ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలనుకునేవారికి ఇది శుభవార్తే! నిన్న జెండా పండగనాడు ఒకేరోజు రెండు వేర్వేరు కంపెనీలు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేశాయి. ప్రముఖ క్యాబ్ యాగ్రిగేటర్ కంపెనీ 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో ప్రవేశించి తయారుచేసిన స్కూటర్ను ఆ సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ నిన్న మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేయగా, బెంగళూరుకు చెందిన 'సింపుల్ ఎనర్జీ' అనే స్టార్ట్ అప్ సంస్థ ప్రపంచంలోనే మరెక్కడా లేనటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్తో 'ఒన్' అనే స్కూటర్ను నిన్న సాయంత్రం 5 గంటలకు విడుదల చేసింది. ఈ రెండు స్కూటర్లు రెండూకూడా ధరలోనూ, టెక్నికల్ స్పెసిఫికేషన్స్లోనూ పోటీపడుతుండటం విశేషం. వీళ్ళ పోటీ పుణ్యమా అని ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో మార్కెట్ బయ్యర్స్కు అనుకూలంగా మారటంతో అంతిమంగా వినియోగదారులు/కొనుగోలుదారులు లాభపడనున్నారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.
Comments
Post a Comment