కొద్దిరోజులుగా
తెలుగురాష్ట్రాలను కుదిపేస్తున్న
వీరమాచనేని డైట్ ప్లాన్ మీద
తెలుగు మీడియాలో మొట్టమొదటిసారిగా
ఏషియానెట్ వెబ్ సైట్ విస్తృత
కథనాన్ని ఇచ్చిన సంగతి
తెలిసిందే(ఆ
కథనాన్ని చదవాలనుకుంటే ఇక్కడ
క్లిక్ చేయండి). షుగర్
వ్యాధిని ఒక్కరోజులో
తగ్గించుకోవచ్చని చిటికేసి
మరీ చెబుతున్న వీరమాచనేని
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు
రెండింటిలో హాట్ టాపిక్ గా
మారారు. వీరమాచనేనికంటే
ఎంతో ముందుగానే విశాఖపట్నానికి
చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్
పీవీ సత్యనారాయణ ఈ ప్రత్యామ్నాయ
ఆహారవిధానంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు
నయం చేస్తున్నప్పటికీ ఆయనకు
పెద్గగా ప్రచారం లభించలేదు.
దానికి
కారణం సత్యనారాయణ కార్డియో
థొరాసిక్ సర్జన్ కావటం,
సర్జన్
గా తన విధులను కొనసాగిస్తున్నందున
దీనిపై పూర్తిస్థాయి దృష్టి
పెట్టలేకపోవటం. మరోవైపు
వీరమాచనేని చెప్పేతీరు బలంగా
నాటుకుపోయేటట్లు ఉండటం,
విజయవాడలోని
పలువురు ప్రముఖ వైద్యుల మద్దతు
కూడా లభించటంతో ఆయన సిద్ధాంతం
విస్తృతంగా ప్రజలలోకి వెళ్ళింది.
షుగర్
వ్యాధితో ఎన్నోరోజులుగా
బాధపడుతున్నవారికి ఈయన
ఆశాకిరణంలా కనిపిస్తున్నారు.
దీర్ఘకాలికంగా
ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి
దానినుంచి బయటపడే మార్గముందని
ఎవరైనా చెబితే ఆశగా చూడటం
సహజం. ఔత్సాహికులు
కొంతమంది ఈయన డైట్ ప్లాన్ ను
ఆచరిస్తుండగా,
మరికొంతమంది
వేచిచూసే ధోరణిలో ఉన్నారు.
ఆచరించేవారిలో
రాజకీయ నాయకులు, ఐఏఎస్
అధికారులతోసహా ఎందరో ప్రముఖులు
ఉంటున్నారు. మరోవైపు
అల్లోపతి వైద్యులు,
ఒబేసిటీ,
షుగర్
వ్యాధిలను ఆధారంగా చేసుకుని
వ్యాపారం చేసేవారు మాత్రం
వీరమాచనేనిపై విరుచుకుపడుతున్నారు.
మరి
ఈ ఇరుపక్షాలలో ఎవరు కరెక్టో
తెలుసుకోవాలంటే ఇరుపక్షాల
ప్రధాన వాదనలను పరిశీలించాలి.To Read the Full Story, Click Here.
ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి - లింక్ .
Comments
Post a Comment