Skip to main content

నెట్‌లో లభిస్తున్న మీ ఇంటి శాటిలైట్‌మ్యాప్, ఫోటోలు చూసుకోండి!



మీరు లేదా మీవాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉంటున్నట్లయితే, మీ ఇంటి శాటిలైట్ మ్యాపును, 360డిగ్రీలలో ఫోటోలను చూసుకునే అవకాశాన్ని ఒక భారతీయసంస్థ కల్పిస్తోంది. వోనోబో.కామ్ (www.wonobo.com) అనే వెబ్ సైట్ ద్వారా మీరు మీ ఇంటి శాటిలైట్ మ్యాప్, ఫోటోలు చూసుకోవచ్చు. ఆ వెబ్ సైటుకు వెళ్ళగానే, మీరు ఏ నగరం చూడాలనుకుంటున్నారని ప్రశ్న ఎదురవుతుంది. అక్కడున్న డ్రాప్ డౌన్ లోనుంచి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవాలి. మీరు ఆ నగరాన్ని ఎంచుకుని ఎంటర్ నొక్కగానే చార్మినార్ ఫోటో కనిపిస్తుంది. అయితే మీరు చూడాలనుకున్న ప్రదేశంకోసం మీరు కుడివైపు కిందభాగంలో కనిపిస్తున్న మ్యాప్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్ సగభాగంలో మ్యాప్, సగభాగంలో ఫోటో కనిపిస్తాయి. ఆ మ్యాప్ ద్వారా మౌస్ ను కదిలిస్తూ మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళొచ్చు. అక్కడ మీరు చూడాలనుకున్న ప్రదేశం మ్యాప్ తోబాటు, 360 డిగ్రీలలో ఫోటోలు కూడా దర్శనమిస్తాయి. మీరు టెక్నాలజీ పెద్దగా పరిచయంలేనివారైతే, ఈ వెబ్ సైట్ మీకు పల్లెటూరుతప్ప మరేమీ తెలియనివారిని నగరం నడిబొడ్డున వదిలినట్లుగా, కొద్దిగా అయోమయంగానే ఉంటుంది. ఎవరినైనా సాయం తీసుకుంటే నేవిగేషన్ తేలికవుతుంది.

స్ట్రీట్ వ్యూ అనే ఈ సదుపాయాన్ని అంతర్జాతీయ టెక్నాలజీదిగ్గజం గూగుల్ కొంతకాలంగా పలుదేశాలలో అందిస్తోంది. భారత్ లోకూడా ఈ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నా, వివిధ ప్రభుత్వ శాఖలనుంచి అనుమతులు లభించకసతమతమవుతోంది. ఈ సమయంలో ఇద్దరు భారతీయసోదరులు చురుకుగా స్పందించి గూగుల్ తలపెట్టిన ఆ కార్యాన్ని పూర్తిచేసేశారు. సోల్ మాలిక్, సాజిద్ మాలిక్ అనే ఆ సోదరులకు చెందిన జెనెసిస్ ఇంటర్నేషనల్ అనే సంస్థమొదటి విడతలో ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, గోవా, కొలకతా, ఆగ్రా, పూణెవంటి 12నగరాలకు స్ట్రీట్ వ్యూ సేవలను అందించటం ప్రారంభించింది. త్వరలోనే ఈ సేవలను 54 భారతీయనగరాలకు వీరు విస్తరించనున్నారు. వీరు కొంతకాలంగా మ్యాప్ లు రూపొందించే వ్యాపారంలో ఉండటంవలన గూగుల్ సాధించలేని అనుమతులను సాధించటానికి వీరికి వీలయింది.

ప్రజల జీవనవిధానాన్ని రోజురోజుకూ మరింత సౌకర్యవంతంచేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్ట్రీట్ వ్యూ ద్వారా మరో కొత్త సౌకర్యాన్ని ఆవిష్కరించినట్లయింది. చిన్నచిన్న గల్లీలతో సహా దాదాపుగా నగరం అంతటినీ ఫోటోలు తీసి పెట్టటంవలన ఈ స్ట్రీట్ వ్యూ నగర జీవనవిధానంలో పెనుమార్పులే తీసుకురానుంది. నగరంలోని ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ఈ స్ట్రీట్ వ్యూద్వారా గతంలోకంటే సులభంగా, వేగంగా వెళ్ళవచ్చు. వ్యాపార, వాణిజ్యాలలోస్ట్రీట్ వ్యూఎంతో ఉపయోగకరంగా మారనుందని, అయితే ప్రస్తుతానికి తమ సేవలు వాడుకోవటానికి సంస్థలనుంచి ఛార్జీలు వసూలుచేయటంలేదని జెనెసిస్ సంస్థ ఎండీ సాజిద్ మాలిక్ చెప్పారు.



Comments

  1. చాలా ధన్యవాదములండీ. ఇది చాలా ఉపయోగకరమైన సమాచారం.

    ReplyDelete
  2. సురేష్ బాబుగారూ, నేను మీ బ్లాగ్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. మీ స్పందన తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర