అలనాటి సుప్రసిద్ధ తెలుగు కవి, సినీ రచయిత ఆరుద్ర భార్య, తానుకూడా స్వయంగా రచయిత్రి అయిన రామలక్ష్మి ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె కొందరు ప్రముఖులనుద్దేశించి మాట్లాడిన భాష, ఉపయోగించిన పదాలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఇంటర్వ్యూ చేసిన సీనియర్ పాత్రికేయుడు తెలకపల్లి రవిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామలక్ష్మి ఈ ఇంటర్వ్యూలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనక రహస్యకోణాన్ని బయటపెట్టారు. అప్పట్లో మద్రాస్ లో ఉండే చలనచిత్రపరిశ్రమలోని అనేక రహస్యాలను బయటపెట్టారు. జయకు, శోభన్ బాబుకు మధ్య బంధం గురించి కూడా రామలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను గయ్యాళినని, డేర్డెవిల్ని అని కూడా చెప్పుకున్నారు. విచిత్రమేమిటంటే ఈమెపై కూడా గ్రంథచౌర్యం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. గోరింటాకు చిత్ర కథను తననుంచి కొట్టేసి దాసరి నారాయణరావుకు అమ్మారని రంగనాయకమ్మ కోర్టు కెళ్ళారు. ఈ కేసులో రంగనాయకమ్మే గెలిచారు కూడా. To Read Full Story, Click Here
Image Courtesy: www.Pressks.com
Comments
Post a Comment