సంఘ్ పరివార్కు చెందిన మాజీ ఎంపీ తరుణ్ విజయ్ దక్షిణాదివారిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తేనెతుట్టెను కదిపినట్లయిన సంగతి తెలిసిందే. ఉత్తర-దక్షిణ ప్రాంతవాసుల మధ్య చిరకాలంగా అంతరాంతరాలలో ఉన్న ఒక చిన్నపాటి వైషమ్యాన్ని తరుణ్ విజయ్ మళ్ళీ రాజేశారనే చెప్పాలి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో ఈ అంశంపై తీవ్రచర్చ జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే సంఘ్ పరివార్ మద్దతుదారులు, మిగతావారిమధ్య పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి.To Read Full Story, Click Here.
నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...
ఉత్తరాదిలో దక్షిణ భారతీయుల మీద అత్యంత చులకన ఉందని కొందరు (ముఖ్యంగా తమిళనాడు & ఆంద్ర రాష్ట్రాల నుండి) భావిస్తారు. నిజానికి పరిస్థితి అంత తీవ్రం కాదు.
ReplyDeleteప్రతి చోటా ఎదో ఒక సముదాయంపై కొంత మేర అభిప్రాయ లోపాలు ఉంటాయి. ఉ. బొంబాయిలో గుజరాతీలు, బెంగుళూరులో తమిళులు. ఈ కొద్ది పాటి అపోహలను కొండంత చేయడం తగదు.