Skip to main content

'డెస్టినేషన్ మ్యారేజ్' చేసుకుందామనుకున్న అల్లు అర్జున్...కాదన్న అరవింద్!


స్నేహరెడ్డితో అల్లు అర్జున్ పెళ్ళి వార్తలు మొత్తంమీద నిజమేనని తేలింది. అల్లు అరవింద్ స్వయంగా ఈ వార్తను మీడియాకు ప్రకటించారు. అయితే అది అరేంజ్డ్ మ్యారేజా లేక లవ్ మ్యారేజా అన్నదానిమీద ఇంకా స్పష్టత రాలేదు. అరవింద్ మాత్రం ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పడానికి ప్రయత్నించారు. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే వేరే కులంలో అమ్మాయిని ఎందుకు చేసుకుంటున్నట్లో(అరవింద్ కాపు కులానికి చెందినవారు)!

పెళ్ళి ఏర్పాట్ల గురించి చెబుతూ...కొద్దిమంది బంధుమిత్రులతో ఎక్కడికైనా వెళ్ళి డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుని వచ్చి హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఇద్దామని బన్నీ అన్నాడని అరవింద్ తెలిపారు(జనానికి దూరంగా బ్యాంకాక్, మారిషస్ లేదా రాజస్థాన్ వంటిచోట్ల ఉండే ఏదైనా మంచి రమణీయ ప్రదేశానికి వెళ్ళి పెళ్ళి చేసుకోవడమే డెస్టినేషన్ మ్యారేజ్). అయితే ఆ ప్రపోజల్ ను తాను వ్యతిరేకించినట్లు అరవింద్ తెలిపారు. పెళ్ళి నిర్వహణ ఆడపెళ్ళివారిది కాబట్టి వారి ఇష్టాన్నిబట్టి పోవాలని తాను బన్నీకి చెప్పినట్లు వెల్లడించారు. పెద్దకొడుకు(అర్జున్ కంటే పెద్దవాడు)కు తన కులంలోని అమ్మాయితోనే పెళ్ళి చేసిన అరవింద్...బన్నీకి మాత్రం కులాంతర వివాహం చేయాల్సి వస్తోంది. మరీ మూడోవాడు అల్లు శిరీష్ కు ఏ కులం అమ్మాయిని తెచ్చుకుంటారో వేచి చూడాలి.

Comments

Post a Comment

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని