కొద్దిరోజులుగా
తెలుగురాష్ట్రాలను కుదిపేస్తున్న
వీరమాచనేని డైట్ ప్లాన్ మీద
తెలుగు మీడియాలో మొట్టమొదటిసారిగా
ఏషియానెట్ వెబ్ సైట్ విస్తృత
కథనాన్ని ఇచ్చిన సంగతి
తెలిసిందే(ఆ
కథనాన్ని చదవాలనుకుంటే ఇక్కడ
క్లిక్ చేయండి). షుగర్
వ్యాధిని ఒక్కరోజులో
తగ్గించుకోవచ్చని చిటికేసి
మరీ చెబుతున్న వీరమాచనేని
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు
రెండింటిలో హాట్ టాపిక్ గా
మారారు. వీరమాచనేనికంటే
ఎంతో ముందుగానే విశాఖపట్నానికి
చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్
పీవీ సత్యనారాయణ ఈ ప్రత్యామ్నాయ
ఆహారవిధానంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు
నయం చేస్తున్నప్పటికీ ఆయనకు
పెద్గగా ప్రచారం లభించలేదు.
దానికి
కారణం సత్యనారాయణ కార్డియో
థొరాసిక్ సర్జన్ కావటం,
సర్జన్
గా తన విధులను కొనసాగిస్తున్నందున
దీనిపై పూర్తిస్థాయి దృష్టి
పెట్టలేకపోవటం. మరోవైపు
వీరమాచనేని చెప్పేతీరు బలంగా
నాటుకుపోయేటట్లు ఉండటం,
విజయవాడలోని
పలువురు ప్రముఖ వైద్యుల మద్దతు
కూడా లభించటంతో ఆయన సిద్ధాంతం
విస్తృతంగా ప్రజలలోకి వెళ్ళింది.
షుగర్
వ్యాధితో ఎన్నోరోజులుగా
బాధపడుతున్నవారికి ఈయన
ఆశాకిరణంలా కనిపిస్తున్నారు.
దీర్ఘకాలికంగా
ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి
దానినుంచి బయటపడే మార్గముందని
ఎవరైనా చెబితే ఆశగా చూడటం
సహజం. ఔత్సాహికులు
కొంతమంది ఈయన డైట్ ప్లాన్ ను
ఆచరిస్తుండగా,
మరికొంతమంది
వేచిచూసే ధోరణిలో ఉన్నారు.
ఆచరించేవారిలో
రాజకీయ నాయకులు, ఐఏఎస్
అధికారులతోసహా ఎందరో ప్రముఖులు
ఉంటున్నారు. మరోవైపు
అల్లోపతి వైద్యులు,
ఒబేసిటీ,
షుగర్
వ్యాధిలను ఆధారంగా చేసుకుని
వ్యాపారం చేసేవారు మాత్రం
వీరమాచనేనిపై విరుచుకుపడుతున్నారు.
మరి
ఈ ఇరుపక్షాలలో ఎవరు కరెక్టో
తెలుసుకోవాలంటే ఇరుపక్షాల
ప్రధాన వాదనలను పరిశీలించాలి.To Read the Full Story, Click Here.
నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని
Comments
Post a Comment