గూగుల్ సైంటిస్ట్ మల్లిక్ పరుచూరిని హైదరాబాద్ పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. థర్డ్ వేవ్ లో ఇంటికో శవం లేస్తుందనే వ్యాఖ్యలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారనే అభియోగంపై ఆయనను సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆయనకు మద్దతుగా వీరమాచనేని రామకృష్ణ, మరికొందరు మద్దతుదారులు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడంటే సెకండ్ వేవ్ ఉపశమించటంతో కాస్త తగ్గిందిగానీ, ఆమధ్య, ఒక నెలరోజుల క్రితం ఈ మల్లిక్ పరుచూరి గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చ జరిగింది. ఇతనికి మద్దతుగా, వ్యతిరేకంగా సోషల్ మీడియాలో, బయట తెలుగు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా వాదోపవాదాలు చేసుకున్నారు.
మల్లిక్ పరుచూరి తనను తాను ఒక లూయీస్ పాశ్చర్(వైద్యరంగంలో అపూర్వమైన ఆవిష్కరణలు చేసి మానవాళికి మహోపకారం చేసిన ఒక జీనియస్ సైంటిస్ట్) లాగా ఊహించేసుకుని కోవిడ్ వ్యాధికి తనదైన శైలిలో మందులు ప్రిస్క్రైబ్ చేసి వార్తలలోకెక్కిన సంగతి తెలిసిందే. అలా మందులు సూచించటమేకాకుండా, సాంప్రదాయక(conventional) వైద్య విధానంలో కోవిడ్ చికిత్సకు అనుసరిస్తున్న ప్రతి పద్ధతినీ మల్లిక్ ఎద్దేవా చేస్తూ అల్లోపతి వైద్యులపై దుమ్మెత్తిపోశారు. అంతవరకు అయితే ఫర్వాలేదు, కానీ ఆయన ఈక్రమంలో, శిక్షార్హమైన కొన్ని తప్పిదాలు చేశారు. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment