్లయితే, మీ ఇంటి శాటిలైట్ మ్యాపును, 360డిగ్రీలలో ఫోటోలను చూసుకునే అవకాశాన్ని ఒక భారతీయసంస్థ కల్పిస్తోంది. వోనోబో.కామ్ (www.wonobo.com) అనే వెబ్ సైట్ ద్వారా మీరు మీ ఇంటి శాటిలైట్ మ్యాప్, ఫోటోలు చూసుకోవచ్చు. ఆ వెబ్ సైటుకు వెళ్ళగానే, మీరు ఏ నగరం చూడాలనుకుంటున్నారని ప్రశ్న ఎదురవుతుంది. అక్కడున్న డ్రాప్ డౌన్ లోనుంచి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవాలి. మీరు ఆ నగరాన్ని ఎంచుకుని ఎంటర్ నొక్కగానే చార్మినార్ ఫోటో కనిపిస్తుంది. అయితే మీరు చూడాలనుకున్న ప్రదేశంకోసం మీరు కుడివైపు కిందభాగంలో కనిపిస్తున్న మ్యాప్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్ సగభాగంలో మ్యాప్, సగభాగంలో ఫోటో కనిపిస్తాయి. ఆ మ్యాప్ ద్వారా మౌస్ ను కదిలిస్తూ మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళొచ్చు. అక్కడ మీరు చూడాలనుకున్న ప్రదేశం మ్యాప్ తోబాటు, 360 డిగ్రీలలో ఫోటోలు కూడా దర్శనమిస్తాయి. మీరు టెక్నాలజీ పెద్దగా పరిచయంలేనివారైతే, ఈ వెబ్ సైట్ మీకు పల్లెటూరుతప్ప మరేమీ తెలియనివారిని నగరం నడిబొడ్డున వదిలినట్లుగా, కొద్దిగా అయోమయంగానే ఉంటుంది. ఎవరినైనా సాయం తీసుకుంటే నేవిగేషన్ తేలికవుతుంది.

స్ట్రీట్ వ్యూ అనే ఈ సదుపాయాన్ని అంతర్జాతీయ టెక్నాలజీదిగ్గజం గూగుల్ కొంతకాలంగా పలుదేశాలలో అందిస్తోంది. భారత్ లోకూడా ఈ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నా, వివిధ ప్రభుత్వ శాఖలనుంచి అనుమతులు లభించకసతమతమవుతోంది. ఈ సమయంలో ఇద్దరు భారతీయసోదరులు చురుకుగా స్పందించి గూగుల్ తలపెట్టిన ఆ కార్యాన్ని పూర్తిచేసేశారు. సోల్ మాలిక్, సాజిద్ మాలిక్ అనే ఆ సోదరులకు చెందిన జెనెసిస్ ఇంటర్నేషనల్ అనే సంస్థమొదటి విడతలో ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, గోవా, కొలకతా, ఆగ్రా, పూణెవంటి 12నగరాలకు స్ట్రీట్ వ్యూ సేవలను అందించటం ప్రారంభించింది. త్వరలోనే ఈ సేవలను 54 భారతీయనగరాలకు వీరు విస్తరించనున్నారు. వీరు కొంతకాలంగా మ్యాప్ లు రూపొందించే వ్యాపారంలో ఉండటంవలన గూగుల్ సాధించలేని అనుమతులను సాధించటానికి వీరికి వీలయింది.

ప్రజల జీవనవిధానాన్ని రోజురోజుకూ మరింత సౌకర్యవంతంచేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్ట్రీట్ వ్యూ ద్వారా మరో కొత్త సౌకర్యాన్ని ఆవిష్కరించినట్లయింది. చిన్నచిన్న గల్లీలతో సహా దాదాపుగా నగరం అంతటినీ ఫోటోలు తీసి పెట్టటంవలన ఈ స్ట్రీట్ వ్యూ నగర జీవనవిధానంలో పెనుమార్పులే తీసుకురానుంది. నగరంలోని ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ఈ స్ట్రీట్ వ్యూద్వారా గతంలోకంటే సులభంగా, వేగంగా వెళ్ళవచ్చు. వ్యాపార, వాణిజ్యాలలోస్ట్రీట్ వ్యూఎంతో ఉపయోగకరంగా మారనుందని, అయితే ప్రస్తుతానికి తమ సేవలు వాడుకోవటానికి సంస్థలనుంచి ఛార్జీలు వసూలుచేయటంలేదని జెనెసిస్ సంస్థ ఎండీ సాజిద్ మాలిక్ చెప్పారు.



Comments

  1. చాలా ధన్యవాదములండీ. ఇది చాలా ఉపయోగకరమైన సమాచారం.

    ReplyDelete
  2. సురేష్ బాబుగారూ, నేను మీ బ్లాగ్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. మీ స్పందన తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని