Skip to main content

ఇది కఠోర వాస్తవం: టీఆర్ఎస్‌ను గెలిపించింది చంద్రబాబే!

ఈ ఎన్నికల్లో విజయానికి కేసీఆర్ మొట్టమొదట కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు. ఎందుకంటే, ఆఖరినిమిషంలో చంద్రబాబునాయుడు హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలలో చేసిన ప్రచారం టీఆర్ఎస్ కు అనూహ్యరీతిలో కలిసొచ్చింది. చంద్ర బాబు పర్యటనల తర్వాత తెలంగాణలో మూడ్ ఒక్కసారిగా మారిపోయి టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓట్ల పోలరైజేషన్ జరిగింది.Click here to Read the Full Story.

Comments

  1. అవును ఇది కఠోర వాస్తవమే. ఈ వ్యాసంలో వ్రాసిన ప్రతి అక్షరం సత్యమే. ఒప్పుకున్నా ఒప్ప్పుకోక పోయినా అత్యాశకు పోయి చంద్రబాబు దగ్గరుండి తెరాసకు భారీ మెజారిటీ ని కల్పించడంలో చక్కగా సహకరించారు. పిచ్చి కాంగ్రెస్ వాళ్ళు అదనంగా తప్పక వచ్చి చేరుతుందనుకున్న ఓట్ల శాతానికి + ఆర్ధిక అవసరాలకు కక్కుర్తి పడి బొక్క బోర్లా పడ్డారు. వాళ్లంతా వాళ్ళుగా పోటీ చేసి ఉండుంటే తప్పకుండా ఇప్పటికన్నా చాలా, చాలా మెరుగైన ఫలితాలు రాబట్టుకుని ఉండేవారు. పాపం అతిగా ఆశ పడ్డారు.

    కాంగ్రెస్ వాళ్ళూ ఇది గమనించండి - రేప్రొద్దున మీరు గనుక చంద్రబాబుతో ఆంధ్రాలో జత కడితే ఇకపై మీ జీవిత కాల పరిస్థితి ఇప్పటి మీ తమిళనాడు పరిస్థితే. తోక పార్టీగా మిగిలిపోతారు. మిమ్మల్ని జత కలుపుకుని చంద్రబాబు తానూ అందలమెక్కుతాడు తప్ప మీకు అధికారం అప్పచెప్పడు. అలాంటప్పుడు మీకు ఆయనతో చేరితే వచ్చే లాభమేంటి? మీ ఓట్ల శాతాన్ని కలుపుకుని అధికారపు నిచ్చెన ఎక్కుదామనే ఆయన దురాశ తెలుసుకోండి. మీరు ఆయనతో జేరడంతో మీరు ఆయనకు నిచ్చెనవ్వడం తప్ప గత్యంతరం లేదు. పార్లమెంట్ లెక్కలకొస్తే మీరు ఆయనతో జత కట్టకున్నా ఆయన చచ్చినట్లు మీకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితే. లెక్కలేసుకోండి. మీ గొయ్యి మీరే తీసుకోకండి. తస్మాత్ జాగ్రత్త.

    ReplyDelete
  2. అనుకున్నంతా అయింది. తెలంగాణాలో కాంగ్రెస్కి మద్దతిచ్చి గద్దెక్కించేసి ఆంధ్రాలో కాంగ్రెస్ సాయంతో గెద్దెక్కేయాలన్న TDP చాణక్యుం బోల్తాపడింది. ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్కొచ్చిన సీట్లు TDP కి, TDP కొచ్చిన సీట్లు కాంగ్రెస్కి రావడం తప్పదని ప్రజలమాట. TDP కాంగ్రెస్ ల అపవిత్రపొత్తును ప్రజలు ఛీకొట్టేరు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.