Skip to main content

ఒబామాకు నిరసనలు తెలిపేందుకు సిద్ధమైన లెఫ్ట్ పార్టీలు-అతిథిని ఆదరించాలన్న శ్రీశ్రీశ్రీ రవిశంకర్

ఇవాళ ముంబాయిలో దిగుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నిరసనలు తెలిపేందుకు సీపీఐ, సీపీఎమ్, ఫార్వార్డ్ బ్లాక్ తదితర వామపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఐదుగంటలకు ముంబాయిలోని చర్చిగేట్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. మరోవైపు ఎల్లుండి ఒబామా భారత్ లో అధికారిక కార్యక్రమాలలో పాల్గొననున్నందున...ఆ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించబోతున్నారు. తీవ్రవాదంపై పోరులో...ముఖ్యంగా 2008 నవంబర్ 26నాటి ముంబాయి పేలుళ్ళ సూత్రధారి డేవిడ్ హెడ్లీని భారత ప్రభుత్వానికి అప్పజెప్పడానికి...అమెరికా ఏమాత్రం సాయపడటంలేదని, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో కీలక నిందితుడు యూనియన్ కార్బైడ్ మాజీ అధినేత వారెన్ ఆండర్సన్ ను భారత ప్రభుత్వానికి అప్పజెప్పడానికి కూడా అమెరికా సహకరించడంలేదని వామపక్షనేతలు ఆరోపిస్తున్నారు. అమెరికాకు అనుకూలమైన ఆర్ధిక, విదేశాంగ విధానాలను అనుసరించేలా భారత్ పై ఒత్తిడి చేస్తోందని కూడా వారి ఆరోపణ.

మరోవైపు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ గురూజీ శ్రీశ్రీశ్రీ రవిశంకర్...ఇది తగదంటూ లెఫ్ట్ పార్టీలను వారిస్తున్నారు. ఒబామా భారతదేశానికి వస్తున్న అతిధి అని, అతిధులను ఆదరించడం భారత సంస్కృతి, నాగరికతలో భాగమని అని ఆయన గుర్తు చేశారు.

Comments

  1. Yes he is right ,provided-అమెరికన అతిధులకు అయ్యే ౧౦౦ కోట్ల ఖర్చును ఆయన భరించడానికి ముందుకొస్తే.....

    ReplyDelete
  2. ఆస్ట్రాయిడ్‌ చెప్పిన దాన్ని నేను సమర్థిస్తున్నా.... అమెరికా ప్రయోజనాలకు లోబడే ఒబామా పర్యటన ఉంటుంది. మన దేశానికి జరిగే నష్టాన్ని ఎవరు భరించాలి. అమెరికా ఒకపక్క పరోక్షంగా పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తుంది. మనదేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. మన్మోహన్‌సింగ్‌ మాటకోసం, సంపన్నుల కొమ్ముకాసేలా ఉందని నాఅభిప్రాయం.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని