Skip to main content

'ఆగడు' కాదు - 'దూకుడు సింగ్'

టీజర్ విడుదలదగ్గరనుంచి గబ్బర్ సింగ్ తో పోల్చబడుతున్న 'ఆగడు' చిత్రం, నిన్న విడుదలతర్వాతచూస్తే ఆ వాదనను నిజంచేసేటట్లుగా ఉంది. చిత్ర రచయితలు, దర్శకుడు శ్రీనువైట్లపై గబ్బర్ సింగ్ ప్రభావం స్పష్టంగా...ముఖ్యంగా మూలకథలో, ఫస్ట్ హాఫ్  లో, సన్నివేశాలలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మరోవైపు శ్రీనువైట్ల-మహేష్ కాంబినేషన్లో వచ్చిన దూకుడు ప్రభావం మరోవైపు. వెరసి ఇది దూకుడుసింగ్ అయింది. ఈ పరమ రొటీన్, ఫార్ములా కథకు కథనంలో కొత్తదనం ఏమీ లేకపోవటం పెద్ద మైనస్.

ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవపెట్టుకునే దర్శకుడు శ్రీనువైట్ల ఈ సారి కోనవెంకట్, గోపిమోహన్ లతో గొడవపెట్టుకుని 'ఆగడు'కు అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ అనే కొత్త రచయితలను పెట్టుకున్నారు. వీరి డైలాగులు బాగానే ఉన్నప్పటికీ అవి సంక్లిష్టంగా, హైరేంజ్ లో ఉండటం ప్రధానంగా మైనస్ పాయింట్. మహేష్ విలన్స్ ను ట్రాప్ చేయటానికి తన పాత హిట్ సినిమాల కథలను చెప్పే కాన్సెప్ట్ సులభంగా అర్ధంకావటంలేదు. మీలో ఎవరు పోటుగాడు ఎపిసోడ్ లోని కాన్సెప్ట్ కూడా అలాగే ఉంది. డైలాగులు, అరుపులు, పంచ్ లు సినిమాలో బాగా ఎక్కువైపోయాయి. మహేష్ డైలాగులు కొన్నిచోట్ల అర్ధంకానంతస్పీడుగా ఉన్నాయంటే ఈ డైలాగులు ఎంత ఎక్కువగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

ఇక శ్రీనువైట్ల దర్శకత్వంలో మెరుపులు ఎక్కడా కనబడలేదు. సినిమా అంతా సాదా, సీదాగా సాగిపోతూ ఉంటుంది. కొన్నిచోట్ల బోరుగాకూడా అనిపిస్తుంది. తమన్ స్వరాలు నానాటికి తీసికట్టుగా తయారవుతుండటం తెలిసిందే. పాటల చిత్రీకరణలో నూతనత్వం, విజువల్ ట్రీట్ ఏమీ అనిపించలేదు. ఫోటోగ్రఫీచూస్తే - పోలీస్ స్టేషన్ సన్నివేశాలలో ఒక ప్రత్యేకమైన టింట్ కనిపించేటట్లు చేశారు. అది ఏమీ ఆహ్లాదకరంగా అనిపించకపోగా, లోపంలాగా కనిపించింది. శృతిహాసన్ పాటలోకూడా ఈ టింట్ కనబడటంతో అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాటల లొకేషన్స్ బాగున్నాయి. సినిమామొత్తం భారీతనం అణువణువునా కొట్టొచ్చినట్లు కనబడింది. ఫస్ట్ హాఫ్ గబ్బర్ సింగ్, సెకండ్ హాఫ్ దూకుడు ప్రభావం బాగా కనిపించింది. సెకండ్ హాఫ్ లో విలన్స్ ను కొట్టే సన్నివేశాలలో నాయక్ చిత్రం గుర్తుకువస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ వీక్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువగా ఉండటం సినిమాకు మరో మైనస్ పాయింట్.

మరోవైపు గతవారం పోలీస్ కథలతోనే అనుక్షణం, పవర్ చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే. 'అనుక్షణం' విమర్శకుల ప్రశంశలు అందుకుంది. 'పవర్'లో రవితేజ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిఫయింగ్ గా, ఎనర్జిటిక్ గా ఉంది. ఇలాంటి సమయంలోనే రిలీజైన ఆగడులో మహేష్ పోలీస్ పాత్రను ఆ పాత్రలతో పోల్చటం అనివార్యం. వాటితో పోలిస్తే ఆగడులో మహేష్ పోషించిన ఎన్ కౌంటర్ శంకర్ పాత్ర గొప్పగా అనిపించదు. ప్రకాష్ రాజ్ శ్రీనువైట్లతో గొడవగురించి ప్రెస్ మీట్ లో చెప్పిన నామీద రాళ్ళు విసరకు, ఇల్లు కట్టుకుంటాను అనే కవితను ఈ చిత్రంలో విలన్ సోనూ సూద్ తో చెప్పించారు.

టాక్ వీక్ అయినప్పటికీ మేగ్జిమమ్ ధియేటర్లలో రిలీజ్ చేశారుకాబట్టి మొదటి వారంలో ఓపెనింగ్స్ ద్వారా నిర్మాతలు బాగానే రాబట్టుకోగలుగుతారు. ఏది ఏమైనా మహేష్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Comments

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.